Jagadhatri Serial Today May 19th:తండ్రినే కిడ్నాప్ చేయించిన యువరాజు... కిడ్నాపర్ల నుంచి తప్పించే క్రమంలో సుధాకర్కు యాక్సిడెంట్
Jagadhatri Serial May19th: సుధాకర్కు యాక్సిడెంట్ జరిగి ఆస్పత్రిలో చేరతాడు.ఇదంతా చేసింది యువరాజేనని తెలుసుకున్న జగధాత్రి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో జగధాత్రి సీరియల్ కొత్త మలుపు తీసుకుటుంది.

Jagadhatri Serial Today Episode: కేదార్ తన కొడుకని సుధాకర్ ప్రకటించే సమయంలో ముగ్గురు దుండగులు వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. వారి వెంట జగధాత్రి, కేదార్ పరుగులు తీస్తారు. మార్గమధ్యలోనే రమ్యకు ఫోన్ చేయడంతో ఆమె ఎదురుగా వస్తుంది. దీంతో కిడ్నాపర్లు సుధాకర్ను వదిలేసి పారిపోయే క్రమంలో రోడ్డుపైకి నెట్టేస్తారు. వెనక నుంచి వచ్చిన కారు సుధాకర్ను గుద్దేయడంతో తీవ్రంగా గాయపడతాడు. తండ్రిని వెంటనే కేదార్ ఆస్పత్రికి తరలించి ఆపరేషన్ చేయిస్తాడు.
అయితే సుధాకర్ను కొడుకు యువరాజే కిడ్నాప్ చేయిస్తాడు.తన మనుషులను పురమాయించి తండ్రిని జాగ్రత్తగా అపహరించి నేను చెప్పిన చోట దాచి పెట్టాలని చెబుతాడు. ఆయనకు ఏం జరగకుండా చూసుకోవాలని సూచిస్తాడు. ఇదంతా తెలుసుకుని వైజయంతి తొలుత కంగారుపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించి మంచి ఉపాయం ఏదీలేదని నిషిక అంటుంది.అయినా కిడ్నాప్ చేసేవాళ్లు మనోవాళ్లే కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని యువరాజు సర్దిచెప్పడంతో తను సరేనంటుంది.దీంతో యువరాజు చెప్పినట్లే సుధాకర్ను వాళ్ల మనుషులు తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేస్తారు.
కేదార్ ఫోన్ చేయడంతో కౌషికి సహా అందరూ పరుగులు పెట్టుకుంటూ ఆస్పత్రికి వస్తారు. ఏం జరిగిందని చెప్పగా....మామయ్యగారికి యాక్సిడెంట్ జరిగిందని అందుకే ఆస్పత్రికి తీసుకొచ్చామని చెబుతారు. దీంతో వైజయంతి భోరున ఏడుస్తుంది.అసలు మీరు ఎందుకు వెళ్లారని....మీవల్లే ఆయనకు యాక్సిడెంట్ జరిగిందని అంటుంది. కౌషికి కలుగజేసుకుని వాళ్ల వల్ల యాక్సిడెంట్ జరగడం ఏంటని ప్రశ్నిస్తుంది. వాళ్లు బాబాయిని కాపాడే కదా ఆస్పత్రి తీసుకొచ్చారని అంటుంది. లేకపోతే ఆ కిడ్నాపర్లు బాబాయిని ఏమైనా చేసి ఉండేవాళ్లేమో అని అంటుంది. ఆ కిడ్నాపర్లు మీ బాబాయిని ఏం చేయరని....వీళ్లు వెంటపడకుండా ఉంటే నేరుగా వాళ్లు తీసుకెళ్లాల్సినచోటకు తీసుకెళ్లి ఉండేవారని నోరు జారుతుంది.ఇంతలో యువరాజు కల్పించుకుని వాళ్ల అమ్మను ఆపుతాడు. దీంతో జగధాత్రి అడ్డుపడుతుంది.అత్తయ్యగారు కిడ్నాపర్లు గురించి ఏదో చెబుతుంటే నువ్వు ఎందుకు ఆపుతున్నావని నిలదీస్తుంది. అసలు కిడ్నాపర్లు ఏం చేయరని మీకు ఎలా తెలుసని జగధాత్రి వైజయంతిని ప్రశ్నిస్తుంది. దీంతో తాను ఎంత పెద్ద తప్పుచేశానో తెలుసుకుని నాలుకు కర్చుకుంటుంది. వెంటనే నిషిక కలుగజేసుకుని యువరాజు ఆపింది అందుకు కాదని మామయ్యకి ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఆస్పత్రిలో ఈ గొడవ ఏంటని ఆపాడని టాఫిక్ డైవర్ట్ చేస్తుంది.
ఆపరేషన్ ధియేటర్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ ఆయనకు పెద్దప్రమాదం ఏమీలేదని...కాకపోతే కొన్నిరోజులు నడవలేరని చెప్పి వెళ్లిపోతారు.కౌషికి, వైజయంతి లోపలకి వెళ్లగా....జగధాత్రి యువరాజును పిలిచి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మామయ్యను కిడ్నాప్ చేయించింది నువ్వేనని మాకు తెలుసని అంటుంది. మరీఇంత నీచానికి ఒడిగడతారని అనుకోలేదని అంటుంది. మీరు ఈ ఇంటివారసుడిగా ప్రకటన కోసం ప్రయత్నించే వరకు నేను ఇలా అడ్డుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటానని యువరాజు అంటాడు. మళ్లీ ఇలాంటి పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోనని కేదార్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో అందరూ కలిసి సుధాకర్ను చూడటానికి లోపలికి వెళ్తారు. వీరశంకర్ అక్కడికి వచ్చి నువ్వు కోలుకునే వరకు సమయం ఇస్తానని చెబుతాడు.అప్పటి వరకు కేదార్కు ఏం జరిగినా యువరాజు,సుధాకర్దే బాధ్యత అని లాయర్తో డాక్యుమెంట్లు చేయించుకుని తీసుకొస్తాడు.వాటిపై కేదార్ను సంతకం చేయమంటే తాను చేయనని అంటాడు. నా ఫ్యామిలీ నుంచి నాకు ఎలాంటి ముప్పులేదని చెబుతాడు.
ట్రెండింగ్ వార్తలు





















