అన్వేషించండి

Maharshi Raghava: 100వ సారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ - ఘనంగా సత్కరించిన చిరంజీవి

Maharshi Raghava: మ‌హ‌ర్షి రాఘ‌వ‌ స‌మాజానికి త‌న వంతుగా ఏదో చేయాల‌నే ఉద్దేశంతో ఏకంగా వంద‌సార్లు ర‌క్త‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న్ను మెగాస్టార్ అభినందించారు. ప్ర‌త్యేకంగా స‌న్మానం చేశారు.

Megastar Chiranjeevi felicitated Actor Maharshi Raghava: ర‌క్తం అంద‌క నిత్యం ఎంతోమంది మ‌ర‌ణించిన రోజులు చూశాం. అయితే, అలాంటి రోజులు రాకూడ‌ద‌ని, ర‌క్తం లేక ఎవ్వ‌రూ ప్రాణాలు కోల్పోవ‌ద్ద‌నే ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ బ్యాంక్ ని స్థాపించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. త‌ను సేవ చేస్తూ ఎంతోమంది అభిమానుల‌తో సేవ చేయిస్తున్నారు. అలా స్ఫూర్తి పొందిన వారిలో ఒక‌రు యాక్ట‌ర్ మ‌హ‌ర్షి రాఘ‌వ‌. చిరంజీవి ఐ బ్యాంక్ బ్ల‌డ్ బ్యాంక్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 100 సార్లు రక్త‌దానం చేశారు ఆయ‌న‌. స‌మాజానికి త‌న వంతుగా ఏదో చేయాల‌నే ఉద్దేశంతో ర‌క్త‌దానం చేశారు. దీంతో చిరంజీవి స్వ‌యంగా త‌న ఇంటికి పిలిపించుకుని ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా స‌న్మానం చేశారు, రాఘవని అభినందించారు. 

1998 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు.. 

చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ 1998 అక్టోబ‌ర్ 2న ప్రారంభించారు. కాగా.. ఆ రోజు మొద‌ట ర‌క్తదానం చేసిన వ్య‌క్తి ముర‌ళీ మోహ‌న్ కాగా.. ఆయ‌న త‌ర్వాత చేసిన వ్య‌క్తి మ‌హ‌ర్షి రాఘ‌వ‌. ఇక అప్ప‌టి నుంచి ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి క‌చ్చితంగా రాఘ‌వ చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో ర‌క్తం ఇస్తూ వ‌చ్చారు. అలా ఇప్ప‌టి వ‌ర‌కు 100 సార్లు ర‌క్తం ఇచ్చారు. ఆ విష‌యం తెలుసుకున్న చిరంజీవి.. వందోసారి ర‌క్త‌దానం చేసే స‌మ‌యంలో త‌ను ద‌గ్గ‌రుండి డొనేట్ చేయిస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అది కుద‌ర‌లేదు. దీంతో ఇప్పుడు మ‌హ‌ర్షి రాఘ‌వ‌ను ఇంటికి పిలిపించుకుని ప్ర‌త్యేకంగా సన్మానం చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హ‌ర్షి రాఘ‌వ‌ను మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా అభినందించారు. మూడు నెల‌ల‌కు ఓ సారి 100 సార్లు ర‌క్త‌దానం చేయ‌టం గొప్ప‌విష‌య‌మ‌ని ఇలా ర‌క్త‌దానం చేసిన వ్య‌క్తుల్లో మ‌హ‌ర్షి రాఘ‌వ మొద‌టివాడ‌ని చిరంజీవి అభినందించారు. ఆయ‌న్ను అంద‌రూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. 
 
ఇక రాఘ‌వ‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శిల్ప కూడా చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా శిల్పతో 'ఆప‌ద్భాంవుడు' సినిమా విశేషాలు గుర్తు చేసుకుని, సినిమా గురించి మాట్లాడారు చిరంజీవి. మ‌హ‌ర్షి రాఘ‌వ‌తో పాటు.. ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం చేసిన ముర‌ళీ మోహ‌న్‌ను కూడా క‌లిశారు. ఇక‌ చిరంజీవి బ్లడ్ బ్యాంకు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీస‌ర్ శేఖ‌ర్‌, చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ బ్యాంకు సీఓఓ ర‌మ‌ణ‌స్వామి నాయుడు, మెడిక‌ల్ ఆపీస‌ర్ డాక్ట‌ర్ అనూషగారి ఆధ్వ‌ర్యంలో మ‌హ‌ర్షి రాఘ‌వ 100వ సారి ర‌క్త‌దానం చేశారు. 

Also Read: ఓరి నాయనో.. రక్తపు మడుగులో పసివాడు, భార్యను కిడ్నాప్ చేసే భర్త - ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్ మూవీ ఇది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget