![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Serial Actor Chandu Wife: ఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు - ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప
Chandrakanth Serial Actor Wife: సీరియల్ యాక్టర్ చంద్రకాంత్ మరణంతో ఆయన భార్య శిల్ప కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏం జరిగిందో వివరించారు.
![Serial Actor Chandu Wife: ఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు - ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప Serial Actor Chandu wife Shilpa explains what happens before his husband suicide in latest interview Serial Actor Chandu Wife: ఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు - ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/20033b68fec2b20d821c50978a0ee8471716104465059313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సీరియల్ యాక్టర్ చందు అలియాస్ చంద్రకాంత్ మరణం (Serial actor Chandu death)తో ఆయన భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. ఆత్మహత్య చేసుకుంటారని అసలు ఊహించలేదని శిల్ప తెలిపారు. భర్త మరణంతో ఆవిడ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏం జరిగిందో వివరించారు.
అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడాను...
తాను చావనని చెప్పారు, ఇంతలో!
పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిన చందు... సోషల్ మీడియాలో పలు పోస్టులు చేశారు. 'రెండు రోజుల్లో వచ్చేస్తాను, వెయిట్ చెయ్' నాన్న అంటూ పోస్ట్ చేశారు. అవి చూసిన ఎవరికైనా ఆయన ఏదో అఘాయిత్యానికి పాల్పడతారని సందేహం కలుగుతుంది. తమకూ అటువంటి అనుమానం కలిగిందని చందు భార్య శిల్ప తెలిపారు.
''మేం చెప్పాము. ఆయన మరణానికి ముందు అందర్నీ కూర్చోబెట్టి చెప్పాను. 'నేను జరిగిన దాని గురించి డిస్కస్ చేయను. జరిగింది ఏదో జరిగింది. వదిలేసేయ్. నా తల్లి ఐదేళ్ల క్రితం మరణించారు. పిల్లల కోసం నువ్వు ఉండు' అని చెప్పాను. పది మందిలో మాట్లాడాను. 'నేను చాలా ధైర్యంగా ఉంటాను. నేను ఏమీ చావను. నేను పిల్లలను చూసుకోవాలిగా' అని అన్నాడు. ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు'' అని కన్నీరు పర్యంతం అయ్యారు శిల్ప.
ఫుల్లుగా తాగి రోడ్డున పడ్డారు...
స్నేహితులే వాళ్లింటికి తీసుకెళ్లారు!
తాను చావనని, ధైర్యంగా ఉంటానని చందు చెప్పిన 24 గంటల్లో ఇలా జరిగిందని ఆయన భార్య శిల్ప వివరించారు. ఆత్మహత్యకు ముందు రోజు ఫుల్లుగా తాగి రోడ్డు మీద పడి ఉన్న చందును స్నేహితులు ఇంటికి తీసుకు వెళ్లారని ఆమె తెలిపారు.
Also Read: చందు సూసైడ్ కేసులో కీలకం కానున్న వాట్సాప్ ఛాట్ - మెసేజులు చెక్ చేస్తున్న పోలీసులు?
''నేను చందు స్నేహితుడి ఇంటికి వెళ్లి ఆయన్ను చూసి వచ్చాను. సేఫ్గా, బతికి ఉన్నాడని అనుకున్నా. పిల్లలకు తండ్రి ఉంటే చాలని అనుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది. ఆయన నడుచుకుంటూ బయటకి వెళుతున్నాని చెప్పారు. నాతో మాట్లాడటం లేదని ఆడపడుచుకు ఫోన్ చేశా. ఆయనకు ఫోన్ చేసి ఎక్కడికి వెళుతున్నారో కనుక్కోమని చెప్పాను. పవిత్ర పిల్లలకు ఇన్సూరెన్స్ వస్తుందని, అందుకోసం లక్డీకాపూల్ వెళుతున్నాని చెప్పారు. ఆ తర్వాత ఎంత మంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదని తెలిసింది. తెలిసిన అబ్బాయిని అడిగితే పవిత్ర ఫ్లాటుకు వెళ్లి చూశాడు. ఏడు గంటల సమయంలో మాకు విషయం తెలిసింది'' అని చెప్పారు.
పవిత్ర జయరాం మరణానికి ముందు తన అన్నయ్యకు ఫోన్ చేయగా... ఇన్సూరెన్స్ గురించి చెప్పినట్లు ఆయన చెల్లెలు స్రవంతి బోరున విలపించారు. తన అన్నయ్య ఎంతో ధైర్యంగా ఉండేవాడని, ఈ విధంగా చేసుకుంటాడని అసలు ఊహించలేదని, ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు తమకు అన్నయ్య లేడని, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని స్రవంతి పేర్కొన్నారు. పవిత్ర మరణం తర్వాత ఇంటికి వచ్చినా ఎవరితోనూ సరిగా మాట్లాడలేదని తల్లి తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)