అన్వేషించండి

Sankarabharanam: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ‘శంకరాభరణం’ రిలీజైన రోజే అస్తమించిన కళాతపస్వి!

ఫిబ్రవరి 2.. దర్శకుడు కె.విశ్వనాథ్ జీవితంలో మరిచిపోలేని రోజు. ఎందుకంటే.. ఇదే రోజున ‘శంకరాభరణం’ మూవీ రిలీజైంది. బాధకరమైన విషయం ఏమిటంటే.. ఇదే రోజున ఆయన కన్ను మూశారు.

రోజు తెలుగు సినిమా ఎన్నో ఘనతలు సాధిస్తోంది. ఎస్.ఎస్.రాజమౌళి లాంటి మాస్టర్ మైండ్స్ ప్రతిభ, కృషితో ఆస్కార్ స్థాయికి తెలుగు సినిమా చేరుకుంది. కానీ ఒకానొక దశలో తెలుగు సినిమా మూసధోరణిలో పడిపోయింది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో. ఒకప్పుడు టాలీవుడ్ పరిస్థితి కూడా అంతే. ఏం సినిమాలు తీస్తున్నారో ఎవ్వరికీ తెలీదు. 70ల చివరినాటికి చేరుకునే సరికి పరిస్థితి మరీ దిగజారింది. పాటల్లో ద్వందార్థాలు.. బూతు మాటలు.. డబుల్ మీనింగ్ డైలాగులు పెడితే కానీ సినిమాను ప్రేక్షకుడికి చూపించలేని పరిస్థితి. ఇలాంటి టైంలో ఓ సినిమా విడుదలైంది. అచేతన స్థితిలో సొమ్మసిల్లి పడిపోయిన తెలుగు సినిమాకు ఊపిరి పోసింది. హీరో అంటే ఇలా ఉండాలి. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. డైరెక్షన్ అంటే ఇలానే చేయాలనే ఆలోచనల నుంచి బయటపడేసిన ఏకైక చిత్రం.. ‘శంకరాభరణం’. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం నభూతో నభవిష్యతి. ఈ తెలుగు సినిమా ఇంత గర్వంగా నిలబడిందంటే దానికి మళ్లీ తవ్వి వేసిన పునాది ‘శంకరాభరణం’.

హీరో ఓ వృద్ధుడు.. పేరు శంకరశాస్త్రి. విమెన్ లీడ్ క్యారెక్టర్ ఓ దేవదాసీ. ప్లాట్ లైన్ శాస్త్రీయ సంగీత నేపథ్యంలో సినిమా. సాధారణంగా అప్పట్లో  యూత్‌కు కూడా ఇది బోరింగ్ కాన్సెప్ట్. అసలు జేవీ సోమయాజులు అనే స్టేజ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తే జనాలు డబ్బులిచ్చి టిక్కెట్లు కొనుక్కుని థియేటర్లకు వస్తారా? అనే సందేహాలతో ఆ సినిమాను కొనటానికి ఒక్కరూ రాలేదు. అప్పటికే ఇండస్ట్రీలో తనకున్న పలుకుబడితో విశ్వనాథ్ స్పెషల్ షో వేయించినా సినిమా కొనేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపించలేదు. మొత్తాన్నికి.. ఎన్నో ప్రయత్నాల తర్వాత 1980, ఫిబ్రవరి 2న కొన్ని థియేటర్లలో ఈ సినిమాను రీలీజ్ చేశారు. విశ్వనాథ్. మహా అయితే పదుల సంఖ్యలోనే షోలు. ఒక్కవారం ఆడింది. ఆ సినిమా విలువ జనాలకు అర్థమైంది. మౌత్ పబ్లిసిటీతో థియేటర్లు జామ్ ప్యాక్ అయిపోవటం మొదలైంది. దీంతో ‘శంకరాభరణం’ మూవీకి థియేటర్ల సంఖ్య పెంచారు. ఈ మూవీకి వస్తున్న పబ్లిసిటీని చూసి ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లు తలలు పట్టుకున్నారు. ఏముందీ ఈ సినిమాలో.. అసలు కమర్షియల్ వయబుల్ అయ్యే లైనే కాదు ఈ సినిమా అనుకున్నారు. వారి అనుకున్నది కూడా నిజమే. కానీ, అందులో కంటెంట్ అసలైన మ్యాటర్. అందుకే కలెక్షన్ల వర్షం కురిసింది. సంగీత సరస్వతి ప్రభంజనానికి లక్ష్మీ కటాక్షం తోడైంది. విశ్వనాథుల వారి దర్శకత్వ ప్రతిభ, జేవీ సోమయాజులు, మంజుభార్గవి తదితరుల నటన.. కేవీ మహదేవన్ సంగీతం ఈరోజుకూ మనల్ని తడుతూనే ఉన్నాయి. జీవచ్ఛవంలా మారుతున్న తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ఘనత కళాతపస్వి కే విశ్వనాథ్ ది. చిత్రం ఏమిటంటే ఆ మూవీని విడుదల చేసిన ఫిబ్రవరి 2వ తేదీనే విశ్వనాథ్ కన్నుమూశారు. 

అప్పట్లో హైదరాబాద్‌లోని రాయల్ థియేటర్ లో 216 రోజులు లాంగ్ రన్. కేరళ వాళ్లు వచ్చి సినిమాను కొనుక్కెళ్లి డబ్బింగ్ చేయించుకుని తిరువనంతపురంలో కవిత థియేటర్లో ఆడించారు. 200 రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్లు. అదీ కే విశ్వనాథ్ అంటే.. అదీ ఆయన తెలుగు సినిమాకు చేసిన మేలంటే. చెబితే అతిశయోక్తి అనుకుంటారేమో కానీ ఈ రోజు జనాలు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నారంటే.. దాన్ని వాళ్ల పిల్లలకు నేర్పించటం తమ వారసత్వంగా భావిస్తున్నారంటే.. ‘శంకరణాభరణం’ సినిమా ఓ పెద్ద రీజన్. లేదంటే పాశ్చాత్య సంగీతపు హోరులో ఎప్పుడో మన కల్చర్ తన ట్రెడీషన్స్ కొట్టుకుపోయేవి. అంతటి గొప్ప సినిమా మనకు తెలుగు వారికి కానుకగా ఇచ్చిన మహానుభావుడు మన మధ్యలో లేకపోవచ్చు. కానీ తెలుగు సినిమా ఉన్నంత కాలం ‘శంకరాభరణం’ సినిమాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాం. విశ్వనాథుల వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం.

Also Read : చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP DesamSanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP DesamAshutosh Sharma 66 Runs DC vs LSG Match Highlights | అశుతోష్ శర్మ మాస్ బ్యాటింగ్ చూశారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Rishabh Pant Trolls: స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
Crime News: యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Embed widget