అన్వేషించండి

Poonam Pandey: పూనమ్ పాండేపై రూ.100 కోట్ల పరువునష్టం కేసు - కోర్టు మెట్లు ఎక్కాల్సిందే!

Poonam Pandey: బాలీవుడ్ నటి పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం తాను మరణించినట్టుగా ప్రకటించుకుంది. దీనివల్ల తను పలు సమస్యల్లో చిక్కుకుంటోంది.

Poonam Pandey: కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ నటి పూనమ్ పాండే చేసిన స్టంట్ దేశాన్ని షేక్ చేసింది. తాను మరణించిందంటూ స్వయంగా ప్రకటించుకొని.. రెండు రోజుల తర్వాత అదంతా సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కోసమే అంటూ బయటికొచ్చి అందరికీ షాకిచ్చింది. దీంతో ప్రేక్షకులంతా తనపై మండిపడ్డారు. అవగాహన ఇచ్చే పద్ధతి ఇది కాదంటూ ఫైర్ అయ్యారు. కేవలం ఫైర్ అవ్వడం మాత్రమే కాకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కొందరు తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చారు కూడా. ప్రస్తుతం పూనమ్‌తో పాటు తన భర్త సామ్ బాంబే కూడా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కోర్టులో హాజరు..

కాన్పూర్ పోలీస్ కమిషనర్ దగ్గర పూనమ్ పాండేపై, తన భర్త సామ్ బాంబేపై మొదటి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. వీరిద్దరిపై ఫైజన్ అన్సారీ అనే వ్యక్తి రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తన భర్త సామ్‌తో కలిసి పూనమ్ మరణించినట్టుగా ఘోరమైన అబద్ధాలు చెప్పిందని,  ఈ క్రమంలో క్యాన్సర్‌కు ఉన్న సీరియస్‌నెస్‌ను వారు హేళన చేశారని, అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఎంతోమంది ప్రేక్షకుల, అభిమానుల నమ్మకాన్ని వారు ఒమ్ము చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు ఫైజన్ అన్సారీ. కేవలం పర్సనల్‌గా ప్రమోషన్ కోసమే వారు ఈ పనిచేశారని, దీని వల్ల ప్రజలు ఎంతగానో ఆందోళన చెందారని ఎఫ్ఐఆర్‌లో చెప్పుకొచ్చారు. అంతే కాకుండా వారిని అరెస్ట్ చేయాలని, త్వరలోనే ఈ కేసు విషయంలో కాన్పూర్ కోర్టులో హాజరయ్యేలా చేయాలని అన్సారీ కోరారు.

తనతో పాటు భర్త కూడా..

పూనమ్ పాండే తన మరణం గురించి అబద్ధం చెప్పినందుకు ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఆమెను తిట్టినా.. తన భర్త సామ్ మాత్రం సపోర్ట్‌గా మాట్లాడాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉండడం లేదు. కొన్నేళ్ల క్రితమే వీరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. అయినా ఇలాంటి సమయంలో పూనమ్‌కు సపోర్ట్ చేయడానికి సామ్ ముందుకు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే పూనమ్‌తో పాటు సామ్ కూడా చట్టపరమైన చర్యలను ఎదుర్కోక తప్పడం లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పూనమ్‌పై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పుడు ఫైజన్ అన్సారీ కూడా చేరారు. కానీ ఆయన ఏకంగా రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కొందరి అభినందనలు..

క్యాన్సర్‌పై అవగాహన క్రియేట్ చేయడం కోసం మరీ ఇలా చేయాలా అంటూ పూనమ్ పాండేను, తన ఏజెన్సీను విమర్శిస్తుండగా.. దీనిపై తన ఏజెన్సీ స్పందించడానికి ముందుకొచ్చింది. ‘మేము చేసిందంతా కేవలం సర్వైకల్ క్యాన్సర్‌కు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మాత్రమే. పూనమ్ పాండే, హాటర్‌ఫ్లై కలిసి సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నప్పుడు మేము కూడా అందులో భాగమయ్యాం. ముందుగా క్యాన్సర్‌తో బాధపడినవారు, క్యాన్సర్‌ వల్ల ఇష్టమైనవారిని కోల్పోయినవారు దీని వల్ల బాధపడితే వారికి మేము క్షమాపణలు తెలియజేస్తున్నాం’ అంటూ ఏజెన్సీ ప్రకటించింది. చాలామంది పూనమ్ పాండే చేసిన పనిపై మండిపడుతున్నా.. కొందరు మాత్రం దీని వల్ల సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటో చాలామందికి తెలిసేలా చేశారని అభినందిస్తున్నారు.

Also Read: ఆ ప్రభుత్వం ఎందుకలా చేసిందో ఎవరూ అడగరు - భూకేటాయింపుపై ‘యాత్ర 2’ దర్శకుడు మహి వీ రాఘవ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget