అన్వేషించండి

Manchu Vishnu: 'మా' బిల్డింగ్ నిర్మాణానికి రెండు ఆప్షన్లు, అందుకు మూడు నాలుగేళ్లు పడుతుంది: మంచు విష్ణు

ప్రెస్ మీట్ లో 'మా' అసోసియేషన్ మెంబర్షిప్ గురించి, 'మా' బిల్డింగ్ గురించి మాట్లాడారు మంచు విష్ణు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకొని ఏడాది అయిన సందర్భంగా మంచు విష్ణు ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో అసోసియేషన్ మెంబర్షిప్ గురించి, 'మా' బిల్డింగ్ గురించి మాట్లాడారు.

ఫారెన్ లో ఫండ్ రైజింగ్ ఈవెంట్:
''ఎలెక్షన్స్ సమయంలో మేము ఏమైతే ప్రామిస్ చేశామో అవి తొంబై శాతం పూర్తి చేశాము. ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కాలని.. నటీనటుల పేర్లతో ఒక బుక్ ప్రింట్ చేయించాం. అది యాక్టివ్ గా ఉన్న ప్రొడ్యూసర్స్ కి అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పది మందికి అవకాశాలు వచ్చాయి. సోషల్ మీడియా యాప్ కూడా రెడీ చేస్తున్నాం. మహిళల సంరక్షణ కోసం ఓ కమిటీను ఏర్పాటు చేశాము. ఈ కమిటీకి పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ సలహాదారుగా పని చేస్తున్నారు. ఈ అసోసియేషన్ లో లైఫ్ టైమ్ మెంబర్ కావాలంటే.. హీరో, హీరోయిన్లు కనీసం రెండు సినిమాల్లో నటించి, అవి రిలీజై ఉండాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే కనీసం పది సినిమాల్లో నటించి ఉండాలి. రెండు నిమిషాలపాటు సినిమాలో డైలాగ్స్ ఉంటేనే మెంబర్షిప్ ఇస్తాం. లైఫ్ మెంబర్షిప్ తీసుకున్నవాళ్లకి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ అసోసియేషన్ కోసం ఫండ్స్ రైజ్ చేయబోతున్నాం. జనవరిలో ఈవెంట్ ఉంటుంది. అది ఫారెన్ లో చేయాలనుకుంటున్నాం. కొన్ని హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్ తో డీల్ పెట్టుకున్నాం. అందులో అసోసియేషన్ మెంబర్స్ కి డిస్కౌంట్ ఉంటుంది'' అని చెప్పుకొచ్చారు. 
 
నాలుగేళ్ల తరువాతే 'మా' బిల్డింగ్: 
ఇక 'మా' బిల్డింగ్ గురించి వస్తే.. ''అసోసియేషన్ మెంబర్స్ కి రెండు ఆప్షన్స్ ఇచ్చాను. సొంత డబ్బుతో ఆరు నెలల్లో కొత్త బిల్డింగ్ కడతానని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాను. ప్రస్తుతం ఉన్న ఫిల్మ్ ఛాంబర్ ను పడగొట్టి అక్కడ కొత్త బిల్డింగ్ కడుతున్నారు. అందులో స్పేస్ కొని ఇస్తాననేది రెండో ఆప్షన్. దానికి మూడు, నాలుగేళ్లు పడుతుంది. అయితే మా సభ్యులు రెండో ఆప్షన్ ఎంపిక చేసుకున్నారు'' అంటూ మంచు విష్ణు తెలిపారు.  
 
 
మంచు విష్ణు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'జిన్నా' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా దసరా బరిలో నిలవాల్సి ఉండేది. కానీ, చిరంజీవి ‘ గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలు రిలీజ్ అవుతుండటంతో వాయిదా వేశారు.  అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 'జిన్నా' విడుదల అవుతుంది. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ ప్లే  అందించిన ఈ సినిమాను .. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి.  రక్షిత్ మాస్టర్ ఈ మూవీకి కొరియోగ్రాఫర్‌ గా చేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌ గా అనూప్ రూబెన్స్, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Godavari Serial Today July 17th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
Kiara Advani : రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget