Euphoria OTT : థియేటర్లలోనే ఎంజాయ్ చేయండి - 'యుఫోరియా' ఓటీటీ రిలీజ్పై గుణశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్
Euphoria Review : యుఫోరియా మూవీ ఓటీటీలో చూడాల్సిన సినిమా కాదని... థియేటర్లలోనే ఎంజాయ్ చేయాలని డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు. తాజా ప్రెస్ మీట్లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Director Gunasekhar About Euphoria Movie OTT Deal : చాలా రోజుల గ్యాప్ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ యూత్ ఫుల్ సోషల్ డ్రామా 'యుఫోరియా'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ప్రెస్ మీట్లో గుణశేఖర్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
'యుఫోరియా' ఓటీటీపై...
'యుఫోరియా' మూవీ ఇప్పట్లో ఓటీటీలో రాదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు గుణశేఖర్. 'ఈ మూవీ కేవలం థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ అందరినీ గౌరవించి తీసిన సినిమా. సినిమా ఇప్పట్లో ఓటీటీలో రాదు. కేవలం థియేటర్లలోనే ఎంజాయ్ చేయండి. తప్పకుండా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. స్టోరీలో పిల్లలు, పేరెంట్స్ కలిసి చూడకూడని కొన్ని హార్డ్ హిట్టింగ్ సీన్స్ ఉన్నాయి. అయితే, పిల్లలు చూడాలి, పేరెంట్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా.
వారు విడివిడిగా చూస్తే ప్రాబ్లమ్ లేదు. అందుకే A సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది పేరెంట్స్, పిల్లలు కలిసి చూడలేకపోయినా ఎవరికి వారే చూడాల్సిన సినిమా. కొందరు డైరెక్టర్స్, సెలబ్రిటీలు సినిమా చూసి భయం వేస్తుందని అంటున్నారు. మన ఇంట్లో ఇలా జరుగుతుందా అని అడిగారు?. ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్నే మూవీలో రిఫ్లెక్ట్ చేసినట్లుగా ఉందన్నారు.' అని చెప్పారు.
Also Read : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్పై కేసు - బూతు పాట కాంట్రవర్సీపై వార్నింగ్... జర్నలిస్ట్ కంప్లైంట్తో...
'ఒళ్లు దగ్గర పెట్టుకుని తీశా'
ఈ సినిమాకు సారా అర్జున్ ఆత్మ అని ప్రశంసించారు గుణశేఖర్. 'ఆ క్యారెక్టర్కు సార్ అర్జున్ అయితేనే పర్ఫెక్ట్ అనిపించింది. మూవీ చూసిన తర్వాత అందరికీ అర్థమవుతుంది. ఆమె అద్భుతంగా నటించారు. ఈ కథకు భూమిక వెన్నెముక. 1992లో నా సినిమా జర్నీ మొదలైంది. యుఫోరియా నా 14వ సినిమా. కానీ నా ఫస్ట్ మూవీకి ఎంత కష్టపడ్డానో ఈ సినిమాకు కూడా అంతే కష్టపడ్డాను. ఓ కొత్త కథను కొత్తగా చెప్పాలని శాయశక్తులా ప్రయత్నించాను. ఎమోషనల్ స్టోరీ అందరికీ కనెక్ట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నా.
నేను ఎప్పుడూ ప్రేక్షకులనే నమ్ముతా. వాళ్ల డబ్బుకి, టైంకు, విజ్ఞతకు వాల్యూ ఇస్తాను. ఈ మూడు దృష్టిలో పెట్టుకుని ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ యుఫోరియా మూవీ తీశాను. కచ్చితంగా వారి ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అవుతుంది' అని చెప్పారు.
'శాకుంతలం' తర్వాత...
గుణశేఖర్ లాస్ట్గా శాకుంతలం సినిమా తీశారు. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్తో యుఫోరియాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మూవీలో భూమిక, సారా అర్జున్లతో పాటు నాజర్, రోహిత్, గౌతమ్ మీనన్, లిఖిత యలమంచిలి, పృథ్వీరాజ్, సాయి శ్రీనిక రెడ్డి, కల్పలత, విఘ్నేష్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. గుణశేఖర్ హోమ్ బ్యానర్ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించారు. కాలభైరవ మ్యూజిక్ అందించారు.
























