అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 21: తులసి కోట వద్ద లక్ష్మీ పూజలు....కనకంపై చేయిచేసుకున్న సహస్ర...విహారి ఎలా రియాక్ట్‌ అయ్యాడు..?

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode: తులసికోట వద్ద దీపం వెలిగించిన లక్ష్మీపై సహస్ర చేయిచేసుకుంది...ఆ తర్వాత ఏం జరిగిందన్నదానితో ఈరోజు ఏపీసోడు ఆసక్తిగా మారింది

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode:నీకు సంతోషం లేకుండా చేసిన వారి గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావని అందుకే నిన్నుకొంచెం మందలించాల్సి వచ్చిందని లక్ష్మీతో  చెబుతుంది. మీరు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారని నాకు తెలుసమ్మా అంటూ లక్ష్మీ సముదాయిస్తుంది. అయితే ప్రశాంతంగా పడుకోమని చెప్పి వాళ్ల అమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.అంబికకు  ఓ కాంట్రాక్టర్ నుంచి  ఫోన్ వస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్ట్ విహారికి దక్కకుండా మీరే అడ్డుకోవాలని అతను చెబుతాడు. అసలు టెండరే వేయకుండా  చూస్తే...ప్రాజెక్ట్‌లో పదిశాతం వాటా ఇస్తానని చెబుతాడు. మీరు ఇచ్చే కమీషన్ నాకు అక్కర్లేదని నా కంపెనీలు అన్నీ నా చేతికి వచ్చేలా  సాయపడాలని అంబికా కోరడంతో అతను సరేనంటాడు.
 
విహారి, లక్ష్మీ ఇంటి బయట మాట్లాడుకుంటుంటారు. మదన్‌తో పెళ్లిఅనగానే నువ్వు ఎందుకు విషం తాగాల్సి వచ్చిందని లక్ష్మీని విహారి అడుగుతాడు. నువ్వంటే ఇష్టమని చెబితే ఈ కుటుంబం మొత్తం చీలిపోతుందని భావించిన లక్ష్మీ ఆ విషయం చెప్పకుండా...మౌనంగా ఉండిపోతుంది. విహారి చెప్పమని ఒత్తిడి పెడుతుండగా..వీరి మాటలు విని అంబికా అక్కడికి వస్తుంది. అంబికా రాకను గమనించిన లక్ష్మీ...విహారి తీసుకుని కారు చాటున దాక్కుంటుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో అంబికా వెళ్లిపోతుంది. మళ్లీ విహారి లక్ష్మీని ప్రశ్నించడం మొదలుపెడతాడు. నేను కట్టిన తాళికి ఎందుకు అంత గౌరవం ఇస్తున్నావ్‌ అని అడుగుతాడు. యాక్సిండెంటల్‌గా మనమధ్య ఏర్పడిన బంధానికి ఎందుకు అంత విలువ ఇస్తున్నావ్ అని నిలదీస్తాడు. దీనికోసం ఎందుకు రెండుసార్లు ప్రాణాలు ఇవ్వడానికి వెనకాడలేదంటాడు.ఇన్ని అవమానాలు భరిస్తూ మా ఇంట్లో ఎందుకు ఉంటున్నావని లక్ష్మీని అడుగుతాడు. ఈలోగా వారిని వెతుక్కుంటూ అంబికా అక్కడికి రావడంతో వారి మధ్య మాటలు ఆగిపోతాయి.
 
తెల్లారిన తర్వాత కనకమహాలక్ష్మికి వాళ్ల అమ్మ ఫోన్ చేసి తులసి కోట వద్ద దీపం పెట్టి పూజ చేయమని చెబుతుంది. దీంతో కనకం తులసి కోట వద్ద పూజ చేసి దీపం పెడుతుంది.ఈలోగా  అక్కడికి విహారికి కాబోయే భార్య సహస్ర,వాళ్ల అమ్మ ,అంబిక కూడా పూజ చేయడానికి తులసి కోట వద్దకు వస్తారు. అక్కడ లక్ష్మీని చూసి మండిపడిపోయిన సహస్ర కనకంపై చేయి చేసుకుంటుంది. లక్ష్మీని ఎందుకు కొట్టావని విహారి సహస్రను నిలదీస్తాడు. దీపం వెలిగించి పూజ చేస్తే మంచిదే కదా అంటాడు. ఇంటి కోడలు పెట్టాల్సిన దీపాన్ని ఇంటి పనిమనిషి పెడితే తప్పులేదా అని సహస్ర నిలదీస్తుంది. దాని మెడలో తాళికట్టిన వాడి ఇంటికి వెళ్లి దీపం వెలిగించుకోమని అవమానిస్తారు. దీంతో విహారి తను ఈ ఇంటి మనిషేనని అనడంతో...ఎలా అని వాళ్లంతా నిలదీస్తారు. ఈలోగా మదన్ అక్కడి వచ్చి వారిపై మండిపడటంతో అంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు.
 
సహస్ర వచ్చి వాళ్ల బావ విహారికి సారీ చెప్పగా....తనకు కాదని లక్ష్మీకి క్షమాపణలు చెప్పాలని చెబుతాడు. పనిమనిషిని కొడితే సారీ ఎందుకు చెప్పాలని సహస్ర విహారిని నిలదీస్తుంది.ఇంతలో విహారిని సహస్ర కౌగిలించుకోగా అక్కడికి కాఫీ తీసుకుని లక్ష్మీ వచ్చి వాళ్లను చూస్తుంది. కనకాన్ని ఉడికించడానికి సహస్ర మా ఇద్దరి ఫొటోలు తీయాలంటూ  ఆమె చేతికి ఫోన్ ఇచ్చి వాళ్ల బావ పక్కన నిలబడి రకరకాలుగా ఫొటోలు దిగుతుంది. ఆ తర్వాత లక్ష్మీ, సహస్రా అక్కడి నుంచి వెళ్లిపోతారు. లక్ష్మీకి తన మనసులో చోటు ఉందని ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలని విహారి ఆలోచిస్తుండటంతో  ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget