అన్వేషించండి

Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!

వైసీపీ రాజ్యసభ ఎంపీ, వైయస్ జగన్మోహన్ రెడ్డి తరువాత ఆ పార్టీలో నెంబర్ 2గా చాలా రోజులు వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన నందమూరి కుటుంబానికి దగ్గరవుతున్నారు. 

తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి తాజా అడుగులు సంచలనం అవుతున్నాయి. వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళిన ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. త్వరలో వైసిపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ప్రస్తుతం వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్‌లో ఉన్నారు. ఆయన రాక కోసం విజయసాయి రెడ్డి వెయిట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత రాజీనామా సమర్పించనున్నారు. రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పారు. కుటుంబంతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అయితే నందమూరి కుటుంబంతో ఆయన కనిపించడం కొంత మందికి మింగుడు పడడం లేదు. 

నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి
వైసిపికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు తమ తమ అంచనాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని ఇంకొందరు జోస్యం చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఆయన రాజకీయ నాయకులు ఎవరితోనూ కనిపించడం లేదు. కానీ... నందమూరి కుటుంబానికి దగ్గరగా ఉన్నారు.

నందమూరి కుటుంబ సభ్యుడు దివంగత కథానాయకుడు, తారక రత్న భార్య అలేఖ్య తెలుసు కదా! విజయసాయి రెడ్డితో పాటు దిగిన ఫోటోను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'వీకెండ్ విత్ విఎస్ఆర్' అని పేర్కొన్నారు. అది అసలు సంగతి. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వచ్చినా రాకున్నా... ఆయన కుమార్తె మాత్రం బీజేపీలో చేసే అవకాశం ఉందట.

నందమూరి కుటుంబానికి కోడలు కాకముందు నుంచి విజయసాయి రెడ్డితో అలేఖ్యకు బంధుత్వం ఉంది. ఆమెకు ఆయన బాబాయ్ వరుస అవుతారు. తారకరత్న, అలేఖ్య వివాహానికి అప్పట్లో ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే..‌. విజయసాయి రెడ్డి తమకు మద్దతు ఇచ్చారని అలేఖ్య గతంలో తెలిపారు.

Also Read'గేమ్ చేంజర్' తీగ లాగితే... 'దేవర', 'పుష్ప 2' గుట్టు బయటకు వచ్చిందా? ఆ రెండు సినిమాలకూ లాభాలు రాలేదా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna)

తారకరత్న మరణించిన తర్వాత కార్యక్రమాల్లోనూ విజయసాయి రెడ్డి ప్రముఖంగా కనిపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఆయన సన్నిహితంగా మాట్లాడడం కెమెరాల కంట పడింది. అప్పట్లో ఆయన మీద జగన్మోహన్ రెడ్డి కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాలలో వినపడింది కూడా! అదంతా గతం... ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాలకు రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ఏ కుటుంబంతో కనిపించినా సరే ఎవరు ఏమి అనలేరు. ఆయనపై పొలిటికల్ బాస్ ఎవరూ లేరు. భవిష్యత్తులో మళ్లీ రాజకీయాలలోకి రానని విజయసాయి రెడ్డి తెలిపారు. రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు... ఆయన మళ్లీ వచ్చినా రావచ్చు.

Also Readఅల్లు అర్జున్ వస్తున్నాడు... కండిషన్స్ అప్లై... చైతూ టీమ్ అలా చేయక తప్పదు మరి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget