By: ABP Desam | Updated at : 06 Jun 2023 12:45 PM (IST)
ముఖేష్ ఖన్నా(Photo Credit: Mukesh Khanna/Instagram)
90వ దశకంలో బుల్లి తెర ప్రేక్షకులను, ఇంకా చెప్పాలంటే పిల్లలకు అద్భుతంగా నచ్చిన సీరియల్ ‘శక్తిమాన్’. ఎవరు ఆపదలో ఉన్నా ఈ సూపర్ హీరో ఇట్టే వచ్చి కాపాడేవారు. పిల్లలు అయితే, బయట కూడా శక్తిమాన్ వచ్చి కాపాడుతాడు అని భావించేవారు. అంతటి ప్రజాదరణ పొందిన ఈ సీరియల్ కొంత కాలం తర్వాత ఆగిపోయింది. ప్రస్తుతం ఇదే కథతో ‘శక్తిమాన్’ అనే సినిమాను తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమా వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.
తాజాగా ‘శక్తిమాన్’ గురించి ముఖేష్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా బడ్జెట్, నిర్మాణ సంస్థకు సంబంధించిన ఆనేక విషయాలను వెల్లడించారు. పలు కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోందని చెప్పుకొచ్చారు. “కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది. ఈ సినిమాను ‘స్పైడర్మ్యాన్’ను నిర్మించిన సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్తో అంతర్జాతీయ ప్రమాణాలతో రెడీ కానుంది. ‘క్రిష్’, ‘రా వన్’ సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో నేనూ నటిస్తున్నాను. అయితే, ఇప్పుడే నా పాత్ర గురించి ఏమీ చెప్పలేను. ప్రస్తుతానికి నేను ‘శక్తిమాన్’ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర ఎవరు పోషిస్తారు? దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయాల గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది” అని ఆయన చెప్పుకొచ్చారు.
అంతేకాదు, “’శక్తిమాన్’ సినిమా పూర్తి కమర్షియల్ మూవీగా రూపొందనుంది. ఈ సినిమాని స్పైడర్ మ్యాన్ మేకర్స్ చేస్తున్నారు. కానీ, శక్తిమాన్ దేశీ సూపర్ హీరోగానే ఉంటాడు. ఈ సినిమా కథను ఇప్పటికే సిద్ధం చేశాను. మేకర్స్ కు నా ఒక్కటే షరతు. ఈ సినిమా కథ మార్చడానికి వీల్లేదు. శక్తిమాన్ ఎవరు అవుతారని ప్రజలు అడుగుతారు? ఇది కూడా చాలా పెద్ద ప్రశ్న. నేను సమాధానం చెప్పను. కానీ, ముఖేష్ ఖన్నా లేకుండా ‘శక్తిమాన్’ ఉండడు అని కచ్చితంగా చెప్పవచ్చు” అన్నారు. హాలీవుడ్ దర్శకుడు ఎవరైనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారా? అని అడిగినప్పుడు “ఈ సినిమా కథ భారతదేశానికి సంబంధించినది. దర్శకుడు కూడా ఇక్కడ వ్యక్తి అయి ఉండాలి. బయట నుంచి వచ్చిన దర్శకుడు భారతీయ సందర్భాన్ని అర్థం చేసుకోలేడు” అని ముఖేష్ ఖన్నా వివరించారు. గత సంవత్సరం, సోనీ పిక్చర్స్ ఇండియా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది. మూవీ నిర్మాణం గురించి ప్రకటన చేసింది.
దూరదర్శన్ చానెల్ లో 1997 నుంచి 2005 వరకూ ‘శక్తిమాన్’ సీరియల్ టెలీకాస్ట్ అయ్యింది. ఇందులో శక్తిమాన్ గా ముఖేశ్ ఖన్నా నటించారు. ఇక, త్వరలో సినిమాగా రానున్న ‘శక్తిమాన్’ మూడు భాగాలుగా తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ విషయం అధికారికంగా వెల్లడి కాలేదు. ఇక ‘శక్తిమాన్’ పాత్రతో ముఖేష్ ఖన్నా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. BR చోప్రా ‘మహాభారత్’లో భీష్మ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. టెలివిజన్ షో ‘ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా’తోనూ అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు.
Read Also: ‘RRR’ మరో ఘనత, గోల్డెన్ ట్రైలర్ అవార్డుకు రీ-రిలీజ్ ట్రైలర్ నామినేట్!
Subhasree: కచ్చితంగా తిడతారు, నేను చాలామందికి ఆ సలహా ఇవ్వను: శుభశ్రీ
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss Telugu 7: పవర్ అస్త్రాలు మటాష్, కెప్టెన్సీ టాస్క్ షురూ - ‘ఏం మనుషులు అయ్యా’ అంటూ శివాజీ ఆగ్రహం
తెలుగులో సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని అడిగారు - స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్!
Siddharth: పద్ధతిగా కూర్చొని ప్రశ్నలు అడగమనండి - ఆ జర్నలిస్ట్కు సిద్ధార్థ్ స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Yashasvi Jaiswal: బాబోయ్ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్గా గిల్ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం
/body>