అన్వేషించండి

ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు 

ఒడిశా రైలు ప్రమాదం టాలీవుడ్ సినీ తారలు సైతం స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్లు చేశారు

Odisha Train Accident : ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రాత్రి సుమారు 7 గంటల సమయంలో పట్టాలపై ఉన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 260మందికి పైగా చనిపోగా, 900మందికి పైగా గాయపడ్డారు. భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే. కాగా ఈ ఘటనపై దేశం నలుమూలల్లో ఉన్న అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు గాయుడిన వారికి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, నటీనటులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్లు చేశారు.

ఈ విషాద సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇతర దేశాలను నేతలను, ప్రముఖులను కూడా కదిలించాయి. పలువురు సౌత్ ప్రముఖులు ట్విట్టర్‌లోకి వెళ్లి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతులకు సంతాపం తెలియజేసి నివాళులర్పించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ నటులు సంతాపం వ్యక్తం చేశారు.

"ఒరిస్సాలో జరిగిన విషాద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం, భారీ ప్రాణనష్టం నన్ను చాలా దిగ్ర్భాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాల గురించే చింతగా ఉంది. ప్రస్తుతం క్షతగాత్రుల ప్రాణాలు కాపాడడానికి రక్తం ఎంతో అవసరం. కాబట్టి పరిసర ప్రాంతాల్లోని అభిమానులంతా దయచేసి రక్తదానానికి ముందుకు రావాలని కోరుతున్నా"నని మెగాస్టార్ చిరంజీవి కోరారు.

"రైలు ప్రమాద ఘటనతో నా హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా"నంటూ నటి రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు,

"ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలిన ప్రార్థిస్తున్నాను" అని ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

"కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు  హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్ట కాలంలో బాధితులు, వారి కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా"నని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

రైలు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూసి షాక్ అయ్యానని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఈ కష్టకాలంలో ఉన్న కుటుంబాలు, వారి ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక కన్నడ నటుడు యశ్ కూడా విచారం వ్యక్తం చేస్తూ ట్విట్ చేశారు. ఒడిశా రైలు దుర్ఘటన ఎంత హృదయ విదారకంగా ఉందో మాటల్లో చెప్పడం కష్టమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, రెస్క్యూ ఆపరేషన్లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన వారికి కృతజ్ఞతలు" అని ఆయన రాసుకొచ్చారు. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ కథానాయిక ఈషా రెబ్బా, హిందీ హీరోయిన్ కాజోల్ తదితరులు తమ హృదయం ముక్కలైందని, ఈ విషాదం తమ మనసులను కలచి వేసిందని పేర్కొన్నారు.   

Read Also : Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Embed widget