అన్వేషించండి

Brahmamudi Serial Today August 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణికి స్పాట్ పెట్టిన స్వప్న – రౌడీకి బుద్ది చెప్పిన అప్పు

Brahmamudi Today Episode: కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు ఇక రాజ్ ను కూడా వెళ్లగొట్టాలని రాహుల్ , రుద్రాణి ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  ఎవరెన్ని చెప్పినా కళ్యాణ్‌ వినడు. అప్పును తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతాడు. తర్వాత కళ్యాణ్‌ కు అవమానం జరగకుండా ఆపలేకపోయానని రాజ్‌ బాధపడుతుంటాడు. తర్వాత ఆటో దిగుతున్న అప్పు పక్కనుంచి ఒకడు రాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ వెళ్తుంటే వాణ్ని పట్టుకుని బుద్ది చెప్తుంది అప్పు. దీంతో వాడు సారీ చెప్పి వెళ్లిపోతాడు.

అప్పు: ఇంకోసారి ఈ రోడ్‌లో కనిపిస్తే.. బండి ఇనుపసామానులో అమ్ముకోవాలే.. నీ బాడీ హాస్పిటల్‌లో అతుకులు వేయించుకోవాలే..

కళ్యాణ్‌: థ్యాంక్స్ అప్పు

అప్పు: ఎందుకు వాడిని కొట్టినందుకా

కళ్యాణ్‌: కాదు.. ఒక్క మాట కూడని పడని నువ్వు నాకోసం ఇవాళ అన్ని మాటలు పడినందుకు.

అప్పు: నీకు మాట ఇచ్చాను కదా. మీ అమ్మను అంటే నువ్వు బాధపడతావు. ఆ పడేదేదో నేనే పడదామని. అయినా ఇవాళ మీ అమ్మ కొత్తగా ఏమంది.

 అని అప్పు చెప్పగానే కళ్యాణ్‌ మరోసారి సారీ చెప్తాడు. దీంతో మన తప్పుకు మనమే సారీ చెప్పుకోవాలి. వాళ్లు చేసిన తప్పుకు మనమే సారీ చెప్పుకోవాలా? అంటుంది అప్పు. ఇంతలో రాజ్ కాల్ చేసి జరిగినదానికి చాలా ఫీల్ అవుతున్నట్లు చెబుతాడు. దాంతో కల్యాణ్ నవ్వుతాడు.  అక్కడ జరిగింది అక్కడే దులిపేసుకుని వచ్చింది అన్నయ్య అప్పు అంటాడు కళ్యాణ్‌. అలాగే నువ్వు వదినను ఏమీ అనకు అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు. తర్వాత రాజ్‌ దగ్గరకు కావ్య వస్తుంది.

రాజ్: నీకు మంచి స్టఫ్ దొరికింది కదా..  నీవు చెప్పినట్లు ఓడిపోయాను కదా! ఇప్పుడు నీకు అడ్డంగా దొరికిపోయాను కదా!

కావ్య: నేను ఏం అనలేదు. అన్నీ మీరే అనుకుంటున్నారు.

రాజ్‌: నీకు అనే ఛాన్స్ ఇవ్వలేదు. నాకు నేనే అనుకుంటున్నాను. దటీజ్ స్వరాజ్

కావ్య: పోనిలేండి ఇన్నాళ్లు మీరెంత ఫూలిష్‌గా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకున్నారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నారు.

రాజ్‌: ఏంటే నేను ఇన్ని అనుకున్నా నువ్వు సెటైర్లు వేస్తున్నావ్

కావ్య: దటీజ్ కళావతి.. డాటర్ ఆఫ్ కనకం.

 అని కావ్య అనగానే రాజ్‌ వెళ్లిపోతుంటాడు. కావ్య ఆపి మీ అంచనాలన్నీ చెల్లాచెదురయ్యాయి కదా? అంటుంది. అవునని కానీ కళ్యాణ్‌ ఇక్కడే ఉంటే సమస్య పరిష్కారం అవుతుందనుకున్నాను కానీ సమస్య ఇంట్లోనే ఉంది. ఇంట్లో వాళ్లు మారితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటాడు రాజ్‌. తర్వాత తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు రుద్రాణి, రాహుల్ మందు తాగుతుంటారు.

రుద్రాణి:  మొదటిసారి విజయం దక్కింది. ధాన్యలక్ష్మీ పిచ్చిది కాకపోతే నేను చెప్పిన మాటలు విని కొడుకును దూరం చేసుకుంది.

రాహుల్‌: అవును మామ్‌ కల్యాణ్ ఇక ఇంటికి రాడు. కల్యాణ్ వచ్చేదాక రాజ్ కంపెనీ జోలికి రాడు.

రుద్రాణి: కానీ, కావ్య ఉంది. అది ఏదోటి చేస్తుంది కాబట్టి. రాజ్ ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేయాలి. వాడు ఒంటరివాడై డిప్రెషన్‌లోకి వెళ్లాలి. అప్పుడే మనకు ఈ కంపెనీ దక్కుతుంది.

  అప్పుడే అటువైపుగా వెళ్తున్న స్వప్న వాళ్లను చూస్తుంది.

స్వప్న: నా చెల్లిని అవమానించి సిగ్గులేకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నారా..?  మీ సంతోషమే మీకు శాపంగా మారేలా చేస్తాను చూడండి.

 అనుకుంటూ వెళ్లిపోతుంది స్వప్న. తర్వాత అపర్ణ, ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్లి కన్వీ్న్స్‌ చేయాలని చూస్తుంది. తాను కావ్య విషయంలో మొదట్లో ఎంతలా అపార్థం చేసుకున్నదో.. తర్వాత ఎంతగా గిల్టీగా ఫీలవుతుందో చెప్తుంది. నీ కోపం ఖరీదు నీ కన్నకొడుకును శాశ్వతంగా దూరం చేసుకోవడమే అని అపర్ణ చెప్పగానే ధాన్యలక్ష్మీ సీరియస్‌ అవుతుంది. పొలిటికల్‌ లీడర్‌ లాగా మాటలు బాగానే చెప్తున్నావు అంటుంది. నీ కోడలు నిన్ను తన గుప్పిట్లో పెట్టుకున్నట్లే ఆ అప్పు చేత నన్ను గుప్పిట్లో పెట్టుకోవడానికి నిన్ను రాయబారానికి కావ్య పంపిందా? అంటూ ప్రశ్నిస్తుంది. ఎప్పటికీ ఆ అప్పును కోడలిగా ఒప్పుకోనని ధాన్యలక్ష్మీ చెప్పడంతో అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

    మరోవైపు రుద్రాణి బెడ్ రూమ్‌లో లాఫింగ్‌ గ్యాస్‌ నింపిన బెలూన్స్ పెడుతుంది స్వప్న.  ఇంతలో రాహుల్‌ బెడ్‌ రూంలోకి వచ్చి ఒక బెలూన్‌ పగులగొట్టి హ్యాపీ బర్తుడే మామ్‌ అంటాడు. ఇంతలో లాఫింగ్‌ గ్యాస్‌ బయటకు రావడంతో రుద్రాణి, రాహుల్‌ పిచ్చి పట్టినవాళ్లలా నవ్వుతుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget