అన్వేషించండి

Karthika Deepam Idi Nava Vasantham August 12th: కార్తీకదీపం 2 సీరియల్: ట్విస్ట్‌ ఇచ్చిన శోభ, నర్శింహ తన భర్తే కాదట.. అనసూయ చెప్పే సమాధానం మీదే దీప జీవితం!

Karthika Deepam 2 Serial Episode నర్శింహ తన భర్త కాదు అని శోభ కోర్టులో చెప్పడంతో దీపతో పాటు అందరూ బిత్తరపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శోభని నర్శింహ రెండో పెళ్లి చేసుకున్నాడని దీప చెప్తుంది. ఇక లాయర్ జ్యోతి శోభని బోనులోకి పిలుస్తుంది. శోభని భర్త అవునా కాదా అని అడిగితే ఆడమగ పక్కపక్కనే ఉంటే మొగుడు పెళ్లాలు అయిపోతారా. ఇందాక కార్తీక్ పెద్దమనిషి చెప్పినట్లు ఆడ మగ పక్కపక్కనే ఉంటే మొగుడు పెళ్లాలు అయిపోతారా అని ప్రశ్నిస్తుంది. తాను సాయమే చేశానని నర్శింహ తన తల్లిని అక్క అని పిలిచే వాడని టాక్సీ కొనుక్కుంటా అంటే ఫైనాన్స్ ఇప్పించామని అంత మాత్రాన తమకు సంబంధం అంటగడతారా అని ప్రశ్నిస్తుంది.

నర్శింహ: అది శోభ అంటే అంత ఈజీగా దొరుకుతుందా.. సుమిత్ర: ఈ అమ్మాయి ఇన్ని అబద్ధాలు ఆడుతుంది ఏంటి వదినా..
శోభ: మాకు ఏ సంబంధం లేదు.
దీప: లాయర్ గారు తను అబద్ధం చెప్తుంది తనే నర్శింహ రెండో భార్య.
శోభ: ఊరుకోమ్మా నువ్వు భలే చెప్తున్నావ్. నాకు అసలు పెళ్లే కాలేదు. నువ్వు ఈ మాట అన్నందుకు అక్కడ నర్శింహ ఎంత బాధ పడుతున్నాడో..
దీప: తను అబద్ధం చెప్తుంది. తన మెడలో తాళి ఉంది చూడండి.
శోభ: అయితే ఇదేంటో మీరే చూడండి అని చైన్ చూపిస్తుంది.
సుమిత్ర: ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. 
జ్యోత్స్న: ఇది భలే ట్విస్ట్ ఇచ్చింది గ్రానీ.
శోభ: కార్తీక్, దీపలకు సంబంధం ఉందని నాకు కూడా ఈ దీప సంబంధం అంటకడుతుంది.
దీప: ఈవిడ అబద్దం చెప్తుంది మా అత్తయ్య ఇక్కడే ఉంది అడగండి.
నర్శింహ: నా భార్య చేసిన పనికి మా అమ్మ మనస్తాపం చెంది కోర్టుకు రాను అని చెప్పింది జడ్జి గారు.
జడ్జి: ఆవిడను తీసుకురండి ఈ కేసు మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నా.
వీవీ: మీ అమ్మ చెప్పబోయే సాక్ష్యం మీదే ఈ కేసు ఆధారపడి ఉంటుంది.. నా దగ్గర నువ్వేం దాయడం లేదు కదా. డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదు. ఓకే నేను మిమల్ని నుమ్ముతున్నా మిమల్నిగెలిపిస్తా. తొందరగా వెళ్లి మీ అమ్మని తీసుకురండి. 

జ్యోత్స్న లాయర్ వీవీ దగ్గరకు వచ్చి నర్శింహ, దీపలకు విడాకులు రాకూడదని, పాప నర్శింహ దగ్గరకు వెళ్లేలా చేయాలని అంటుంది. నర్శింహ తన తల్లి దగ్గరకు వెళ్లి అబద్దం చెప్పమని తల్లిని కోరుతాడు. తల్లిని తన సంతోషం కోసం అబద్ధం చెప్పమని బతిమాలుతాడు దీంతో అనసూయ సరే అంటుంది. మరోవైపు అనసూయ దీపకు సపోర్ట్‌గా మాట్లాడదని అనుకుంటారు.  ఇక జ్యోత్స్న, అనసూయ అక్కడికి వస్తారు. జ్యోత్స్న ఎందుకు వచ్చిందని సుమిత్ర ఉంటే తనని పారిజాతం తీసుకురాలేదని బావ కోసం తానే వచ్చానని అంటుంది. ఇంతలో నర్శింహ అనసూయని తీసుకొని వస్తాడు. దీప తన అత్తతో మాట్లాడుతానని వెళ్తుంది.    

దీప: అత్తయ్య అప్పుడే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా గురించి తెలిసిన ఏకైక వ్యక్తివి నువ్వే అత్తయ్య. నా జీవితంలో కష్టం తప్ప ఏ సుఖం అనుభవించలేదని నీకు తెలుసు. అయినా తెగించి మొండిదానిలా బతుకుతున్నాను అంటే అది నా కూతురు గురించే ఇప్పటి వరకు నేను పడ్డ అవమానాలు  నేను మోసిన నిందలు చేతులు చాలా అత్తయ్య. ఇన్నాళ్లు నా భర్త లేకండా బతికాను ఇప్పుడు అలాగే ఉండాలి అనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని నువ్వు గౌరవిస్తావని నేను కోరుకుంటున్నాను అత్తయ్య. నాకు నా బిడ్డకి చావు భయం చూపించే ఈ బంధాలు నాకు వద్దు అత్తయ్య. మూడు ముళ్లతో నీ కొడుకు నాకు ఉరి తాడు వేశాడు. నాకు ఈ ఉరి తాడు నుంచి విముక్తి కావాలి అత్తయ్య. మమల్ని వదిలేయండి అత్తయ్య నన్ను నా కూతుర్ని దూరం చేయకండి.
అనసూయ: చెప్పడం అయిపోయిందా నువ్వు నా మేనకోడలివి వీడు నా కొడుకు నీకు నీ కూతురు ఎంతో నాకు నా కొడుకు అంత. చేసినది అంతా చేసి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతానా. శౌర్య నీ కూతురు అయితే నా మనవరాలు. లాయర్ జ్యోతి సుమిత్రని ప్రశ్నిస్తాను అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కాళ్లు పట్టుకున్నా కనికరించని పద్మాక్షి.. బావమరదళ్లు రెండు ఫ్యామిలీలను ఒకటి చేస్తారా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 22) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్... లిస్ట్ ఇదే, డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 22) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్... లిస్ట్ ఇదే, డోంట్ మిస్
Kalavari kodalu kanaka mahalakshmi serial March 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమునని చంపడానికి స్వామీజీలా వచ్చిన భుజంగం! విషం తినిపించేశాడుగా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమునని చంపడానికి స్వామీజీలా వచ్చిన భుజంగం! విషం తినిపించేశాడుగా!
Nindu Noorella Saavasam Serial Today march 21st:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును ఇంట్లోంచి పంపిచేస్తున్న అమర్‌ - బాధలో ముగ్గురు పిల్లలు
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును ఇంట్లోంచి పంపిచేస్తున్న అమర్‌ - బాధలో ముగ్గురు పిల్లలు
Brahmamudi Serial Today march 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను మెచ్చుకున్న భ్రమరాంబ – సుభాష్‌ను కాపాడుకున్న ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను మెచ్చుకున్న భ్రమరాంబ – సుభాష్‌ను కాపాడుకున్న ఇందు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget