అన్వేషించండి

Puri Jagannadh : ప్రేక్షకులను తప్ప నేను ఎవరినీ మోసం చేయలేదు : పూరి

ప్రేక్షకులను తప్ప తాను ఎవరినీ మోసం చేయలేదని దర్శకుడు పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. 'లైగర్' విడుదల తర్వాత ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్స్ ఇష్యూస్ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఆయన ఎటువంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. అందులో మరో సందేహానికి తావు లేదు. పూరి సినిమాల్లో డైలాగులే కాదు... నిజ జీవితంలో ఆయన చెప్పే మాటలు కూడా తూటాల్లా ఉంటాయ్. 'లైగర్' సినిమా డిజాస్టర్ తర్వాత తలెత్తిన ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్స్ గొడవ నేపథ్యంలో ప్రస్తుతం పూరి చేసిన  వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. 

దగా చేస్తే... ప్రేక్షకులనే చేశా! - పూరి
''ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే... మనలను పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడు అయినా మోసం చేస్తే? దగా చేస్తే? అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులను మాత్రమే! ప్రేక్షకులను తప్ప నేను ఎవరిని మోసం చేయలేదు'' అని తాజాగా ఓ మీడియాకు రాసిన లేఖలో పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. తన ప్రేక్షకులకు మాత్రమే తాను జవాబుదారీ అని ఆయన వివరించారు. మళ్ళీ ఇంకో సినిమా తీసి వాళ్ళను ఎంటర్‌టైన్ చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

మోసం అనే మాట ఎందుకు వచ్చింది?
పూరి లేఖలో మోసం అనే మాట ఎందుకు వచ్చిందంటే... ఈ మధ్య ఆయనకు, కొంత మందికి మధ్య జరిగిన గొడవల కారణంగా! 'లైగర్' బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టిన తర్వాత డబ్బులు వెనక్కి ఇవ్వమని డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ నుంచి పూరి జగన్నాథ్ మీద ఒత్తిడి పెరిగింది. తొలుత కొంత మొత్తం ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. అయితే... డిస్ట్రిబ్యూటర్లు ధర్నా చేయడానికి రెడీ అవుతున్నారని తెలియడంతో పూరి హర్ట్ అయ్యారు. పరువు పోతుందని డబ్బులు ఇవ్వడానికి రెడీ అయితే... ధర్నా చేసిన వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకు ఇస్తానని తెలిపారు. అక్కడ నుంచి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. 

Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

కేసుతో మలుపు తిరిగిన పరిణామాలు!
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్ మీద పూరి జగన్నాథ్ కేసు పెట్టారు. తనకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడే విధంగా వ్యక్తులను ప్రేరేపిస్తున్నారని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తాను ప్రస్తుతం ముంబైలో ఉన్నానని, తాను ఇంటి దగ్గర లేని సమయంలో తన కుటుంబ సభ్యులకు ఏదైనా హాని తల పెట్టవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో పూరి ఇంటి దగ్గర పోలీసులు భద్రత కల్పించారు.

పూరి జగన్నాథ్ ఫిర్యాదుతో డిస్ట్రిబ్యూటర్లకు షాక్ తగిలింది. తమను పూరి మోసం చేశారనే ఫీలింగ్ వారిలో ఉంది. ఫిలిం నగర్ అంతర్గత సంభాషణల్లో వారు ఆ అలా మాట్లాడుతున్నారట. అందుకని, తాను ఎవరినీ మోసం చేయలేదని పూరి చెప్పారనుకోవాలి. అదీ సంగతి! పూరి విడుదల చేసిన లేఖలో ఫిలాసఫీ ఎక్కువ కనిపించింది. మరణించిన తర్వాత ఎవరూ రూపాయి తీసుకు వెళ్లలేరని, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఒకదాని తర్వాత మరొకటి అలల తరహాలో వస్తాయని పేర్కొన్నారు. 

ఇప్పుడు ఛార్మి, పూరి ముంబైలో ఉన్నారు. నిర్మాణ సంస్థలను కలుస్తున్నారు. కొత్త సినిమా ఓకే చేసే పనుల్లో ఉన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

వీడియోలు

రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Who is Sameer Minhas: వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా బ్యాటింగ్ చేసిన సమీర్ మిన్హాస్.. ఇంతకీ ఎవరితను
వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా బ్యాటింగ్ చేసిన సమీర్ మిన్హాస్.. ఇంతకీ ఎవరితను
Embed widget