అన్వేషించండి

Balakrishna : వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను - పద్మభూషణ్ పురస్కారంపై బాలకృష్ణ రియాక్షన్ ఇదీ

Balakrishna : పద్మభూషణ్ పురస్కారం ప్రకటించినందుకు నందమూరి బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు.

Balakrishna : గణతంత్ర దినోత్సవాన్ని(Republic Day) పురస్కరించుకుని కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా సినీ రంగానికి చేసిన విశేష సేవలకు గానూ తెలుగు హీరో, నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. అవార్డు ప్రకటించిన సందర్భంగా స్పందించిన బాలకృష్ణ.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో శుభాకాంక్షలు తెలియజేసిన, చేస్తోన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

"నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిందుకు భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తోన్న నా అభిమానులకు, నాపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తోన్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను" అని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తన తోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు అందిస్తున్నానన్నారు.

బాలకృష్ణకు చంద్రబాబు అభినందనలు
 
బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో ఆయన కుటుంబ సభ్యులూ 'ఎక్స్' వేదికగా పోస్టులు చేశారు. అభినందనలు తెలుపుతూ తమ ప్రేమను చాటుకున్నారు. "పద్మభూషణ్ అవార్డు అందుకున్న సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ, సినిమా, రాజకీయాలు, దాతృత్వ రంగాలలో రాణిస్తూ.. ప్రజా సంక్షేమానికి, ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీరు చేసిన అంకితభావం లెక్కలేనన్ని జీవితాలను నిలిపింది. ఇది లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. నిజమైన ఐకాన్.. ఇది ఆయనకు తగిన గౌరవం" అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు.

"బాలా బాబాయ్ కి హృదయపూర్వక అభినందనలు. సినిమా రంగానికి మీరు చేసిన అసమాన సేవలకు, నిర్విరామ ప్రజా సేవకు ఇది గుర్తింపు" అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

"పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన నా ప్రియమైన మిత్రుడు నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు" అంటూ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. వీరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బాలకృష్ణను అవార్డు వరించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read : Republic Day 2025: ఢిల్లీలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు - జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh New districts :  ఏపీలో మూడు కొత్త జిల్లాలు - రెవిన్యూ డివిజన్లు, మండలాలు కూడా - ఇవిగో పూర్తి వివరాలు
ఏపీలో మూడు కొత్త జిల్లాలు - రెవిన్యూ డివిజన్లు, మండలాలు కూడా - ఇవిగో పూర్తి వివరాలు
Asaduddin Owaisi:  మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్‌తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్‌తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Advertisement

వీడియోలు

Tamilnadu Deputy CM Udhayanidhi Stalin Full Speech | ABP Southern Rising Summit 2025 లో ఉదయనిధి స్టాలిన్ పూర్తి ప్రసంగం | ABP Desam
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Speech | ABP Southern Rising Summit 2025 లో తమిళనాడు గవర్నర్ పై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్  | ABP Desam
ABP Director Dhruba Mukherjee Speech | ABP Southern Rising Summit 2025 లో ప్రారంభోపన్యాసం చేసిన ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ | ABP Desam
ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh New districts :  ఏపీలో మూడు కొత్త జిల్లాలు - రెవిన్యూ డివిజన్లు, మండలాలు కూడా - ఇవిగో పూర్తి వివరాలు
ఏపీలో మూడు కొత్త జిల్లాలు - రెవిన్యూ డివిజన్లు, మండలాలు కూడా - ఇవిగో పూర్తి వివరాలు
Asaduddin Owaisi:  మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్‌తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్‌తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
నెలకు 1000 km డ్రైవ్‌ చేసే సీనియర్‌ సిటిజన్లకు రూ.15 లక్షల్లో పర్‌ఫెక్ట్‌ ఆటోమేటిక్‌ కార్‌ - దీనిని మిస్‌ అవ్వొద్దు!
సీనియర్‌ సిటిజన్లు ఈజీగా హ్యాండిల్‌ చేయగల సేఫ్‌, ఆటోమేటిక్‌ కార్‌ - రూ.15 లక్షల బడ్జెట్‌లో
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
Embed widget