అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Jagadhatri Serial Today October 23rd: జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిపై దొంగతనం నింద! వైజయంతి కుట్రలో చిక్కుకున్న అమాయకురాలు!

Jagadhatri Serial Today Episode October 23rd శ్రీవల్లిని ఎలా అయినా ఇంటి నుంచి పంపేయాలి అని వైజయంతి శ్రీవల్లి బ్యాగ్‌లో 5 లక్షలు పెట్టి దొంగతనం ముద్ర వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode యువరాజ్‌ని బెయిల్ మీద ఇంటికి తీసుకొస్తున్నారు అని వైజయంతి సందడి చేస్తుంది. సుధాకర్ చూసి తల్లి మనసు బెయిల్ మీద వస్తున్నాడు అని సంతోషపడిపోతుంది.. మళ్లీ జైలుకి వెళ్తాడు అని తెలిస్తే ఏమైపోతుందో పాపం అని అనుకుంటాడు. 

వైజయంతి అందరికీ యువరాజ్ వస్తున్నాడు అని చెప్తూ శ్రీవల్లి దగ్గరకు వెళ్తుంది. ఇదే మంచి అవకాశం అని అనుకొని శ్రీవల్లి యువరాజ్ వస్తున్నాడని చెప్పి నువ్వు కూడా ఎలాగూ కోలుకున్నావ్ కదా ఇంట్లో నుంచి వెళ్లిపో అమ్మి అని చెప్తుంది. నేను అదే అనుకుంటున్నా అమ్మగారు అని శ్రీవల్లి అంటే కౌషికి వాళ్లు ఏం చెప్పినా వినకుండా వెళ్లిపో అమ్మి లేదంటే మళ్లీ మా కాచీ ఫీలవుతుందని చెప్తుంది. 

మీనన్ యువరాజ్‌ని చంపలేకపోయిన రౌడీలను ఇష్టం వచ్చినట్లు తిడతారు. టీనా మీనన్‌ని కూల్ చేస్తుంది. యువరాజ్‌ కేవలం బెయిల్ మీదే బయటకు వచ్చాడు. నువ్వు వేసిన ప్లాన్ ఇంకా అయిపోలేదు అని అంటుంది. ఈ మీనన్‌ని ఇంకా ఓడిపోలేదు.. జేడీ, కేడీల అంతు చూస్తా అని అనుకుంటాడు. 

యువరాజ్‌ని తీసుకొని ఇంటికి వస్తారు. వైజయంతి యువరాజ్‌ని చూసి ఏడుస్తుంది. యువరాజ్‌ ఇంట్లోకి వెళ్లి మీనన్ గురించి ఆలోచిస్తాడు. జేడీ, కేడీలు యువరాజ్‌ని కాపాడారు అని బెయిల్ ఇచ్చారని మీరే వాళ్లని అనవసరంగా తప్పుగా అన్నారు అని అంటుంది. వాళ్లని క్షమించమని అడగాలి అని అంటుంది. నేను అడిగాను అని నిషి అంటుంది. ఈ సారి వాళ్లకి మంచి భోజనం పెడతా అని వైజయంతి అంటుంది. కేడీ ఎవరో తెలిస్తే ముందు నీ పని అయిపోతుందని యువరాజ్‌ అనుకుంటాడు. ఇదంతా ఎవరు చేశారు అని సుధాకర్ అంటే హోంమినిస్టర్ తాయారు అని కౌషికి చెప్తుంది. మన కుటుంబం మీద ఇంకా వాళ్లు పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. మనం అందరం జాగ్రత్తగా ఉండాలి అని కౌషికి చెప్తుంది. 

శ్రీవల్లి వచ్చి కౌషికితో నాకు ఇప్పుడు బాగానే ఉంది నేను వెళ్లిపోతాను అని చెప్తుంది. కౌషికి శ్రీవల్లితో నువ్వు వెళ్లిపోతా అన్నావ్ ఓకే కానీ ఎక్కడికి వెళ్తావ్ అని అంటుంది. నాలాంటి వాళ్లకి దేవుడే దిక్కు అని అంటుంది. ఆడపిల్లవి ఎక్కడికి వెళ్తావ్ అని సుధాకర్ కూడా అంటాడు. ఎక్కడో ఒక దగ్గరకు వెళ్తుంది ఆపొద్దు తను ఇక్కడే ఉంటే కాచీ బాధ పడుతుందని వైజయంతి అంటుంది. దానికి కాచీ అప్పుడు ఏదో అలా అనేశా ఇప్పుడు పర్లేదు అంటే నువ్వు ఊరుకో అమ్మి అని వైజయంతి ఆపేస్తుంది. 

కౌషికి  శ్రీవల్లితో నీవాళ్లు ఎవరో తెలిస్తే బాగున్ను అని అంటుంది. నీకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అని సుధాకర్ అడుగుతాడు. ఎవరూ లేరు అయ్యగారు మా అమ్మ ఫొటో తప్ప ఇంకేం లేవు అని అంటుంది. వైజయంతి షాక్ అయిపోతుంది. సుధాకర్ ఫొటో తీసుకురమ్మని దాన్ని పేపర్‌లో వేస్తే నీ వాళ్లు ఎవరైనా ఉన్నారో తెలుస్తుందని అంటారు. శ్రీవల్లి ఫొటో తెస్తాను అంటుంది. ఆ ఫొటో చూస్తే నువ్వే ఈ ఇంటి వారసురాలివి అని తెలిసి నిన్ను ఎక్కడికీ కదలనివ్వరే నా ఇంట్ల భూకంపం వస్తుందని వైజయంతి అనుకుంటుంది. 

శ్రీవల్లి బ్యాగ్ తీసుకొచ్చి అందులో ఫొటో తీయబోతే వైజయంతి కాంట్రాక్టర్‌కి ఇస్తాను అన్న 5 లక్షలు తీసుకొస్తా అని చెప్పి డబ్బు కనిపించడం లేదు అని చెప్తుంది. మన ఇంట్లో ఎవరు తీస్తారమ్మా అని యువరాజ్ అంటాడు. సుధాకర్ యువరాజ్‌ని అనుమానిస్తాడు. నాకు ఆ అవసరం లేదు ఇంట్లో వాళ్లని అనుమానించడం కాదు బయట వాళ్లని అనుమానించాలని బయటకు వెళ్తాను అన్న శ్రీవల్లిని అనుమానించాలని యువరాజ్ అంటాడు. 

వైజయంతి కూడా శ్రీవల్లినే అనుమానించాలని శ్రీవల్లి బ్యాగ్ వెతకాలి అని అంటుంది. శ్రీవల్లి బ్యాగ్ చూస్తే అందులో డబ్బు ఉంటుంది. అందరూ షాక్ అయిపోతారు. ఫ్లాష్ బ్యాక్‌లో శ్రీవల్లిని ఎలా అయినా ఇంటి నుంచి పంపేయాలి అని వైజయంతి డబ్బు శ్రీవల్లి బ్యాగ్‌లో పెట్టేస్తుంది. అప్పుడే శ్రీవల్లి బ్యాగ్‌లో సుహాసిని ఫొటో చూసి ఎవరూ చూడకుండా దాచేయాలని తీసుకెళ్లిపోతుంది. అది కీర్తి పాప చూస్తుంది. దొంగతనం చేసిందని వైజయంతి శ్రీవల్లిని కొడుతుంది. వైజయంతి, నిషిక నానా మాటలు అంటారు. శ్రీవల్లి ఏడుస్తుంది. నాకు ఇక్కడ ఉండాలి అని లేదమ్మా కానీ దొంగని చేస్తున్నారు.. అయ్యగారు అక్క,, మీరు అయినా నన్ను నమ్మండి నేను ఈ దొంగతనం చేయలేదు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Blast Case Update : ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
Deputy CM Pawan Kalyan : పిఠాపురంలో మరోసారి భూమి కొనుగోలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఏం చేయబోతున్నారు?
పిఠాపురంలో మరోసారి భూమి కొనుగోలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఏం చేయబోతున్నారు?
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు-కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
Advertisement

వీడియోలు

India vs South Africa | కోల్‌కత్తా టెస్టులో బుమ్రా అదిరిపోయే పర్ఫామెన్స్
Vaibhav Suryavanshi Asia Cup Rising Stars 2025 | వైభవ్ సెంచరీ.. బద్దలయిన వరల్డ్ రికార్డ్
Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Blast Case Update : ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
ఉగ్ర కుట్ర భగ్నంతో దుబాయ్‌ పారిపోయేందుకు షాహీన్‌ ప్లాన్- పసిగట్టి ముందే అరెస్టు చేసిన అధికారులు 
Deputy CM Pawan Kalyan : పిఠాపురంలో మరోసారి భూమి కొనుగోలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఏం చేయబోతున్నారు?
పిఠాపురంలో మరోసారి భూమి కొనుగోలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! ఏం చేయబోతున్నారు?
Telangana High Court website hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌- కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు-కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న..  క్రికెటర్ శ్రీ చరణీ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. క్రికెటర్ శ్రీ చరణీ
Adilabad Tigers Attack: ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
ఆదిలాబాద్‌ జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు- ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన
IPL 2026: సీఎస్కేలోకి సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్‌లోకి జడేజా, సామ్ కర్రన్‌
సీఎస్కేలోకి సంజూ శాంసన్- రాజస్థాన్ రాయల్స్‌లోకి జడేజా, సామ్ కర్రన్‌
Visakhapatnam CII Partnership Summit: అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులు- విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులు- విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం
Embed widget