Lakshimi Raave Maa Intiki Serial Today May4th: సింధూను ఇంటికి తీసుకొచ్చేసిన ప్రియంవద....కడుపుతో ఉన్నానని ఇంట్లోవాళ్లకు అబద్ధం చెప్పిన సింధూజాక్షి
Lakshimi Raave Maa Intiki Serial Today Episode May4th:సింధూను ఇంటికి తీసుకొచ్చేసిన ప్రియంవద....కడుపుతో ఉన్నానని ఇంట్లోవాళ్లకు అబద్ధం చెప్పిన సింధూజాక్షి

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: సింధూ పురుగులమందు తాగడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చి గోపీ...పెద్దయ్యకు ఫోన్ చేస్తాడు.కానీ ఆ ఫోన్ లిప్ట్ చేసిన ప్రియంవద...వెంటనే శ్రీకాకుళం వెళ్లిపోతుంది.సింధూకు ప్రాణాపాయం లేదని...కడుపు మొత్తం క్లీన్ చేశామని డాక్టర్లు చెప్పగా....గోపీ ఊపిరి పీల్చుకుంటాడు. కానీ వాళ్ల అమ్మ ఏడుస్తుంది. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావ్....సింధూకు ఏం కాదని చెప్పారు కదా అని అంటాడు. కానీ కడుపు మొత్తం క్లీన్ చేశారంటే....కడుపు పోయినట్లేగా అని వాళ్ల అమ్మ అంటుంది. పిల్లలు కావాలంటే మళ్లీ ప్లాన్ చేసుకోవచ్చులే అని గోపీ అంటాడు. కానీ సింధూకు ఏం జరగలేదుకదా అని చెబుతాడు.ఇంతలో ప్రియంవద అక్కడికి వస్తుంది. ఆవిడను చూడగానే గోపీ వాళ్ల అమ్మ భయపడుతుంది. సింధూ ఎక్కడ ఉందని అడగ్గా...ఐసీయూలో ఉందని చెబుతారు. దీంతో ఆమె వెళ్తుండగా...వెనక గోపీ రావడానికి ప్రయత్నించగా వద్దని ప్రియంవద ఆపుతుంది.
ఐసీయూలో మత్తులో ఉన్న సింధూ వద్దకు వెళ్లి ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేస్తావా అని గట్టిగా ప్రియంవద నిలదీస్తుంది. అయినా నువ్వు ఎందుకు వచ్చావని సింధూ అడుగుతుంది. గోపీ ఫోన్ చేసి చెప్పాడని చెప్పగా....గోపీ ఫోన్ చేస్తే నాన్నకు చేస్తాడు గానీ నీకు ఎందుకు చేశాడని ప్రశ్నించగా...నాన్నకు చేస్తేనే నేను లిప్ట్ చేసి వచ్చానని చెబుతంది.అయినా ఇలా పురుగుల మందు తాగుతారా ఎవరైనా అని గట్టిగా ప్రశ్నిస్తుంది. నేను నీ మేనకోడల్ని అత్తయ్య...పురుగులమందు తాగాల్సిన ఖర్మ నాకు పట్టలేదని అంటుంది.
మరి ఇదంతా ఏంటని అడగ్గా...ఉత్త నాటకమని చెబుతుంది. గోపీని బెదిరించడానికే ఇలా నాటకం ఆడాన్ని చెబుతుంది.నోటిలో పేస్ట్ వేసుకుని పుక్కిలిస్తే నురగ వచ్చిందని...వీళ్లేమో పురుగుల మందు తాగానని భయపడి ఆస్పత్రికి తీసుకొచ్చారని చెబుతుంది. నేను బెదిరిస్తే గోపీ భయపడతాడని అనుకున్నా కానీ...తాతయ్యకు ఫోన్ చేసి చెబుతాడని అనుకోలేదని అంటుంది. అయినా ఇప్పుడు గోపీని బెదిరించాలన్సిన అవసరం ఏం వచ్చిందని అడుగుతుంది. మొన్న విడాకుల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు...సడెన్గా గోపీ మాటమార్చి విడాకుల పేపర్లపై సంతకాలు పెట్టకుండా మొండికేశాడని చెబుతుంది. అందుకే గోపీని భయపెట్టడానికి పురుగుల మందు నాటకం ఆడానని చెబుతుంది. అయితే నువ్వు నాతోపాటే వచ్చేయమని చెప్పగా ….సింధూ సరేనని అంటుంది.
సింధూను తీసుకుని బయటకు వచ్చిన ప్రియంవద....తనను నాతోపాటు ఊరికి తీసుకెళ్తున్నానని...నాలుగురోజులు ఉంచుకుని అన్నీ సర్దుకున్న తర్వాత పంపిస్తానని చెబుతుంది. ఇంతలో మీరు ఎవరికి ఫోన్ చేసి ఏం చెప్పొద్దని హెచ్చరిస్తుంది. మా నాన్న అడిగినా ఏదో చెప్పి మ్యానేజ్ చేయమని చెబుతుంది.గోపీ తల్లి కూడా ఇదే సరైన పనని వెంటనే తీసుకెళ్లమని సింధూను పంపిస్తుంది. సింధూని తీసుకుని ఇంటికి రాగా...ఇంట్లో అందరూ ఎంతో సంతోషపడతారు.అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యనారాయణ నువ్వు ఏంటి ఇలా వచ్చావని అడుగుతాడు.
తను ఆస్పత్రిలో ఉండి ఫోన్ చేస్తే నేనే వెళ్లి తీసుకొచ్చానని మీరు కంగారుపడతారని చెప్పలేదని ప్రియంవద అంటుంది. అయినా మాకు అత్తారింటి నంచి అమ్మాయిని తీసుకొచ్చే పద్ధతి ఇది కాదని...అసలు అక్కడ ఏం జరిగిందో గోపీకి ఫోన్ చేసి కనుక్కోమని సూర్యనారాయణ కొడుకును ఆదేశించగా....ఇది ఆడవాళ్లకు సంబంధించిన విషయమని ప్రియంవద అబద్ధం చెబుతుంది. గోపీ దగ్గర ఉండి తనను నాతో పంపించాడని చెబుతుంది.దీంతో సుకన్య అమ్మాయి కడుపుతో ఉందా అని అడగ్గా....అందరూ సంతోషంగా సింధూను ప్రశ్నిస్తారు.వాళ్ల నుంచి తప్పించుకోవడానికి సింధూ కూడా అవునని చెబుతుంది.
ట్రెండింగ్ వార్తలు




















