అన్వేషించండి

Trinayani Serial Today April 3rd: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపే గాయత్రీ దేవి అని క్లారిటీ ఇచ్చిన విశాలాక్షి.. కనిపెట్టలేకపోయారే!

Trinayani Serial Today Episode నాగులావరం నుంచి బంగారం తీసుకొని వచ్చిన లలితాదేవి వాటిని సుమనకు ఇస్తాను అంటే సుమన వద్దు అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Telugu Serial Today Episode విశాలాక్షి దంచుతున్న బియ్యం పిండి పాలు ఎవరి మీద పడతాయా అని అందరూ కంగారు పడతారు. ఇక హాసిని ఆ పాలు తన మీద అయినా, పావానామూర్తి, విశాల్‌ ముగ్గురిలో ఒకరి మీద పడతాయని టెన్షన్ పడుతుంది. పావనామూర్తి, విశాల్ కూడా కంగారు పడతారు. ఇక విశాలాక్షి దంచిన ఆ బియ్యం పిండి పాలు గాయత్రీ పాప మీద పడతాయి. అందరూ షాక్ అయిపోతారు. 

ఎద్దులయ్య: అర్థమవుతుందా పుత్ర.
వల్లభ: పెద్దమ్మ గురించి ఈ గాయత్రీ పాపకు తెలుసు అని అర్థమా..
విశాలాక్షి: అవును.. గాయత్రీకే అంతా తెలుసు. 
విశాల్: మనసులో.. అమ్మకి అమ్మ గురించి తెలియకపోవడం ఏంటి. తెలిసినా నోటి నుంచి మాట రాదు కదా..
హాసిని: వెరీ గుడ్ అడగండి పాపని పాప చెప్తుంది.
దురంధర: జోకులేయ్యకే.. అమ్మా పాలు ఇవ్వు అని నోరు తెరిచి అడగలేని చిన్న పిల్లకి ఏం తెలుస్తుంది.
నయని: గాయత్రీ పాపకి గాయత్రీ దేవి గురించి తెలిసే ఉంటుంది అంటే దీని వెనక ఆలోచించాల్సిన విషయం ఏదో ఉండే ఉంటుంది పిన్ని.  
సుమన: పాల రవ్వలు ఈ పిల్ల మీద ఎందుకు పడాలి? వేరే ఎవరితో మీద అయినా పడొచ్చు కదా.
విశాలాక్షి: దగ్గరే ఉన్న ఎద్దులయ్య మీద పడలేదు.. అమ్మ మీద పడలేదు.. నా మీద ఒక చుక్క కూడా పడలేదు.. సరాసరి పాప మీద పడ్డాయి అంటే అర్థమేంటి..
వల్లభ: అంటే గాయత్రి పెద్దమ్మ నీడ జాడ అన్నీ ఈ పిల్లకే తెలుసని అంటావా గారడీ పిల్ల.
 విశాలాక్షి: అందులో సందేహమే లేదు.
వల్లభ: వెరీ ఇంట్రెస్టింగ్ బుజ్జి పిల్లకు తెలుసు గాని మాట్లాడ లేదే.
సుమన: వీళ్లు ఏదో కాకమ్మ కథలు చెప్తుంటే మీరు వింటారు ఏంటి బావగారు వాళ్లకి ఎలా తెలుస్తుంది.
విక్రాంత్: ఏయ్ లేదు లేదు ఇందులో ఏదో లాజిక్ ఉండే ఉంటుంది.
ఎద్దులయ్య: వీళ్లింకా నమ్మడం లేదమ్మా.
విశాలాక్షి: నిరూపించాలా..
విశాల్: వద్దు.. పాప వైపు అందరూ కల్లార్పకుండా చూస్తే దిష్టి తగిలేలా ఉంది.
విశాలాక్షి: దిష్టి కూడా పోతుంది నాన్న. సుమన నీ చేతిలో ఉన్న బియ్యం ముద్దను కూడా వదిలేయ్.. అది నేరుగా గాయత్రి పాప దగ్గరకే వెళుతుంది.
సుమన: నేను పెద్ద బావగారి వైపే మల్లిస్తాను అప్పుడు కూడా అది గాయత్రి పాప వైపే వెళితే నువ్వు చెప్పింది నిజమని నమ్మొచ్చు. సుమన బియ్యం ముద్దను వల్లభవైపు విడిచి పెట్టినప్పటికీ అది గాయత్రి పాప వైపే వెళుతుంది దీంతో అందరూ షాక్ అవుతారు. 

మరోవైపు విశాల్ హాసిని మాట్లాడుకుంటారు. హాసిని కంగారుగా విశాల్ తో ఈ టెన్షన్ నేను భరించలేను. గాయత్రి పాపే గాయత్రీ దేవి అని అందరికీ చెప్పేస్తానని అంటుంది. దానికి విశాల్ వదిన అంత పని చేయొద్దు అని అంటాడు. ఇంతలో నయని అక్కడికి వస్తుంది. గాయత్రీ అమ్మగారి గురించి మాట్లాడాలి అంటుంది.  

నయని: గాయత్రీ అమ్మగారి జాడ తెలుస్తుంది అని విశాలాక్షి చెప్పినట్లు చేశాం కానీ మనకు తెలియాల్సింది గాయత్రీ పాప గురించి అని అనిపిస్తుంది బాబుగారు.
హాసిని: తనలో తాను కరెక్ట్‌గా అడిగినప్పుడు సమాధానం దాచడం ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది. 
విశాల్: నయని గాయత్రీ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏముంటుంది. 
నయని: గాయత్రీ అమ్మగారి గురించి అందరి కంటే విశాల్ బాబుగారికి ఎక్కువ తెలిసుండాలి కానీ పాపకు తెలియడం ఏంటి. అసలు ఆ పాలు ఎందుకు పాప మీద పడ్డాయి. అందరం అక్కడే ఉన్నాం మన ఎవరి మీద ఎందుకు పడలేదు. పాప మీదే పడ్డాయి అంటే దాని అర్థం. 
హాసిని: గాయత్రీ దేవి అని..
నయని: అంటే.. గాయత్రీ పాపకు గాయత్రీ దేవికి ఏంటి సంబంధం..
విశాల్: నయని పాపకు మా అమ్మ గురించి ఏం తెలుసో తనకు మాటలు వచ్చే వరకు తెలుసుకోలేం. ఎక్కువ ఆలోచించకు. 

మరోవైపు ఎద్దులయ్య, డమ్మక్క, పావనా మూర్తిలు గాయత్రీ పాపని హాల్‌లో ఆడిస్తారు. ఇంతలో గురువుగారు, లలితాదేవి ప్రసాదం తీసుకొని అక్కడికి వస్తారు. ఇక నయని ఆ ప్రసాదం తీసుకోవాలి అని వెళ్లగా గురువుగారు ఆపి అది విశేషమైన ప్రసాదం అని వారసత్వాన్ని అందించే ముగ్గురు కోడళ్లకు సమానంగా ఇవ్వాలా లేక ఒక్కరికే ఇవ్వాలా అనేది లలితా దేవి ఇష్టం అంటారు. కేవలం మళ్లీ పిల్లలు కనాలి అనుకునేవారే ఆ ప్రసాదం తినాలి అని అంటారు. 

నయని తమనకు బిడ్డ కనే ఆలోచిన లేదు అంటుంది. ఇద్దరు కోడళ్లు ప్రసాదం తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నయని తీసుకుంటుంది. ఇక ప్రసాదం ఏముందో చూడమని అంటే నయని చూడగానే అందులో బంగారం ఉంటుంది. దీంతో సుమన ముందే చెప్పాలి కదా అని అంటుంది. గాయత్రీ పాప పేరు మీద ఆస్తి రాసినందుకు బంగారం ఇవ్వలేదు అని బాధ పడ్డాను అనగానే ఇప్పుడు ఇవ్వమన్నారు అని లలితాదేవి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: మృణాల్ ఠాకూర్: బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో ముద్దుగా ఉన్న మృణాల్ ఠాకూర్.. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్​లో బిజీగా ఉన్న బ్యూటీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget