Return Of The Dragon 2025: 'పుష్ప 2'తో మొదలైన గొడవ... ఇంకా తీరలేదా? మైత్రికి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దూరమేనా?
Prasads Multiplex vs Mythri Movie Distributors: ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో మార్నింగ్ 8.45 గంటలకు కొత్త సినిమా చూడటం మూవీ లవర్స్కు అలవాటు. మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ సినిమాలకు అది ఇప్పట్లో సాధ్యం కాదా?

హైదరాబాద్, సికింద్రాబాద్... జంట నగరాలలో సినీ ప్రేమికులకు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ (Prasads Multiplex) స్క్రీన్లలో శుక్రవారం కొత్త సినిమా చూడడం ఒక అలవాటు. పండగలు లేదా ప్రత్యేక సందర్భాలలో ఫ్యామిలీని తీసుకుని అలా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దగ్గరకు వెళ్లి అందులో సినిమా చూసి అటు నుంచి ట్యాంక్ బండ్ మీద షికారు చేసి రావడం కామన్. ఆయితే... ఇక నుంచి టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్లలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ అనుబంధ సంస్థ, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ చేసే సినిమాలను ప్రసాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో చూడడం ఇప్పట్లో సాధ్యం కాదేమో!?
ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' తెలుగు వెర్షన్ ఎక్కడ?
'లవ్ టుడే' సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయిన కోలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఆయన నటించిన లేటెస్ట్ సినిమా 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్'. ఈ సినిమా షోలు ప్రసాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో వేయడం లేదు. అయితే తమిళ వెర్షన్ షోలు పడుతున్నాయి. 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' అని అడిగితే కష్టం మరి. ఎందుకంటే, ఈ సినిమా తమిళ టైటిల్ 'డ్రాగన్' (Dragon Movie). ఆ షోలు వేసి మరి తెలుగు షోలు ఎందుకు వేయడం లేదంటే? తెలుగు వెర్షన్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కాబట్టి అని ఫిలింనగర్ వర్గాల గుసగుస.
ప్రసాద్స్ మల్టీప్లెక్స్ మైత్రి మధ్య గొడవ తీరలేదా?
'పుష్ప 2' విడుదల టైం నుంచి ఇప్పటికీ అలాగే ఉందా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ చేసిన 'పుష్ప 2: ది రూల్' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది. నైజాం అంతటా ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేసింది. అప్పట్లో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ప్రసాద్ మల్టీప్లెక్స్ మధ్య పర్సంటేజ్ లెక్కలు తీసుకునే విషయంలో ఒక నిర్ణయానికి రావడంలో దూరం పెరిగింది. సాధారణంగా మల్టీప్లెక్స్ ఓనర్లు ప్రేక్షకుడి నుంచి తీసుకున్న టికెట్ అమౌంటులో 60 పర్సంటేజ్ తీసుకొని మిగతా 40 పర్సంటేజ్ డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాతకు ఇస్తారు.
Also Read: 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' రివ్యూ: 'లవ్ టుడే' హీరో మళ్ళీ వచ్చాడు... ఓరి దేవుడా అనేలా ఉందా? బావుందా?
'పుష్ప 2' సినిమాకు మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో ఆ సినిమా షోలు వేసేది లేదని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ తెగేసి చెప్పింది. పర్సంటేజ్ తగ్గించుకుని తాము సినిమాలు వేసేది లేదని 'పుష్ప 2' టైంలో ఇండస్ట్రీ అంతటికి క్లియర్ కట్ సిగ్నల్స్ పంపించింది ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యం. ఆ తరువాత తెలుగులో విడుదలైన భారీ సినిమాలు కొన్ని ఎప్పటినుంచో ప్రసాద్ మల్టీప్లెక్స్ ఫాలో అవుతున్న పర్సంటేజీ సిస్టంకు ఓకే చెబుతూ రిలీజ్ చేశాయి. ఈ రోజు మైత్రి డిస్ట్రిబ్యూట్ చేసిన 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' సినిమా షోలు ప్రసాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో పడకపోవడంతో వాళ్ళ మధ్య గొడవ సద్దుమడగలేదని కామన్ ప్రేక్షకులలో కూడా చర్చకు వస్తుండడం గమనార్హం.
Also Read: 'జాబిలమ్మ నీకు అంత కోపమా' రివ్యూ: ధనుష్ దర్శకత్వంలో యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ - హిట్టా? ఫట్టా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

