Krishnamma kalipindi iddarini July 29th: ప్లాన్ ఫెయిల్ అయినందుకు మరో ప్లాన్ చేయడానికి సిద్ధమైన సౌదామిని.. నిజానికి దాచుతున్నందుకు కుమిలిపోతున్న గౌరీ?
భర్తకు నిజం చెప్పలేక గౌరీ బాధపడుతూ ఉండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Krishnamma kalipindi iddarini July 29th: సౌదామిని ఈశ్వర్ కు ఆదిత్య ప్రేమ గురించి చెప్పేస్తుంది. నీ మీద ప్రమాణం చేసి ఆదిత్యను అమృత ప్రేమ గురించి అడుగుతే నిజం చెబుతాడు అని సలహా ఇస్తుంది. ఆదిత్య తనను ప్రేమిస్తున్నాడు కాబట్టే తను పెళ్లిలో కూడా బాధతో కనిపించాడు అని చెబుతుంది. ఇక గౌరీ తో నీ పెళ్లి కావడానికి అని మరో నిజం చెప్పబోతుండగా అప్పుడే తన తల్లి వచ్చి వ్రతం కు ఏర్పాట్లు జరిగాయి రమ్మని తీసుకెళ్తుంది.
ఇక ఈశ్వర్ ఇప్పుడే ఆదిత్యను అడగాలి అని పైకి వెళ్తాడు. ఒక గౌరీ బాధపడుతూ గ్రీటింగ్ కార్డు, ఫోటోలను దాచిపెట్టి అక్కడినుండి వెళ్తుండగా ఈశ్వర్ ఎదురు పడతాడు. ఈశ్వర్ కంగారులో ఉండటంతో ఏం జరిగింది అని అడుగుతుంది. ఆదిత్య ఎక్కడ అని ఈశ్వర్ అడగటంతో ఇప్పటివరకు మీతోనే ఉన్నాడు కదా మళ్లీ ఎక్కడికి వెళ్తాడు అని అనుమానంగా అడుగుతుంది. ఇక ఈశ్వర్ తన మనసులో ఆదిత్య కంటే ముందు గౌరీని అడుగుతే సరిపోతుంది కదా అని అనుకుంటాడు.
ఇక గౌరీ తో అమృత తెలుసా అని అడగటంతో గౌరీ షాక్ అవుతుంది. దాంతో తడబడుతూ తెలుసు అని అంటుంది. అమృత, ఆదిత్యలు ప్రేమించుకున్నారని.. ఆదిత్య ఇష్టం లేకుండా అఖిలను పెళ్లి చేసుకున్నాడని అనుమానం ఉంది అని తనకు ఆదిత్య పెళ్లి సమయంలో ఎలా ఉన్నాడో తెలియదు కాబట్టి నువ్వే చెప్పు అనటంతో.. అలా ఏమీ లేదు సంతోషంగా ఉన్నాడు అని బాధపడుతూ చెబుతుంది.
ఇక మనసులో తన అత్త మాట్లాడిన మాటలు తలుచుకొని నిజం చెప్పలేక కుమిలిపోతూ ఉంటుంది. మనిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు కదా.. ప్రతి చిన్న విషయాన్ని కూడా పంచుకుంటాము కాబట్టి ఈ విషయాన్ని నేను అడుగుతున్నాను అనటంతో అలాంటిదేమీ లేదు అని బాగా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు సౌదామిని గత తన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని తెగ మురిసిపోతుంది.
వ్రతం జరిగాక బీభత్సమే అని.. ఈశ్వర్ ఆదిత్యను అడిగేసి ఉంటాడు అని అనుకుంటుంది. ఇక ఈశ్వర్ నవ్వుకుంటూ రావడంతో ఆశ్చర్య పోతుంది. ఈశ్వర్ రాగానే మళ్లీ ఆదిత్య విషయం గురించి తీయడంతో.. అటువంటిదేమీ లేదు అని.. తను చాలా సంతోషంగా ఉన్నాడని గౌరీ చెప్పింది అని అక్కడి నుంచి వెళ్తాడు. దాంతో సౌదామిని తన ప్లాన్ గౌరీ పాడు చేసింది అని మరోవైపు నుండి నరుక్కొస్తాను అని మరో ప్లాన్ చేయడానికి సిద్ధమవుతుంది.
అప్పుడే అక్కడికి దుర్గా భవాని రావడంతో అఖిల తెగ సంతోషపడుతుంది. ఇంతసేపు ఒంటరిగా ఉన్నానని బాధనిపించింది.. ఇక నువ్వు వచ్చావు కదా ధైర్యం వచ్చింది అని అంటుంది. దాంతో భవాని ఎందుకు అనటంతో.. వ్రతం అయిపోయేలోపు గౌరీ ని ఇరికించాలని చూశాను ఇప్పుడు నువ్వు నాకు సపోర్టుగా ఉన్నావు కదా అని తెగ సంతోషపడుతుంది.
గౌరీ తన తల్లిని చూసి అఖిల పెళ్లిని బలవంతంగా చేయించింది తన తల్లి అని కోపంగా చూస్తుంది. తల్లి దగ్గరికి వెళ్ళగానే అప్పుడే పూజ కోసం సునంద వచ్చి పిలుస్తుంది. పూజ జరుగుతున్నంత సమయంలో గౌరీ ఆలోచనలు మొత్తం ఈశ్వర్ పైనే ఉంటాయి. ఈశ్వర్ కి నిజం చెప్పలేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. గౌరీని చూసి సునంద కూడా బాధపడుతూ ఉంటుంది.
also read it: Prema Entha Madhuram July 28th: అందరి ముందు ఆర్యకు కర్రీ నచ్చదంటూ నోరు జారిన అను.. మాన్సీని గట్టిగా కొరికిన సత్తెమ్మ?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















