Chiranjeevi : చిరంజీవి దగ్గరకు థియేటర్స్ ఇష్యూ… మెగా మీటింగ్, పెద్ది గురించి దిల్ రాజు ఏమన్నారంటే?
Chiranjeevi Reaction : థియేటర్స్ పర్సంటేజీ అంశం మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. ఎగ్జిబిటర్స్, నిర్మాతల వెర్షన్ విన్న చిరు... కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

Chiranjeevi Reaction On Exhibitors Distributors Producers Issue : సింగిల్ స్క్రీన్స్కు పర్సంటేజీ విధానం అమలు చేయాలంటూ ఎగ్జిబిటర్స్ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ది రిలీజ్ ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సంక్షోభంపై తెలంగాణ ఫిలిం చాంబర్ ఎగ్జిబిటర్లు.... ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో పాటు నిర్మాతలు కేఎల్ నారాయణ, సురేశ్ బాబు, అల్లు అరవింద్ తదితరులు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
చిరు ఏమన్నారంటే?
చిరంజీవితో దాదాపు గంటకు పైగా ఎగ్జిబిటర్స్, నిర్మాతలు ఈ అంశంపై చర్చించారు. తమ సమస్యలను ఎగ్జిబిటర్స్ ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇండస్ట్రీలో భాగంగా ఉన్న వారందరికీ పూర్తి న్యాయం జరిగేలా ఉండాలని... ఇది ఒక్క పెద్ది సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో చర్చ కాదని అన్నారు. 'పర్సంటేజీ విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఏదో ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలి. రాబోయే చిత్రాలకు ఇబ్బంది లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి.' అని అన్నట్లు తెలుస్తోంది.
'అది కరెక్ట్ కాదు'
అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే పరిశ్రమ కొన్ని పద్ధతులు ఏర్పరుచుకుందని... ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉండడం అందరికీ సముచితమని అన్నారు చిరు. 'పర్సంటేజ్ మోడల్పై ఓ కమిటీ ఏర్పాటు చేస్తూ ఛాంబర్ ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ... మీడియా ముందు ఏ ఒక్కరూ అభిప్రాయాలు వ్యక్తపరచడం తగదు. ఇలాంటి వాటి వల్ల ఇండస్ట్రీ ఒక్కటిగా లేదన్న సందేశం ఇవ్వకూడదు.
ఇంతకు ముందు వేరే కమిటీల పని తీరు, నిర్ణయాల పట్ల సింగిల్ స్క్రీన్స్ సభ్యుల్లో కొంత అసంతృప్తి ఉందన్న విషయం అర్థమైంది. ఈసారి ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ జూన్ 30 వరకూ అన్నీ విషయాలు పూర్తిగా పరిశీలించి... ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ న్యాయం జరిగేలా ప్రతిపాదన చేస్తుందనే నమ్మకం ఉంది. ఆ కమిటీ సకాలంలో తన బాధ్యతలు పూర్తి చేసి నివేదిక ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తా.' అంటూ హామీ ఇచ్చారు చిరు.
Also Read : మళ్లీ ఛాన్స్ ఇస్తే నటిస్తా - చిరు ఆపద్బాంధవుడు ఫేం మీనాక్షి శేషాద్రి... 30 ఏళ్ల తర్వాత
రెండు రోజుల్లో...
రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని TFDC ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. 'పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్స్ అన్నీ విషయాలు చిరంజీవి గారికి వివరించారు. వారం కిందట ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి మరిన్ని వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తానని చెప్పారు. రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ విషయాలను ఛాంబర్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది.' అని అన్నారు.
ఈ మీటింగ్లో TFCC ప్రెసిడెంట్ శ్రీ సురేష్ బాబు, అల్లు అరవింద్, TFDC ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు, కేఎల్ నారాయణ, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శేఖర్, అనుపమ్, శ్రీధర్, సదానంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : రియల్ ఒకే ఒక్కడు సీఎం విజయ్ - పొలిటికల్ ఎంట్రీపై హీరో అర్జున్ రియాక్షన్
Before You Go
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్గ్రౌండ్ తెలుసా?
ట్రెండింగ్ వార్తలు























