అన్వేషించండి

Samantha : సమంత - స్వర్గం - ఆ రెండు ప్రశ్నలు, 2022లో సమంత లాస్ట్ పోస్ట్!

సమంత మాటల్లో, చేతల్లో ఈ మధ్య ఎక్కువ ఫిలాసఫీ ఉంటోంది. 2022లో చివరి రోజు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్ చేసిన వీడియో చూసినా... అదే అనిపిస్తోంది. 

సమంత (Samantha) మోడ్రన్ అమ్మాయి. అయితే, ఆమెలో ఓ ఫిలాసఫర్ కూడా ఉన్నారు. అప్పుడప్పుడూ ఆమె మాటల్లో లోతైన భావం కనబడుతుంది. ఈ మధ్య అయితే మాటల్లో, చేతల్లో ఫిలాసఫీ ఎక్కువ వినబడుతోంది. సమంత చేసే సోషల్ మీడియా పోస్టులో, చెప్పే మాటలో మంచి ఉంటుంది. 

2022లో సమంత చేసిన లాస్ట్ పోస్ట్ ఏదో తెలుసా?
Samantha's 2022 Last Social Media Post : గత ఏడాది... 2022లో సమంత చేసిన లాస్ట్ పోస్ట్ ఏదో తెలుసా? ట్విట్టర్‌లో అయితే డిసెంబర్ 29న ఒక ఫోటో పోస్ట్ చేశారు. ''జీవితంలో ముందుకు వెళ్ళాలి. మనం ఏది కంట్రోల్ చేయగలమో... అదే చేయాలి. కొత్తగా, సులభంగా చేయగలిగిన నిర్ణయాలు తీసుకోవాలి. హ్యాపీ 2023'' అని పోస్ట్ చేశారు. 

మరి, ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత లాస్ట్ చేసిన పోస్ట్ ఏదో తెలుసా? ట్వీట్ చేసిన ఫోటో, క్యాప్షన్! కానీ, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో డిసెంబర్ 31న ఓ వీడియో షేర్ చేశారు. అది సద్గురు చెప్పిన మాటల్ని!

స్వర్గానికి వెళ్ళాలంటే?
''స్వర్గంలోకి వెళ్ళాలంటే... రెండు ప్రశ్నలు అడుగుతారు. ఒకటి... నువ్వు సంతోషంగా ఉన్నావా? రెండు... నీ చుట్టుపక్కల వాళ్ళను సంతోషంగా ఉంచావా? ఆ రెండిటికీ 'అవును' అని సమాధానం చెబితే నిన్ను లోపలికి పంపిస్తారు'' అని సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పిన వీడియో సమంత షేర్ చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sadhguru (@sadhguru)

గత ఏడాది సమంత జీవితంలో చాలా జరిగాయి. అక్టోబర్ 2021లో అక్కినేని నాగ చైతన్య, ఆమె విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. వైవాహిక బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత గత ఏడాది ఒంటరిగా ఉన్నారు. పైగా, మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు. ఒకానొక దశలో ఒక్కో అడుగు కూడా వేయడం కష్టమైందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సమంత సద్గురు వీడియో షేర్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. 

ఏది ఏమైనా సమంత సంతోషంగా ఉండాలని ఆమె అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు కోరుకుంటున్నారు. మళ్ళీ సినిమా షూటింగ్స్ స్టార్ట్ చేయాలని ఆశిస్తున్నారు.

Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ - NTR 30 విడుదల ఎప్పుడో చెప్పేశారోచ్!
  
'శాకుంతలం' అప్‌డేట్‌ రెడీ
Samantha Upcoming Movie : గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం' (Shaakuntalam). రేపు... జనవరి 2న ఈ సినిమా అప్ డేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. విడుదల తేదీ వెల్లడించే అవకాశాలు ఉన్నాయని టాక్. ఈ సినిమాలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gunaa Teamworks (@gunaa_teamworks)


'ఖుషి' షూటింగ్ ఎప్పుడు?
'శాకుంతలం' చిత్రీకరణను సమంత ఎప్పుడో కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమా 'ఖుషి'. విజయ్ దేవరకొండకు జంటగా సమంత నటిస్తున్న చిత్రమిది. ఆమె అనారోగ్యం కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్ మూడో వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, షూటింగ్ స్టార్ట్ కాలేదు. 

శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి 'ఖుషి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.

Also Read : 'కెజియఫ్'లో రాకీ భాయ్‌లా ఉన్నాడేంటి? రణ్‌బీర్‌ కపూర్‌ 'యానిమల్‌' ఫస్ట్‌ లుక్‌పై కామెంట్స్‌

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 27th:పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
జగద్ధాత్రి సీరియల్: పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Mahendragiri Varahi : మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
Pyaar Prema Kalyanam OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget