అన్వేషించండి

Tollywood News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!

Telangana News: తెలుగు సినిమా పరిశ్రమలోని సమస్యలు పరిష్కారనికి పెద్దలు ముందుకొచ్చారు. రేపు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడనున్నారు. దీన్ని దిల్ రాజ్ లీడ్ చేస్తున్నారు.

Tollywood News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం(డిసెంబర్‌ 26) తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు సమావేశంకానున్నారు. దీన్ని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు లీడ్ చేస్తున్నారు. శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వచ్చిన దిల్‌రాజు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఖరారు అయిందని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలోని పెద్దలందరికీ సమాచారం ఇచ్చామని రేపు ఎంత మంది వస్తే అంత మందితో సీఎంను కలుస్తామన్నారు.  

చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను రేవంత్ రెడ్డి ముందు ఏకరవు పెట్టనున్నారు. పుష్క -2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగన ఘటన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై ప్రభుత్వం బెనిఫిట్‌షోలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై అసెంబ్లీలోనే ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు బెనిఫిట్‌షోలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. 

సంక్రాంతి సందర్భంగా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈటైంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంఇండస్ట్రీకి షాక్ అనే చెప్పాలి. మొదటి రోజు టికెట్లు రేట్లు పెంచడం, బెనిఫిట్‌షోల రద్దుతో కలెక్షన్‌లపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఈ రెండు చేయడంతోనే పుష్ప -2 మొదటి రోజు 250 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. అంటే సినిమాకు పెట్టిన ఖర్చును దాదాపు వసూలు చేసినట్టే తర్వాత వచ్చిందంతా బోనస్ అవుతుంది. 

ఇప్పుడు సడెన్‌గా బెనిఫిట్‌షోలు లేవు, టికెట్‌ల పెంపు కూడా ఉండదని చెప్పడం సినిమా పరిశ్రమ పెద్దలకు మింగుడు పడటం లేదు. సంక్రాంతికి వచ్చే సినిమాలే కాకుండా ఇంకా భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమాలకి కూడా ఈ నిర్ణయం ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. అందుకే ఎలాగై ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ నిర్ణయం పునరాలోచించేలా చేయాలని చూస్తున్నారు. 

మరోవైపు సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్‌ను అరెస్టు చేసింది. ఆయన బెయిల్‌పై విడుదలైనప్పటికీ విచారణకు పిలుస్తోంది. మంగళవారం విచారించింది. ఇంకా పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొందర్ని కూడా విచారించనుంది. ఈ విషయంపై కూడా ప్రభుత్వానికి రిక్వస్ట్ పెట్టుకోనున్నారని తెలుస్తోంది. 

సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన రేవతి కుటుంబానికి న్యాయం జరుగుతుందని భరోసా ఇవ్వనున్నారు. అందుకే ఇవాళ వచ్చి శ్రీతేజ్‌ను పరామర్శించి ఆ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ప్రకటించారు. అంతే కాకుండా భాస్కర్‌కు సినిమా ఇండస్ట్రీలోనే శాశ్వత ఉద్యోగం ఇచ్చేందుకు కూడా ఓకే చెప్పారు. ఫైనల్‌గా బాధిత కుటుంబానికి భరో ఇచ్చి వారికి న్యాయం చేస్తున్నందున విషయంపై మరింత తీవ్రంగా వెళ్లొద్దని రిక్వస్ట్ చేసే అవకాశం ఉంది. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. అయినా ఇప్పటి వరకు సీఎంను సినిమా పెద్దలువ్యక్తిగతంగా కలిసిన వాళ్లు ఉన్నారే తప్ప పరిశ్రమ నుంచి ఎవరూ కలవలేదు. తమ సమస్యల గురించి చెప్పిందిలేదు. అందుకే ప్రభుత్వానికి , సినిమా పరిశ్రమకు మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతోంది. దాన్ని ఖండించడానికి ఈ భేటీ జరగనుందని అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget