అన్వేషించండి
Lakshimi Raave Maa Intiki Serial Today March 9th: తన బిడ్డ బతికే ఉందని తెలుసుకున్న ప్రియంవద ఏం చేసింది..? భర్తను పనోడిగా సింధూ చెబుతున్న అబద్ధం స్నేహితురాళ్లకు తెలిసిపోయిందా..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 9th: తన బిడ్డ బతికే ఉందని తెలుసుకున్న ప్రియంవద ఏం చేసింది..? భర్తను పనోడిగా సింధూ చెబుతున్న అబద్ధం స్నేహితురాళ్లకు తెలిసిపోయిందా..?

లక్ష్మీ రావే మా ఇంటికి టుడే ఏపిసోడ్
Source : ZEE5.com
Lakshimi Raave Maa Intiki Serial Today Episode: నర్సు నేరుగా ఇంటికి రావడంతో ప్రియంవద భయపడి బయటకు వెళ్తుంది.మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావని నిలదీస్తుంది.అయినా నీకు డబ్బులు ఇవ్వనని చెప్పాను కదా అని బెదిరిస్తుంది. మీకు ఓ షాకింగ్ నిజం చెప్పానంటే అదిరిపడతారని అంటుంది.ఏంటని అడగ్గా...మీరు మీ బిడ్డను చంపమని నాకు ఇచ్చారు కదా...నేను ఆ పని చేయలేదని చెప్పడంతో ప్రియంవద కాళ్ల కింద భూమి కదులుతుంది. ఆ పసిగుడ్డును అప్పుడే చంపేయమని నీకు డబ్బులు ఇచ్చాను కదా...నన్నే మోసం చేస్తావా అని నిలదీస్తుంది. మీలాగా నేను పేగుబంధం తెంపుకోలేకపోయానని నర్సు చెబుతుంది.
అసలు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం వివరిస్తుంది. నేను ఆ బిడ్డను నీళ్లలో పడేసేందుకు వెళ్లగా..అప్పుడు అక్కడికి ఒకతను వచ్చాడని చెబుతుంది. చాలామంది పిల్లలు లేక అల్లాడుతుంటే..మీరు మాత్రం పుట్టిన బిడ్డను ఇలా చంపుకుంటారా అని నిలదీశాడని అంటుంది. ఈ బిడ్డ నాబిడ్డ కాదని చెప్పగా.....నీకు అభ్యంతరం లేకపోతే ఈ పసిబిడ్డ ఆ దేవుడు ఇచ్చిన బిడ్డగా నేను పెంచుకుంటానని చెబుతాడు. అలా నా చేతిలో డబ్బలు పెట్టి పసిబిడ్డను తీసుకెళ్లిపోయాడని నర్సు ప్రియంవదకు చెబుతుంది.
ఆ మాటలు విన్నవెంటనే ప్రియంవద్ద నర్సు గొంతుపట్టి నులిమేస్తుంది. నిన్ను బతకనివ్వనని అంటుంది. మీకు ఇంకో విషయం చెప్పాలని అనగానే వదిలిపెడుతుంది. ఆరోజు నా చేతుల్లో నుంచి పసిబిడ్డను తీసుకెళ్లిన వాడిని ఈరోజు నేను కళ్లారా చూశానని చెప్పగానే.....ప్రియంవద ఇంకాస్త కంగారుపడుతుంది. వాడు ఎవడని అడగ్గా...నేను పట్టుకునేలోపే ఆటో ఎక్కి వెళ్లిపోయాడని చెబుతుంది. వెంటనేవాడు ఎవడో కనిపెట్టమని ప్రియంవద అనగా...దానికి చాలా ఖర్చు అవుతుందని నర్సు మళ్లీ బ్లాక్మెయిల్ చేస్తుంది. వెంటనే ప్రియంవద తన చేతికి ఉన్న గాజులు తీసి నర్సు చేతిలో పెడుతుంది. వీలైనంత త్వరగా వాడు ఎవడో కనిపెట్టి నాకు చెప్పాలని అనగా...నాకు తెలుసు ప్రియంవద ఈ నిజం కోసం మీరు ఎంత డబ్బులు అయినా ఇస్తారని నర్సు అనుకుంటుంది. బంగారపు నగలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.ఇళ్లంతా తిరిగి చూసిన కోటేశ్వరరావు పెద్దాయన వద్ద సెలవు తీసుకుని తిరిగి వెళ్లిపోతాడు.
సింధూజాక్షిని చూసేందుకు శ్రీముఖలింగం వచ్చిన ఆమె స్నేహితురాళ్ల ముందు తన గోపీ తన భర్త అన్న నిజం భయటపడకుండా చాలా తెలివిగా నాటకం అడుతుంటుంది. దీనికి గోపీ కూడా సహకారం అందిస్తుంటాడు. మీ ఆయన ఎక్కడ ఉన్నాడని వాళ్లు అడగ్గా....బిజినెస్ పనిమీద చెన్నై వెళ్లారని అబద్ధం చెబుతుంది. వాళ్లు ఇక్కడే ఉంటే అన్నీ ఆరా తీస్తారని భావించి వెంటనే ఈ ఊరు నుంచి పంపించేందుకు చూస్తుంది.అయితే సింధూ పక్కకు వెళ్లగానే...వాళ్ల అత్తయ్య అక్కడికి వస్తుంది. గోపీని భోజనానికి పిలవగా...అదేంటి పనోడిని పట్టుకుని మా అబ్బాయి అంటున్నారని అడుగుతారు. వాడే సింధూజాక్షి మొగుడని...మా అబ్బాయిని చెబుతుంది. వాడు బిజినెస్లు ఏం చేయడని వ్యవసాయం చేస్తాడని చెబుతుంది.
దీంతో సింధూ ఫ్రెండ్స్కు విషయం అర్థమవుతుంది. సింధూ మన దగ్గర కావాలనే అబద్ధం చెబుతోందని....తాళి కట్టిన భర్తనే పనోడిగా ట్రీట్ చేస్తోందని వాళ్లకు కోపం వస్తుంది. దాని నోటి నుంచే గోపీ తన భర్త అని చెప్పే వరకు మనం ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని వాళ్లు నిర్ణయించుకుంటారు. భోజనాలు అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి సింధూజాక్షి రూమ్లో ఉండగా...గోపీ అక్కడికి వస్తాడు. అదేంటి మీ ఇంటి పనోడు నేరుగా నీ బెడ్రూమ్లోకి కూడా వచ్చేస్తున్నాడని వాళ్లు కావాలనే ప్రశ్నిస్తారు. దోమల చక్రం వెలిగించిరమ్మని అమ్మగారు చెప్పారంటూ గోపీ చెబుతాడు. ఫ్రెండ్స్ వాళ్ల రూమ్కు వెళ్లి పడుకోగా....నేను కూడా వెళ్తానని గోపి అనడంతో సింధూ వద్దని అంటుంది.మళ్లీ మీ అమ్మ చూసిందంటే గొడవ చేస్తుందని...ఇక్కడే కిందపడుకోమని చెప్పడంతో గోపీ ఆమె రూమ్లోనే పడుకుంటాడు. దీంతో స్నేహితురాళ్లు కావాలనే ఫోన్ ఛార్జర్ పేరిట మళ్లీ వస్తారు. సింధూరూమ్లో ఉన్న గోపిని చూసి అవాక్కవుతారు. పనోడు నీ రూమ్లో పడుకోవడం ఏంటని నిలదీస్తారు.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















