అన్వేషించండి
Advertisement
Tollywood: 'మీటింగ్ అన్నారు, ఎవరూ రాలేదే' అసలు విషయమేమిటంటే?
సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి మొత్తం 240 మందికి ఈ మీటింగ్ కి సంబంధించిన ఆహ్వానం వెళ్లిందట.
కొన్ని సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్ ఇష్యూ నడుస్తూనే ఉంది. ఈ విషయంలో సినీ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. చిరంజీవితో సహా.. ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి లాంటి ఇండస్ట్రీ పెద్దలు స్వయంగా జగన్ ను కలిసి ఈ సమస్యకు పరిష్కారమొస్తుందని మీడియా ముందు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం నాడు నిర్మాతల మండలిలో మీటింగ్ జరగనుందని ఓ వార్త చక్కర్లు కొట్టింది. చిరంజీవి, మోహన్ బాబు లాంటి ప్రముఖులు ఈ మీటింగ్ కి హాజరవుతారని అన్నారు.
తీరా మీటింగ్ లో ఎవరూ కనిపించకపోవడం ఆశ్చర్యకరం. సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి మొత్తం 240 మందికి ఈ మీటింగ్ కి సంబంధించిన ఆహ్వానం వెళ్లిందట. అందులో నుంచి కనీసం వంద మంది కూడా ఈ మీటింగ్ కి రాలేదు. సీనియర్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబు లాంటి వాళ్లు ఎక్కడా కనిపించలేదు. దర్శకుడు రాజమౌళి మాత్రం హాజరయ్యారు.
తమ్మారెడ్డి భరద్వాజ, ప్రసన్న కుమార్, సి.కళ్యాణ్, నట్టి కుమార్ తదితరులు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఈ క్రమంలో ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కరోనా తరువాత దర్శకులు, నిర్మాతలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని.. ఆ సమస్యలను చర్చించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం కానీ టికెట్ రేట్స్, సినీ పరిశ్రమ సమస్యల గురించి కాదని క్లారిటీ ఇచ్చారు.
చిరంజీవితో పాటు సినీ ప్రముఖులంతా కలిసి జగన్ ను కలవడం, తమను కావాలనే ఆ మీటింగ్ కి పిలవలేదని మంచు ఫ్యామిలీ కామెంట్స్ చేయడంతో.. ఆదివారం నాడు మీటింగ్ ఎలా జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీటింగ్ లు ప్రముఖులు హాజరుకాలేదు. ఏదో భారీ రేంజ్ లో మీటింగ్ జరుగుతుందనుకుంటే.. కేవలం దర్శకనిర్మాతల సమస్యల కోసమే మీటింగ్ నిర్వహించామని చెప్పి షాకిచ్చింది నిర్మాతల మండలి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets