దిల్ రాజు, దర్శకుడు శంకర్పై మండిపడుతోన్న మెగా అభిమానులు - కారణం ఇదే
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఆలస్యం అవుతుండడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజులపై నెగెటివ్ కామెంట్లతో విమర్శిస్తూ... సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Mega Fans Serious on Game Changer Team : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో అత్యంత ఆలస్యం అయిన ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా షూటింగ్ దాదాపు 2 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. కానీ ఇండియన్ 2 సినిమా రాబోతుండడంతో ఆ మూవీ షూటింగ్ కాస్త ఆలస్యమై ప్రస్తుతం చాలా స్లోగా సాగిపోవడం రామ్ చరణ్ అభిమానులకు నిరాశ కలిగించే అంశంగా మారింది. ఆ నిరుత్సాహం వారిని ఎంతగానో ఆగ్రహానికి గురి చేస్తోంది. దీంతో ఆ చిత్ర దర్శకనిర్మాతలపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
'గేమ్ ఛేంజర్' సినిమా ప్రొసీడింగ్స్ జరుగుతున్న తీరుపై మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 2 సంవత్సరాల క్రితమే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమాకు సంబంధించి ఇంకా టీజర్ గానీ, గ్లింప్స్ గానీ.. ఏదీ కూడా విడుదల కాలేదు. ఈ చిత్రం 2024 వేసవిలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది కాస్తా వాయిదా పడింది. ఇది మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.
ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్.. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్పై కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిద్దరిపై సోషల్ మీడియాలో నెగెటివ్ హ్యాష్ట్యాగ్లతో ట్రెండ్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తూ విమర్శలకు పాల్పడుతున్నారు. గేమ్ ఛేంజర్ టీమ్ని సినిమాకు సంబంధించి ఏదో ఒక లేటెస్ట్ అప్డేట్ను విడుదల చేయమని బలవంతం చేస్తున్నారు. శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తోన్న 'భారతీయుడు 2' చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమా నిర్మాణం రెండు నెలల క్రితమే వాయిదా పడింది. ఈ క్రమంలో మూవీపై ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని నిందిస్తూ మెగా అభిమానులు పలు కామెంట్లు చేస్తున్నారు. #UselessDilRajuShamelessSVC, #WakeUpShankarSir అనే హ్యాష్ ట్యాగ్ లతో విమర్శిస్తున్నారు.
'గేమ్ ఛేంజర్' సినిమాలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, SJ సూర్య, నవీన్ చంద్ర, ఇతరులు కూడా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ .. SVC పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ శంకర్ చిత్రానికి బాంబ్ జ్యూక్బాక్స్ ఇస్తున్నారు. ఎస్ థమన్, కార్తీక్ సుబ్బరాజు రాసిన కథను సాయి మాధవ్ బుర్రా తన కలంతో బ్యాకప్ చేశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ తిరు, రత్నవేలు. అంతే కాదు దిల్ రాజు నిర్మించే గేమ్ ఛేంజర్ సినిమా ఆయన 50వ చిత్రం కావడం చెప్పుకోదగిన విషయం.
టాలీవుడ్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్గా గుర్తింపు పొందిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే తల్లిదండ్రులయ్యారు. ఈ నెల 20న ఉపాసన ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా కుటుంబం, ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. దీని కంటే ముందే రామ్ చరణ్ తాను షూటింగ్ కు మూడు నెలల పాటు విరామం ప్రకటించారు. గత నెల క్రితం నుంచే షూటింగ్ లకు దూరంగా ఉన్న రామ్ చరణ్... ఆగష్టు నెలలో 'గేమ్ ఛేంజర్' చిత్రీకరణలో పాల్గొననున్నట్టు సమాచారం.
Read Also : KP Chowdary Drug Case: దయచేసి ఆరోపణలు చేయడం ఆపేయండి, కేపీ చౌదరి డ్రగ్స్ కేసుతో సంబంధం లేదు - సురేఖా వాణి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















