అన్వేషించండి

Brahmamudi Serial Today August 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి స్పాట్ పెట్టిన స్వప్న – రౌడీకి బుద్ది చెప్పిన అప్పు

Brahmamudi Today Episode: కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు ఇక రాజ్ ను కూడా వెళ్లగొట్టాలని రాహుల్ , రుద్రాణి ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  ఎవరెన్ని చెప్పినా కళ్యాణ్‌ వినడు. అప్పును తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతాడు. తర్వాత కళ్యాణ్‌ కు అవమానం జరగకుండా ఆపలేకపోయానని రాజ్‌ బాధపడుతుంటాడు. తర్వాత ఆటో దిగుతున్న అప్పు పక్కనుంచి ఒకడు రాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ వెళ్తుంటే వాణ్ని పట్టుకుని బుద్ది చెప్తుంది అప్పు. దీంతో వాడు సారీ చెప్పి వెళ్లిపోతాడు.

అప్పు: ఇంకోసారి ఈ రోడ్‌లో కనిపిస్తే.. బండి ఇనుపసామానులో అమ్ముకోవాలే.. నీ బాడీ హాస్పిటల్‌లో అతుకులు వేయించుకోవాలే..

కళ్యాణ్‌: థ్యాంక్స్ అప్పు

అప్పు: ఎందుకు వాడిని కొట్టినందుకా

కళ్యాణ్‌: కాదు.. ఒక్క మాట కూడని పడని నువ్వు నాకోసం ఇవాళ అన్ని మాటలు పడినందుకు.

అప్పు: నీకు మాట ఇచ్చాను కదా. మీ అమ్మను అంటే నువ్వు బాధపడతావు. ఆ పడేదేదో నేనే పడదామని. అయినా ఇవాళ మీ అమ్మ కొత్తగా ఏమంది.

 అని అప్పు చెప్పగానే కళ్యాణ్‌ మరోసారి సారీ చెప్తాడు. దీంతో మన తప్పుకు మనమే సారీ చెప్పుకోవాలి. వాళ్లు చేసిన తప్పుకు మనమే సారీ చెప్పుకోవాలా? అంటుంది అప్పు. ఇంతలో రాజ్ కాల్ చేసి జరిగినదానికి చాలా ఫీల్ అవుతున్నట్లు చెబుతాడు. దాంతో కల్యాణ్ నవ్వుతాడు.  అక్కడ జరిగింది అక్కడే దులిపేసుకుని వచ్చింది అన్నయ్య అప్పు అంటాడు కళ్యాణ్‌. అలాగే నువ్వు వదినను ఏమీ అనకు అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు. తర్వాత రాజ్‌ దగ్గరకు కావ్య వస్తుంది.

రాజ్: నీకు మంచి స్టఫ్ దొరికింది కదా..  నీవు చెప్పినట్లు ఓడిపోయాను కదా! ఇప్పుడు నీకు అడ్డంగా దొరికిపోయాను కదా!

కావ్య: నేను ఏం అనలేదు. అన్నీ మీరే అనుకుంటున్నారు.

రాజ్‌: నీకు అనే ఛాన్స్ ఇవ్వలేదు. నాకు నేనే అనుకుంటున్నాను. దటీజ్ స్వరాజ్

కావ్య: పోనిలేండి ఇన్నాళ్లు మీరెంత ఫూలిష్‌గా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకున్నారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నారు.

రాజ్‌: ఏంటే నేను ఇన్ని అనుకున్నా నువ్వు సెటైర్లు వేస్తున్నావ్

కావ్య: దటీజ్ కళావతి.. డాటర్ ఆఫ్ కనకం.

 అని కావ్య అనగానే రాజ్‌ వెళ్లిపోతుంటాడు. కావ్య ఆపి మీ అంచనాలన్నీ చెల్లాచెదురయ్యాయి కదా? అంటుంది. అవునని కానీ కళ్యాణ్‌ ఇక్కడే ఉంటే సమస్య పరిష్కారం అవుతుందనుకున్నాను కానీ సమస్య ఇంట్లోనే ఉంది. ఇంట్లో వాళ్లు మారితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటాడు రాజ్‌. తర్వాత తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు రుద్రాణి, రాహుల్ మందు తాగుతుంటారు.

రుద్రాణి:  మొదటిసారి విజయం దక్కింది. ధాన్యలక్ష్మీ పిచ్చిది కాకపోతే నేను చెప్పిన మాటలు విని కొడుకును దూరం చేసుకుంది.

రాహుల్‌: అవును మామ్‌ కల్యాణ్ ఇక ఇంటికి రాడు. కల్యాణ్ వచ్చేదాక రాజ్ కంపెనీ జోలికి రాడు.

రుద్రాణి: కానీ, కావ్య ఉంది. అది ఏదోటి చేస్తుంది కాబట్టి. రాజ్ ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేయాలి. వాడు ఒంటరివాడై డిప్రెషన్‌లోకి వెళ్లాలి. అప్పుడే మనకు ఈ కంపెనీ దక్కుతుంది.

  అప్పుడే అటువైపుగా వెళ్తున్న స్వప్న వాళ్లను చూస్తుంది.

స్వప్న: నా చెల్లిని అవమానించి సిగ్గులేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నారా..?  మీ సంతోషమే మీకు శాపంగా మారేలా చేస్తాను చూడండి.

 అనుకుంటూ వెళ్లిపోతుంది స్వప్న. తర్వాత అపర్ణ, ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లి కన్వీ్న్స్‌ చేయాలని చూస్తుంది. తాను కావ్య విషయంలో మొదట్లో ఎంతలా అపార్థం చేసుకున్నదో.. తర్వాత ఎంతగా గిల్టీగా ఫీలవుతుందో చెప్తుంది. నీ కోపం ఖరీదు నీ కన్నకొడుకును శాశ్వతంగా దూరం చేసుకోవడమే అని అపర్ణ చెప్పగానే ధాన్యలక్ష్మీ సీరియస్‌ అవుతుంది. పొలిటికల్‌ లీడర్‌ లాగా మాటలు బాగానే చెప్తున్నావు అంటుంది. నీ కోడలు నిన్ను తన గుప్పిట్లో పెట్టుకున్నట్లే ఆ అప్పు చేత నన్ను గుప్పిట్లో పెట్టుకోవడానికి నిన్ను రాయబారానికి కావ్య పంపిందా? అంటూ ప్రశ్నిస్తుంది. ఎప్పటికీ ఆ అప్పును కోడలిగా ఒప్పుకోనని ధాన్యలక్ష్మీ చెప్పడంతో అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

    మరోవైపు రుద్రాణి బెడ్ రూమ్‌లో లాఫింగ్‌ గ్యాస్‌ నింపిన బెలూన్స్ పెడుతుంది స్వప్న.  ఇంతలో రాహుల్‌ బెడ్‌ రూంలోకి వచ్చి ఒక బెలూన్‌ పగులగొట్టి హ్యాపీ బర్తుడే మామ్‌ అంటాడు. ఇంతలో లాఫింగ్‌ గ్యాస్‌ బయటకు రావడంతో రుద్రాణి, రాహుల్‌ పిచ్చి పట్టినవాళ్లలా నవ్వుతుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag TCS: విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
Telangana News: దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
Ratan Tata Health News: ఐసీయూలో రతన్ టాటాకు చికిత్స, పరిస్థితి విషమం! హెల్త్ అప్‌డేట్‌పై సందిగ్దత
ఐసీయూలో రతన్ టాటాకు చికిత్స, పరిస్థితి విషమం! హెల్త్ అప్‌డేట్‌పై సందిగ్దత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌కి ఆర్టికల్ 370 మళ్లీ వస్తుందా, మోదీ ఉండగా సాధ్యమవుతందా?రాహుల్‌కి కిలో జిలేబీలు పంపిన బీజేపీ, విపరీతంగా ట్రోలింగ్Amalapuram News: అమ్మవారి మెడలో దండ వేసే గొప్ప ఛాన్స్, వేలంలో రూ.లక్ష పలికిన అవకాశంJammu and Kashmir: ముస్లిం ఇలాకాలో హిందూ మహిళ సత్తా! ఈమె గురించి తెలిస్తే కన్నీళ్లే!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag TCS: విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
విశాఖలో టీసీఎస్ సంస్థ, 10 వేల మందికి ఉద్యోగాలు - మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్‌
Telangana News: దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
దసరా పండగ 3 రోజుల ముందే వచ్చింది - డీఎస్సీ నియమాక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్, రూ.60 లక్షలు సొంత నిధులు వెచ్చించి సాయం
Ratan Tata Health News: ఐసీయూలో రతన్ టాటాకు చికిత్స, పరిస్థితి విషమం! హెల్త్ అప్‌డేట్‌పై సందిగ్దత
ఐసీయూలో రతన్ టాటాకు చికిత్స, పరిస్థితి విషమం! హెల్త్ అప్‌డేట్‌పై సందిగ్దత
YS Jagan On Haryana : హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
హర్యానా ఎన్నికలపై అనుమానాలు - బ్యాలెట్లతోనే ప్రజాస్వామ్యం సేఫ్ - జగన్ ట్వీట్ వైరల్
Central Cabinet Decisions : పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇక ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం
Chandrababu: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చంద్రబాబు మద్దతు, మరో ఎన్నికలు సైతం నిర్వహణపై యోచన
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు చంద్రబాబు మద్దతు, మరో ఎన్నికలు సైతం నిర్వహణపై యోచన
TGPSC: అక్టోబరు 21 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
అక్టోబరు 21 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
Embed widget