అన్వేషించండి

Yash New Movie : మలయాళీ దర్శకురాలితో 'కెజియఫ్' రాకీ భాయ్ యష్ నెక్ట్స్ సినిమా?

'లైయర్స్ డైస్' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన మలయాళీ దర్శకురాలు గీతు మోహన్‌దాస్, యష్ తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతుండగా... త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Yash 19 Movie Update : జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ (Geethu Mohandas), సెన్సేషనల్ హీరో యష్ (Yash )తో కలసి ఓ సినిమా చేయనున్నారా? యస్ 19వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని ఆమె అందుకున్నారా? అంటే... కన్నడ సినిమా వర్గాల్లో కొందరు 'అవును' అంటున్నారట. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని సమాచారం. దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.

ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన 'కేజీఎఫ్ (KGF)', 'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాయి. 'కేజీఎఫ్' భారతీయ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది. దాంతో యష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆయన నటించబోయే తదుపరి చిత్రంపై పలు ఊహాగానాలు సైతం ఏర్పడ్డాయి. అభిమానులు ఇప్పటికే 'కేజీఎఫ్ చాప్టర్ 3' కోసం ఎదురు చూస్తుండగా.. తాజాగా యష్ మరో చిత్రంపై క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఆయన నెక్స్ట్ సినిమాను జాతీయ అవార్డు గెలుచుకున్న, దర్శకురాలు 'గీతు మోహన్‌దాస్‌'తో చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

తన తదుపరి చిత్రంపై స్పందించిన యష్... డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ తో సినిమా కోసం గత ఏడాది నుంచి చర్చలు సాగుతున్నాయన్నారు. గీతు తన వద్దకు వచ్చిన కాన్సెప్ట్‌తో తాను బౌల్డ్ అయ్యానన్నారు. 'కేజీఎఫ్' సిరీస్ తో భారీ హిట్ లను అందుకున్న యష్.. పెద్ద పేరున్న డైరెక్టర్లతో తన నెక్స్ట్ ప్రాజెక్టు చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతలోనే రాకింగ్ స్టార్ ఓ మలయాళ స్క్రిప్టును ఓకే చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.  

యష్ ఈ సారి బడ్జెట్ బేస్డ్ సినిమాపై కంటే కథకు హైప్ తీసుకువచ్చే మూవీ తీయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పట్నుంచే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ఇక కథలకు ప్రాధాన్యత ఇస్తూ రిస్క్ లు చేసే యష్ కి ఆ కథ ఛాలెంజింగ్ గా అనిపించడంతో ఓకే చెప్పినట్లు, దీని పై కొంత కాలంగా వర్క్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చర్చలు నడుస్తోన్న ఈ సినిమాను మరో 30రోజుల్లో ప్రకటిస్తారని యష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

'లైయర్స్ డైస్' సినిమాతో డైరెక్టర్ గా సినీ రంగ ప్రవేశం చేసిన గీతు మోహన్‌దాస్ అలియాస్ గాయత్రీ దాస్ దర్శకురాలే కాదు నటి కూడా. గీతు మోహన్‌దాస్ 'కెల్క్కున్నుందో ఆర్ యు లిజనింగ్' అనే షార్ట్ ఫిల్మ్‌తో దర్శకురాలిగా పరిచయం అయ్యింది. ఇది అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడగా.. భారతదేశంలో ఉత్తమ షార్ట్ ఫిక్షన్, జాతీయ అవార్డు విభాగంలో 3 అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది. 2014లో విడుదలైన ఆమె మొదటి చలనచిత్రం 'లయర్స్ డైస్' భారతదేశంలో 2 జాతీయ అవార్డులను గెలుచుకుంది.

Also Read ప్రభాస్ ఫ్యాన్స్‌ను భయపెట్టిన 'శాకుంతలం' - 'ఆదిపురుష్' ఎలా ఉంటుందో? 

ఇదిలా ఉండగా.. ఇటీవలే 'కేజీఎఫ్ చాప్టర్ 2' రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్' ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చింది. 'కేజీఎఫ్ చాప్టర్ 3'పై ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో రాఖీ భాయ్ 1971 నుంచి 1981 మధ్య కాలంలో ఎక్కడ ఉన్నాడు? ఆ టైంలో రాఖీ ఏమి చేశాడు అనే కథనంతో థర్డ్ పార్ట్ ఉండబోతుందని తెలియజేశారు. 2025లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read : పవన్ కళ్యాణ్ మాసివ్ యాక్షన్ సీన్ - 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో...

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam attack: భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
Pahalgam Terror Attack: బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
Pahalgam Terror Attack : పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు?  పిరికిపందల పన్నాగం ఏంటీ?
పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు? పిరికిపందల పన్నాగం ఏంటీ?
Pahalgam Terror Attack: పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Navy Officer Vinay Narwal Pahalgam Terror Attack | హిమాన్షీ కన్నీటికి సమాధానం చెప్పేది ఎవరు.? | ABP DesamSRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam attack: భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
Pahalgam Terror Attack: బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
Pahalgam Terror Attack : పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు?  పిరికిపందల పన్నాగం ఏంటీ?
పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు? పిరికిపందల పన్నాగం ఏంటీ?
Pahalgam Terror Attack: పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
నీ పేరు నిలబెడతా..గర్వపడేలా చేస్తా..నేవీ అధికారి భార్య ఎమోషనల్
నీ పేరు నిలబెడతా..గర్వపడేలా చేస్తా..నేవీ అధికారి భార్య ఎమోషనల్
Pahalgam Terror Attack : ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలతో పాకిస్థాన్‌కు కలిగే నష్టమేంటీ?
ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలతో పాకిస్థాన్‌కు కలిగే నష్టమేంటీ?
Pahalgam Attack: వీళ్ల ఆచూకీ చెబితే 20 లక్షలు - జమ్ముకశ్మీర్ పోలీసుల కీలక ప్రకటన
వీళ్ల ఆచూకీ చెబితే 20 లక్షలు - జమ్ముకశ్మీర్ పోలీసుల కీలక ప్రకటన
Aghori : ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
Embed widget