అన్వేషించండి

ఇండ్రస్ట్రీలోని డైరెక్టర్లు నన్ను మిస్ గైడ్ చేసి వాడుకున్నారు: పాయల్ రాజ్ పుత్

టాలీవుడ్ హీరోయిన్, RX100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు సంచలన నిజాలను బయటపెట్టింది.

సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు పదుల సంఖ్యలో సినిమాలు చేసినా రాని పేరు కొందరికి మాత్రం ఒకే ఒక సినిమాతో వస్తుంది. అంటే ఓకే సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవడం అన్నమాట. అలా ఒకే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో పాయల్ రాజ్ పుత్ కూడా ఒకరు. ఈ హీరోయిన్ 'ఆర్ఎక్స్ 100' అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. మొదటి సినిమాలోనే నటనతో పాటు తన అందాన్ని ఓ రేంజ్ లో ఆరబోయడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. దీంతో పాయల్ రాజ్ పుత్ వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ అవకాశాలు ఏమి పాయల్ కి గుర్తింపును తేలేకపోయాయి.

కథల ఎంపికలో చేసిన తప్పు వల్లనో, లేక సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్లనో.. పాయల్ స్టార్ స్టేటస్ ను అందుకోలేకపోయింది. అయితే తాజాగా 'మాయాపేటిక', 'మంగళవారం' అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ హాట్ హీరోయిన్. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ పలు సంచలన నిజాలు బయటపెట్టింది. ఏకంగా తనను ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్లు వాడుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది. 'మాయా పేటిక' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. "తన తొలి సినిమా తర్వాత హైదరాబాదులో ఒంటరిగా ఉండేదాన్ని. ఈ క్రమంలోనే కొంతమంది దర్శకులు తనని మిస్ గైడ్  చేశారు’’ అని చెప్పుకొచ్చింది.

"నేను ఏ సినిమాకైనా వందకి రెండు వందల శాతం ఎఫర్ట్స్ పెడతాను. కానీ ఆ సినిమాలు వర్కౌట్ అవడం, కాకపోవడం నా చేతుల్లో లేదు అంటూ చెప్పుకొచ్చింది". తన తొలి సినిమా తర్వాత కొంతమంది దర్శకులు మిస్ గైడ్ చేయడం వల్లే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, మరికొందరు తనని అడ్వాంటేజ్ గా తీసుకోగా.. ఆ విషయాన్ని తాను గుర్తించినట్లు చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్లాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న విషయాల్లో తనకి పూర్తి మెచ్యూరిటీ వచ్చిందని తెలిపింది. దీంతో ప్రస్తుతం పాయల్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా ప్రస్తుతం తనకు తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి తోనే మరో సినిమా చేస్తుంది పాయల్.

'మంగళవారం' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ టైటిల్ రోల్ పోషిస్తుంది. దర్శకుడు అజయ్ భూపతి లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ గా దీన్ని రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. కాగా అజయ్ భూపతి గత చిత్రం 'మహాసముద్రం' భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. శర్వానంద్, సిద్ధార్థ కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో లాంగ్ గ్యాప్ తర్వాత 'మంగళవారం' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు అజయ్ భూపతి. మరి ఈ సినిమాతో నైనా ఈ దర్శకుడు సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

Also Read : ఓ మై గాడ్, తమన్నాను మించిపోయిన శోభిత - ‘ది నైట్ మేనేజర్-2’లో ఆ లవ్ సీన్ వైరల్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget