Jagadhatri Serial Today JULY 27th:పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్ మినిస్టర్ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
Jagadhatri Serial Today Episode July 27th: పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్ మినిస్టర్ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. మైనర్ మర్డర్ కేసు ఇన్వెస్టెగేషన్ చేస్తున్న జేడీ లోతుగా దర్యాప్తు మొదలుపెడుతుంది.అయితే ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్తీమినిస్టర్ మధుసూదన్ కొడుకని తెలుసుకున్న మీనన్....మీ వాడిని నేను కాపాడతానని హామీ ఇస్తాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులను సైతం చంపడానికి ప్రయత్నిస్తాడు. తండ్రిని చంపగా తల్లిని జేడీ కాపాడుతుంది. ఆమెను విచారించగా..తాము హెల్త్ మినిస్టర్ ఇంట్లో పనిచేస్తున్నామని చెప్పడంతో జేడీకి కేసు గురించి మొత్తం అర్థమవుతుంది.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో అదరగొట్టిన సింధు
మైనర్ మర్డర్ కేసు విచారణ కోసం స్పాట్కు వెళ్లిన జేడీ, కేడీ ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు హత్య అని అనుమానిస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన సింధూ ఇది నిజంగా హత్యేనని చెబుతుంది.ఎలా చెప్పగలుగుతున్నావని జేడీ అడగ్గా.....ఆ అమ్మాయి చెప్పు బిల్డింగ్ పైనే ఉండటం, బాడీ పడిన పొజిషన్, స్పాట్లో ఉన్న నిందితుడి షూ గుర్తులు చూపించి ఇది హత్యేనని తేల్చిచెబుతుంది.చూడటానికి తింగరదానిలా ఉన్నా బాగానే కనిపెట్టావని జేడీ ఆమెను పొగుడుతుంది.ఇదే విధంగా కేసులను అంచనా వేయాలని ఆమెకు కొన్ని సూచనలు చేస్తుంది.
మైనర్ హత్య కేసులో మినిస్టర్ కొడుకు
మైనర్ను మేడపై నుంచి కిందకి తోసి చంపి ఇంటికి పరారై వచ్చిన కొడకును హెల్త్ మినిస్టర్ మధుసూదన్ కొడతాడు. నిన్ను నా రాజకీయ వారసుడిని చేద్దామనుకుంటే నువ్వు ఇలా ఫోక్సో కేసులో ఇరుక్కుంటావా అని మందలిస్తాడు. అక్కడే ఉన్న మీనన్....ఇప్పుడు జరిగిపోయిన దానికన్నా జరగాల్సింది చూడాలని అంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో తెలియదు కాబట్టి పోలీసులు అన్ని పోలీసుస్టేషన్కు ఫోన్ చేసి మిస్సింగ్ కేసు గురించి ఆరా తీస్తారని...కాబట్టి వాళ్ల అమ్మానాన్నలు పోలీసుస్టేషన్కు వెళ్లక ముందే వారిని చంపేయాలని అంటాడు.అలాగే ఈ కేసులో లొంగిపోవడానికి ఎవరో ఒకరిని చూస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
జేడీ తెలివితేటలు
హత్య జరిగిన గంటల్లోపే సాధుసార్కి ఫోన్ చేసి ఇది ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఒత్తిడి తెచ్చారంటే...ఖచ్చితంగా ఎవరో పెద్ద తలకాయ ఉండే ఉంటారని జేడీ అనుమానిస్తుంది.అంటే మనం మిస్సింగ్ కేసు గురించి విచారణ చేస్తామని తెలిసి ఖచ్చితంగా వాళ్లు ఈ అమ్మాయి అమ్మానాన్నలు స్టేషన్కు రాకుండా చేస్తారని...వాళ్లకు హాని తలపెడతారని అంటుంది. వెంటనే మనం ఈ అమ్మాయి అమ్మానాన్నల గురించి వెతకాలని చెప్పి కేదార్ను తీసుకుని బయలుదేరుతుంది.అప్పుడే మినిస్టర్ మీనన్కు ఫోన్ చేసి ఆ సాధు మన బెదిరింపులకు భయపడకుండా జేడీని రంగంలోకి దింపాడని చెబుతాడు. అయితే ఇక ఈ కేసు గురించి మీరు మర్చిపోండని...ఇది నాకు, జేడీకి మధ్య పోటీ అని మీనన్ అంటాడు. ఇంతలో చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి ఇంటికి తిరిగివెళ్తుంటారు. ఆ విషయం తెలుసుకున్న సాధు వాళ్ల వివరాలు జేడీకి పంపిస్తాడు. వెంటనే జేడీ ఆ అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి మీరు ప్రమాదంలో ఉన్నారు వెంటనే పారిపోండని చెబుతుండగానే మీనన్ వాళ్లపై ఎటాక్ చేసి ఆ అమ్మాయి తండ్రిని చంపేస్తాడు. తల్లి పారిపోతుండగా రౌడీలు వెంబడిస్తారు. జేడీ వాళ్లను కొట్టి ఆమెను రక్షిస్తుంది.
జేడీకి తెలిసిపోయిన నిజం
వెంటనే ఆమెను విచారించగా...చనిపోయిన మా అమ్మాయి పేరు పద్మ అని చెబుతుంది.మీరు ఎక్కడ పనిచేస్తారని చెప్పగా....హెల్త్ మినిస్టర్ ఇంట్లో నేను పనిచేస్తానని..మా ఆయన డ్రైవర్గా పనిచేస్తున్నాడని చెబుతుంది. దీంతో జేడీకి విషయం అర్థమవుతుంది. మీ అమ్మాయితో మినిస్టర్ కొడుకుకి ఏమైనా పరిచయం ఉందా అని అడుగుతుంది. ఆ అబ్బాయితో మా అమ్మాయి చనువుగా ఉండటం చూసి మా ఆయన తిట్టి కొట్టాడని చెబుతుంది. నెలరోజులుగా మా అమ్మాయి సరిగా ఉండటం లేదని...చాలా నీరసంగా ఉందని చెబుతుంది. దీంతో మినిస్టర్ కొడుకే పద్మకు ప్రెగ్నెంట్ చేసి చంపేశాడని జేడీకి అర్థమవుతుంది.అయినా ఇప్పుడు ఆధారాలు లేకుండా మనం వాడిని అరెస్ట్ చేస్తే ఆ మినిస్టర్ మనం కావాలనే చేస్తున్నామని అందరితో గొడవలు చేయిస్తాడని....కాబట్టి ఖచ్చితంగా మనం ఆధారాలు సంపాదించిన తర్వాతే నేరుగా రంగంలోకి దిగుదామని జేడీ అంటుంది.
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















