![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Actress Sireesha: సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు - భర్తకు విడాకులు ఇచ్చిన 'మొగలిరేకులు' నటి
Actress Sirisha Divorce: సినీ ఇండస్ట్రీలో మరో జంట విడిపోయంది. ప్రముఖ నటి, మొగలిరేకులు ఫేం శీరిష తన భర్తతో విడాకులు తీసుకుని విడిపొయింది.తాజాగా దీనిపై ఆమె సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది.
![Actress Sireesha: సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు - భర్తకు విడాకులు ఇచ్చిన 'మొగలిరేకులు' నటి TV Actress Sireesha Announced Divorce With Husband Naveen Actress Sireesha: సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు - భర్తకు విడాకులు ఇచ్చిన 'మొగలిరేకులు' నటి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/f3fe2e4aa5ab3f1e26b3953fa276db491715925578998929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Actress Sireesha Announce Divorce With Husband Naveen: కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విడాకుల వార్తలు వింటున్నాం. స్టార్ హీరోయిన్స్ నుంచి టీవీ సీరియల్ యాక్టర్స్ వరకు పలువురు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇటీవల కోలీవుడ్ స్టార్ కపుల్ జీవీ ప్రకాష్-సైంధవిలు తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పారు. ఈ వార్తను సినీ ఇండస్ట్రీని షాక్ గురి చేసింది. అంతలోనే ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది. ప్రముఖ తెలుగు బుల్లితెర నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొగలిరేకులు సీరియల్ గుర్తింపు పొందిన నటి శీరిష తాజాగా భర్తతో విడిపోయినట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేసింది.
మా బంధం ముగిసింది
శీరిష్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తూ.. "నా అభిమానులు, శ్రేయోభిలాషులకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. నేను, నా భర్త నవీన్ భార్యభర్తల బంధానికి ముగింపు పలికాం. కొన్ని పరిస్థితులు, మనస్పర్థల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ క్లిష్టపరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని సపోర్టు చేస్తారని ఆశీస్తున్నా. నేను ఒక సెలబ్రిటీని కాబట్టి మీతో ఈ విషయం చెప్పాలనించింది. వీలైతే సపోర్టు చేయండి. కానీ విమర్శించకండి. నవీన్పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. మమ్మల్ని అర్థం చేసుకుని సపోర్టు చేస్తున్నందుకు ధన్యవాదాలు" అంటూ ఆమె వెల్లడించింది.
View this post on Instagram
అచ్చమైన తెలుగు అమ్మమైన శీరిష తెలంగాణ చెందిన అమ్మాయే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టిపెరిగిన శీరిషకు ఇద్దరు సోదరులు ఉన్నారు. వాళ్లు కూడా బుల్లితెరపై లీడ్ యాక్టర్స్గా రాణిస్తున్నారు. అయితే వారిద్దరి కంటే శీరిషనే బాగా పాపులారిటి సంపాదించుకుంది. ముగలిరేకులు సీరియల్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈమే ఇందులో సింధు పాత్రలో ఆకట్టుకుంటుంది. అమాకత్వం, వినయం ప్రదర్శిస్తూ తనదైన నటనతో ఎంట్రీతోనే ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. దాంతో శీరిషకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్లో లీడ్ యాక్టర్ రాణిస్తుంది. ఇప్పటి వరకు ఆమె స్వాతిచినుకులు, మనసు మమత, రాములమ్మ, చెల్లెలి కాపురం ఇలా అనేక సీరియల్స్లో నటించి మెప్పించింది.
Also Read: ఈ నిర్ణయమే చార్మి కెరీర్ని దెబ్బతిసిందా? - స్టార్ హీరోయిన్ నుంచి నిర్మాతగా చార్మి సినీ ప్రస్థానం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)