Nindu Noorella Saavasam Serial Today December 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: విశ్వరూపం చూపించిన మిస్సమ్మ – మిస్సమ్మ ధైర్యానికి అమర్ ఫిదా
Nindu Noorella Saavasam Today Episode: పిల్లల కోసం వచ్చిన తీవ్రవాదులను భాగీ చితక్కొట్టుడు కొట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: తీవ్రవాదులు ఇంట్లోకి రావడానికి డోర్ బాదుతుంటారు. శివరాం లోపలకి వెళ్లి గన్ తీసుకుని వచ్చి డోర్ కు ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. ఇంతలో డోర్ ఓపెన్ అవుతుంది. శివరాం తీవ్రవాదులను కాలుస్తాడు. బుల్లెట్ ప్రూఫ్ ఉండటంతో వాళ్లకు ఏమీ కాదు. లోపలికి వచ్చి ఉగ్రవాదులు శివరాంను కొట్టి పిల్లల కోసం పైకి వెళ్తుంటే భాగీ వచ్చి వాళ్లను కొడుతుంది.
భాగీ: మామయ్య మీరు కూర్చోండి.
ఆరు: గుప్త గారు లోపల ఏం జరుగుతుంది.
అని అడుగుతుంది. భాగీ కొట్టడంతో ఉగ్రవాదులు పారిపోతారు. ఇంతలో బయటకు వచ్చిన పిల్లలు భాగీని హగ్ చేసుకుంటారు. మనోహరి షాకింగ్ గా చూస్తుంది.
ఆరు: హమ్మయ్యా.. థాంక్యూ దేవుడా..
అమ్ము: మాకు చాలా భయం వేసింది మిస్సమ్మ.
నిర్మల: ఏవండి మీకేం కాలేదుగా.. మిస్సమ్మ నువ్వు కనకే లేకుంటే ఇవాళ పిల్లలు, ఆయన, మేమంతా బతికి ఉండేవాళ్లం కాదు మిస్సమ్మ.
అంటూ దండం భాగీకి పెడుతుంది నిర్మల. ఇంతలో అమర్ వస్తాడు. పిల్లలందరూ అమర్ దగ్గరకు వెళ్తారు.
శివరాం: అమర్ ఈ కుటుంబాన్ని కాపాడే క్రమంలో నేను విఫలం అయ్యాను. సమయానికి మిస్సమ్మ వచ్చి మమ్మల్ని అందర్ని కాపాడింది. ఒకవేళ మిస్సమ్మే సమయానికి రాకుంటే ఈ పిల్లలు మేము అందరం శవాలుగా మారిపోయి ఉండే వాళ్లం.
అని శివరాం చెప్పగానే అమర్ వెంటనే భాగీని హగ్ చేసుకుని థాంక్స్ చెప్తాడు. మనోహరి షాక్ అవుతుంది. గార్డెన్ లో కూర్చున్న ఆరు మిస్సమ్మ తీవ్రవాదులను కొట్టింది గుర్తు చేసుకుంటుంది.
ఆరు: అబ్బబ్బా అసలు మిస్సమ్మ ఒక్కొక్కరిని ఏం కొట్టింది గుప్త గారు.
గుప్త: మా నరకం నందు కూడా అటుల శిక్షించరు. యమపురి వాసులం నరకమున ఎన్నో శిక్షలను స్వయముగా వీక్షించిన ఈ చిత్ర విచిత్రగుప్తుడినే భయ బ్రాంతులకు గురి చేసింది.
ఆరు: అసలు మిస్సమ్మలో ఈ యాంగిల్ ఉందని ఎప్పుడు గెస్ చేయలేదు గుప్తగారు. ఆ ప్లేస్ లో నేను ఉన్నా కూడా నేను నా పిల్లలను కాపాడుకోలేకపోయేదాన్ని గుప్త గారు. నా ప్రాణం పోయే వరకు పోరాడేదాన్నేమో కానీ వాళ్ల ప్రాణాలు కాపాడేదాన్ని కాదు. పిల్లలకు తల్లిగా ఇంటికి కోడలుగా మిస్సమ్మే కరెక్టు అనిపిస్తుంది గుప్త గారు.
గుప్త: నిన్నటి వరకు ఆ బాలిక నీ పతి దేవునకు దగ్గర అవుతున్నదని బాధపడ్డావు. నేడు ఆ బాలికే గొప్పదని అంటున్నావు..
ఆరు: నా కథ ముగిసిపోయిందని తెలిసినా.. ఆయన జీవితంలో మిస్సమ్మ ఉందనడానికి కొంచెం టైం పడుతుంది గుప్త గారు. అవునూ.. మిస్సమ్మ అంత మందిని కొట్టింది కదా… రేపు ఎప్పుడైనా మా ఆయన మీద కోపం వచ్చి ఆయన్ని కూడా కొడితే ఏంటి పరిస్థితి.
అని ఆరు అడగ్గానే నీకు సరియైన అనుమానమే వచ్చింది బాలిక అంటాడు గుప్త. తర్వాత భాగీ ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తుంటే.. పిల్లలు కిందకు వస్తారు. అంజు, మిస్సమ్మను చూస్తూ.. భయపడుతుంది.
అమ్ము: అంజు ఎందుకు అంత భయపడుతున్నావు.
అంజు: నేను మిస్సమ్మను ఇంతకు ముందు తిట్టింది గుర్తుకు వస్తుంది. నిన్న రౌడీలను కొట్టింది గుర్తుకు వచ్చింది అందుకే భయపడుతున్నాను. చూశారా అమ్ము ఏమీ తెలియనట్టు మిస్సమ్మ డబుల్ యాక్షన్ చేస్తుంది.
భాగీ: పిల్లలూ ఎందుకు ఇంత త్వరగా లేచారు ఇవాళ లీవ్ కదా..
అంజు: లేదు మిస్సమ్మ ఇవాళ్టీ నుంచి అన్ని రూల్స్ ప్రకారమే జరుగుతాయి.
రాథోడ్: అవును మిస్సమ్మ నిన్న వాళ్లను కొట్టడం కొంచెం ఆపేసి.. మేము వచ్చాక కొట్టి ఉంటే బాగుండు కదా..? నీ కొట్టుడు గురించి అందరూ కథలు కథలుగా చెప్తున్నారు. మేము వచ్చాక కొడితే మేము చూసేవాల్లం కదా..? అయినా నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు మిస్సమ్మ.. మా సార్ కు చెప్తాను నువ్వు కూడా ఆర్మీలో జాయిన్ అవ్వు.
అని రాథోడ్ చెప్పగానే భాగీ నవ్వుతుంది. తర్వాత ముగ్గు వేస్తున్న భాగీ దగ్గరకు ఆరు వెళ్లి నిన్న మీ ఇంట్లో జరిగిన సంఘటన తెలిసింది. అంత మందిని ఎలా కొట్టావు అని అడుగుతుంది. అవసరం నేర్పించింది అక్కా.. పిల్లల కోసం కొద్ది రోజుల నుంచి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్నాను అంటుంది భాగీ. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















