అన్వేషించండి

Pawan Kalyan: టాలీవుడ్ రిటర్న్ గిఫ్ట్‌కు థాంక్స్... ఇండస్ట్రీకి స్పెషల్ పాలసీ... డైరెక్ట్‌గా రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Note On Theater Strike: థియేటర్స్ బంద్ ఇష్యూలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డైరెక్ట్‌గా రంగంలో దిగినట్టు కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రెస్ రిలీజ్ వచ్చింది.

థియేటర్స్ బంద్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. తాము ఎవరి సినిమాకు వ్యతిరేకం కాదని ఎవరి సినిమాను అడ్డుకోవడం లేదని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది. అయితే తెర వెనుక జరిగిన వ్యవహారాలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనసు నోచుకునేలా చేసినట్లు ఉన్నాయి. ఫిలిం ఛాంబర్ ఇచ్చిన వివరణ పట్ల ఆయన సంతృప్తి చెందినట్లు లేరు. ఏకంగా ఆయన రంగంలోకి దిగారు. ఘాటుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేఖ విడుదల అయ్యింది.

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' జూన్ 13వ తేదీన థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్న తరుణంలో... జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారని వచ్చిన వార్తల మీద విచారణ చేయాలని హోమ్ శాఖ కార్యదర్శిని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. ఆ తర్వాత ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సమావేశం అయ్యి బంద్ చేయడం లేదని చెప్పుకొచ్చారు. కానీ, తెర వెనుక జరిగిన వ్యవహారాల పట్ల పవన్ కాస్త ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాని ఫలితమే ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన లేఖ.

పవన్ పిలిచినా రాలేదు...
ప్రభుత్వం పట్ల కృతజ్ఞత ఏది?
ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, చిత్రసీమ ప్రముఖుల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా కూటమి ప్రభుత్వం చూస్తుంటే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత టాలీవుడ్ పెద్దల నుంచి కనిపించడం లేదని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా సీఎం నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా తెలుగు సినిమా సంఘాలు కలవలేదని స్పష్టం చేసింది.

Also Read: 'ఆ నలుగురు' ఎవరు? అగ్ర నిర్మాతలేనా? ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారా?? వాళ్ళ చేతుల్లో ఏముంది??

తమ సినిమాలు విడుదల అయ్యే సమయంలో టికెట్ రేట్స్ పెంపు కోసం ఆయా నిర్మాతలు వచ్చినప్పుడు... అందరూ కలసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన సూచన పట్ల సానుకూలంగా స్పందించలేదని స్పష్టం చేసింది డిప్యూటీ సీఎం కార్యాలయం. 

జగన్ ప్రభుత్వంలో ఛీత్కారాలు మరిచారా?
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు టికెట్ రేట్స్ పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం హీరోలతో పాటు దర్శక నిర్మాతలు వెళ్లారు. చిరంజీవి చేతులు జోడించి అడిగిన విజువల్స్ వైరల్ అయ్యాయి. వాటిని ప్రస్తావించింది ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం. 

''గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్ల పాల్జేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లు ఉన్నాయి. టాలీవుడ్ పెద్దల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పాయి. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చని వ్యక్తుల సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను (వకీల్ సాబ్ విడుదలప్పుడు జరిగింది) థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? ఎన్నికలకు ముందు చెప్పినట్టు వ్యక్తులను చూసి కూటమి ప్రభుత్వం పని చేయలేదు. నాగార్జున ఫ్యామిలీ మూవీ (తండేల్) వచ్చినప్పుడు టికెట్ రేట్స్ పెంచింది'' అని పేర్కొంది. 

రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాం...
సినిమా రంగానికి ప్రత్యేక పాలసీ!
టాలీవుడ్ నిర్మాతలు అడిగినట్టు టికెట్ రేట్స్ పెంచుతూ... అడిగినన్ని షోలకు అనుమతులు ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి అభ్యంతరాలు పెట్టకుండా ముందుకు వెళుతుంటే... ఆయన సినిమా విడుదల సమయంలో అడ్డంకులు సృష్టించడం పట్ల ఘాటుగా స్పందించారు. టాలీవుడ్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరించినట్టు తెలిపారు. అలాగే, థాంక్స్ చెప్పారు. 

ఇప్పటినుంచి వ్యక్తిగత హోదాలో వచ్చే టాలీవుడ్ నిర్మాతలను కలిసేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎటువంటి చర్చలకు తావు లేదని స్పష్టం చేశారు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని వివరించారు. సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక పాలసీ తీసుకు రావాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు. థియేటర్ల ఆదాయం, వాటి వసతుల మీద నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు.

Also Read: టాలీవుడ్ 'కింగ్‌ పిన్‌'కు పవన్ కళ్యాణ్ చెక్‌మేట్... చిన్న గూగ్లీకి హడల్... దెబ్బకు సెట్టయ్యారా?

''ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు పెడుతున్న టికెట్ రేటు, అందుకు పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి? వంటి అంశాలను సంబంధిత అధికారులతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్చించారు'' అని ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. థియేటర్లు లీజుకు తీసుకున్న వ్యక్తుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా? లేదా? టికెట్ రేట్స్ పెంచినప్పుడు అందుకు తగ్గట్టుగా పన్ను కట్టారా? లేదా? అనేది చూడమని ఆదేశించారు. పార్కింగ్ ఫీజ్ నుంచి పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ వరకు ఎక్కువ రేటుకు అమ్మడం పట్ల అధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు. 

సినిమా హాళ్ల వరకూ ఉండే విభాగాలలో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తే పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా పవన్ కల్యాణ్ ఆలోచన చేశారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. దాంతో గుత్తాధిపత్యానికి చెక్ పెడుతున్నట్టు అయ్యింది. 

Also Readమెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్న దిల్ రాజు?  తెర వెనక కుట్రలా... ఇండస్ట్రీలో ఏం జరుగుతోందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget