అన్వేషించండి

Pushpa 2: ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్

Pushpa 2 Dialogues Telugu: పుష్ప 2 సినిమాలో డైలాగ్స్ అంటూ ఫేక్ పోస్టులు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటి మీద మూవీ ప్రొడక్షన్ హౌస్ రియాక్ట్ అయ్యింది. ఏమన్నదీ తెలుసా?

'పుష్ప 2' (Pushpa 2 The Rule) పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయో... లేదో? సోషల్ మీడియాలో సినిమా మీద నెగెటివిటీ మొదలైంది.‌ పని గట్టుకుని మరి కొంత మంది సినిమా మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. అందులో ముఖ్యమైనది... సినిమాలో డైలాగులు ఇవి అంటూ కొన్ని డైలాగులు చక్కర్లు కొడుతున్నాయి. మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఆ డైలాగ్స్ మీద రియాక్ట్ అయింది. 

ఫేక్ పోస్టులు మానకపోతే లీగల్ యాక్షన్!
'పుష్ప 2' సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) ఇంట్రడక్షన్ ఫైటులో ఒక డైలాగ్ ఉంది. జపనీస్ ప్రజలు తమ బాస్ గురించి చెప్పినప్పుడు 'ఆ బాస్ కి కూడా నేనే బాస్' అని అల్లు అర్జున్ కౌంటర్ ఇస్తారు. దాన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా మార్చి రాశారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ... ఆ డైలాగ్ అల్లు అర్జున్ చెప్పారని కొంత మంది లేనిపోని ఆరోపణలు చేశారు. సినిమాకు సంబంధం లేని డైలాగులు పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యేలా చేశారు.

అలాగే మరొక సన్నివేశంలో అల్లు అర్జున్ 'ఏం పీకలేరు' అనే డైలాగ్ చెప్పారని, అది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారనే రీతిలో కొంత మంది ప్రచారం చేయడం మొదలు పెట్టారు. నిజానికి అటువంటి డైలాగ్ ఏది సినిమాలో అల్లు అర్జున్ చెప్పలేదు. కాకపోతే సినిమాలో ఆ డైలాగు ఉందని, నంద్యాల ఎపిసోడ్ లింక్ చేస్తూ ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ చెప్పారని ఫేక్ పోస్టులు క్రియేట్ చేశారు. ఇటువంటి పోస్టుల మీద మైత్రి మూవీ మేకర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Also Readఅల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

''ఊహాజనితమైన, సొంత క్రియేటివిటితో పుట్టించిన కొన్ని డైలాగులు 'పుష్ప 2' సినిమాలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ (కావాలని)గా కొంత మంది సినిమాపై నెగిటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోకపోతే అలాంటి వారిపై చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం'' అని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఫేక్ పోస్టులు చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకుంటామని లీగల్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యామని చెప్పడం అంటే గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు లెక్క.

Also Readసుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget