Samantha Trolled Again: సాయి పల్లవిని చూసి నేర్చుకో - సమంతను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారుగా!
సమంత మరోసారి ట్రోలర్స్కు టార్గెట్ అయ్యారు. ఎందుకు? ఏమిటి? అని వివరాల్లోకి వెళితే...

సాయి పల్లవిని చూసి నేర్చుకోమని సమంతకు ఓ మహిళా నెటిజన్ సలహా ఇచ్చారు. అయితే... ఆమెతో విభేదించిన నెటిజన్ కూడా ఉన్నారు. 'వేసుకున్న దుస్తులను చూసి అంచనా (మనుషులను) వేయకండి. మన దేశం వెనక్కి పడిపోవడానికి కారణం మీ లాంటి ఆలోచనలే' అని ఒకరు రిప్లై ఇచ్చారు. 'దుస్తులను అనడం లేదు. మందు గురించి మాట్లాడుతున్నాను' అని అతడికి మహిళ చెప్పారు. ఇదంతా ఇన్స్టాగ్రామ్లో సమంత పోస్ట్ చేసిన ఓ వీడియో కింద కామెంట్ సెక్షన్లో జరిగిన సంగతి! ఇంతకీ, ఆ వీడియోలో ఏముంది? అంటే... సమంత లిక్కర్ ప్రమోట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాల్లోయర్లు ఉన్న సెలబ్రిటీలకు డబ్బులు ఇచ్చి తమ బ్రాండ్స్ ప్రమోట్ చేయించుకోవడం లిక్కర్ కంపెనీలకు అలవాటు. గతంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే తదితర స్టార్ హీరోయిన్లు ఈ విధంగా చేశారు. ఇప్పుడు సమంత వంతు వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 22 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఆమెతో ఓ లిక్కర్ బ్రాండ్ సంస్థ డీల్ కుదుర్చుకుంది. అయితే... నేరుగా లిక్కర్ ప్రమోట్ చేయకుండా, ఫ్యాషన్ పేరుతో ఆ బ్రాండ్ ప్రమోట్ చేశారు. సమంత ఈ విధంగా చేయడం కొంత మందికి నచ్చలేదు. దాంతో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!
సమంతకు ట్రోల్స్ కొత్త కాదు. విడాకులు తీసుకున్న తర్వాత ఆమెను చాలా మంది విమర్శించారు. అయితే... వాటిపై కొన్ని రోజుల తర్వాత సమంత స్పందించారు. మరి, ఈ ట్రోల్స్ మీద స్పందిస్తారో? లేదో? చూడాలి. వెయిట్ అండ్ సీ.
Also Read: ఆ ప్రేమకథ ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదని కోరుకుంటున్న సమంత
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
ట్రెండింగ్ వార్తలు






















