అన్వేషించండి

Eekta Kapoor : ఏక్తా కపూర్​కి ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్ - తొలి భారతీయురాలిగా గుర్తింపు!

Ektaa Kapoor : బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కి అరుదైన గౌరవం దక్కింది 51 వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుకలో ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డు ఆమెను వరించింది.

Ektaa Kapoor : బాలీవుడ్ దర్శక నిర్మాత ఏక్తా కపూర్(Ektaa Kapoor) అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఇంటర్నేషనల్ ఎమ్మి అవార్డ్స్(International Emmy Awards) వేడుకలో ఏక్తా కపూర్ కి అరుదైన ఘనత దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కి ఆర్ట్స్ అండ్ టీవీ ఇండస్ట్రీలో చేసిన కృషికి గాను న్యూయార్క్ లో 2023 నవంబర్ 20 న 51వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు వేడుకలో ఇంటర్నేషనల్ ఎమీ డైరెక్టరేట్(International Emmy Directorate Awar) అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా దర్శకురాలిగా ఏక్తాకపూర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఇక ఈ ఎమ్మీ అవార్డును ఫేమస్ రైటర్ దీపక్ చోప్రా చేతుల మీదుగా అందుకుంటూ..' ఈ గర్వించదగ్గ ఎమ్మీ అవార్డు ఇండియా కోసం' అంటూ ఎంతో ఎమోషనల్ అయింది. తనకు గుర్తింపు దక్కడం పై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.." నా హృదయంలో ఈ అవార్డుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ గుర్తింపు నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. పర్సనల్ అండ్ వర్క్ లైఫ్ లో ఇది ఎంతో కీలకమైన అంశం. ఈ వేదిక పై నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంతో పాటు గౌరవంగానూ ఉంది" అంటూ తెలిపింది ఏక్తాకపూర్. టెలివిజన్ పరిశ్రమలో మార్కెట్ లీడర్ షిప్ తో పాటు భారతదేశపు అగ్రశ్రేణి ఎంటర్టైన్మెంట్ షోస్ ని నిర్మిస్తూ వస్తున్న ఏక్తా కపూర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో ఇండియా వైడ్ గా ఎంతోమంది ఆడియన్స్ ని సొంతం చేసుకుంది.

ఇక టెలివిజన్ రంగంలో ఎంతో ఫేమస్ అయిన ఈ అవార్డును ఏకంగా ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు. అలాంటి ఈ గొప్ప అవార్డు ఏక్తా కపూర్ కి దక్కడం పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఏక్తా కపూర్ విషయానికొస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేందర్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి టెలివిజన్ ప్రొడ్యూసర్ గా, మూవీ ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన తండ్రి స్థాపించిన 'బాలాజీ టెలిఫిలిమ్స్ లిమిటెడ్' కంపెనీలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, క్రియేటివ్ హెడ్ గా పని చేసిన ఏక్తా కపూర్ ప్రస్తుతం ఈ కంపెనీ బాధ్యతలను స్వయంగా తానే చూసుకుంటుంది.

అదే కంపెనీకి అనుబంధంగా 'బాలాజీ మోషన్ పిక్చర్స్'(Balaji Motion Pictures) అనే ప్రొడక్షన్ హౌస్ ని 2001లో లాంచ్ చేసింది. ఈ ప్రొడక్షన్ హౌస్ పై కొన్ని విజయవంతమైన చిత్రాలను సైతం నిర్మించింది. 2017లో 'ఆల్ట్ బాలాజీ'(Alt Balaji) పేరుతో ఓటీపీని లాంచ్ చేసింది. ఇక 2020లో ఆర్ట్స్ ఫీల్డ్ లో చేస్తున్న కృషికి గాను పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకుంది. అలా టెలివిజన్, ఫిలిం రంగాల్లో మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్న ఏక్తా కపూర్ కి ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు దక్కడం విశేషం.

Also Read ; 'గుంటూరు కారం' సెకండ్ సింగిల్ పై నాగవంశీ అదిరిపోయే అప్డేట్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vikas Khanna (@vikaskhannagroup)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget