అన్వేషించండి

Jeevitha Rajasekhar: నేను తప్పు చేయలేదు, అరెస్ట్ కాలేదు, ఎక్కడికీ పారిపోలేదు - నగరి కేసుపై జీవితా రాజశేఖర్ స్పందన

జీవితా రాజశేఖర్ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని, ఆమె తమకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని, తమకు 20 కోట్లు ఇవ్వాలని జీస్టర్ గ్రూప్ హేమ, కోటేశ్వర్ రాజు చేసిన ఆరోపణలపై జీవిత స్పందించారు. 

జీవితా రాజశేఖర్ దంపతులను నమ్మి తాము రూ. 26 కోట్లు మోసపోయామని, వారితో ఎవరూ సినిమాలు తీయడానికి ముందుకు రాని సమయంలో రూ. 26 కోట్లు ఖర్చు పెట్టి 'గరుడవేగ' తీశామని, తమ దగ్గర ఆస్తులు తాకట్టు పెట్టి వాటిని వేరే వాళ్లకు అమ్మారని జీస్టర్ గ్రూప్ ఫౌండర్ కోటేశ్వర్ రాజు, ఛైర్మన్ హేమ ఆరోపించిన సంగతి తెలిసిందే. శనివారం హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేసిన 'శేఖర్' సినిమా  విలేఖరుల సమావేశంలో ఆ ఆరోపణలపై జీవితా రాజశేఖర్ స్పందించారు.

"నగరిలో కేసు జరుగుతున్న మాట వాస్తవమే. వారెంట్ వచ్చిన మాట నిజమే. అయితే, నేను అరెస్ట్ కాలేదు. అది ఎందుకు వచ్చింది? ఓ కారణం ఉంటుంది. కేసు విషయమై కోర్టు సమన్లు జారీ చేసినప్పుడు మేం కొవిడ్ తో ఇబ్బంది పడుతున్నాం.  మాకు సమన్లు అందకుండా చేశారు. విషయం తెలిశాక, మా న్యాయవాదిని పంపించాం. ఆ కేసు జరుగుతోంది. తీర్పు వచ్చినప్పుడు మాకు తెలుస్తుంది" అని జీవితా రాజశేఖర్ తెలిపారు.

జీస్టర్ గ్రూప్ తరపున కోటేశ్వర్ రాజు సినిమా నిర్మిస్తే... హేమ ఎందుకు వచ్చారు? ఆయనపై హైదరాబాద్ లో ఏం కేసు ఉంది? ఆయన వల్ల మా మేనేజర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది కోర్టులో బయటకు వస్తాయని జీవిత తెలిపారు. నగరి కోర్టులో వారెంట్ జారీ అయ్యి రెండు నెలలు అయ్యిందన్నారు. ఇప్పుడు హేమ, కోటేశ్వర్ రాజు ఎందుకు బయటకొచ్చారో తెలియదన్నారు. తనను డీమోరలైజ్, డీఫేమ్ చేయడం ఎవరి తరమూ కాదన్నారు.

"తప్పు చేసిన రోజు ఒప్పుకొనే ధైర్యం ఉంది. చేయని రోజున భగవంతుడి ముందు నిలబడి మాట్లాడే ధైర్యమూ నాకు ఉంది. వాళ్ళు మాట్లాడిన దాంట్లో నిజం ఉండి ఉంటే... కోర్టులో తీర్పు వస్తుంది కదా! అప్పుడు మాట్లాడతా" అని జీవితా రాజశేఖర్ తెలిపారు. తమపై ఆరోపణలు చేసినవాళ్ళు మహాత్ములు కాదని ఆమె అన్నారు. ఆల్రెడీ ఒకసారి కేసు ఓడిపోయారని, వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రూవ్ అవుతుందని జీవిత పేర్కొన్నారు. తాను జైలుకు వెళ్లలేదని తెలిపారు.

Also Read: 'శేఖర్' విడుదల తేదీ ఖరారు, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందంటే?

కొన్ని యూట్యూబ్ చాన్నాళ్లు పెట్టిన థంబ్‌నైల్స్‌పై జీవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. సరిగా రాయమని ఆమె సున్నితంగా చెప్పారు. కేసు కోర్టులో ఉంది కనుక ఇంత కంటే  ఎక్కువ మాట్లాడలేనని జీవితా రాజశేఖర్ తెలిపారు.      

Also Read: సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Biker Trailer : రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
Mrunal Thakur : చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
Niharika Konidela : హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
Anchor Suma : సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget