అన్వేషించండి

విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ సంచలన నిర్ణయం? - ఇక నుంచి కొత్త పద్ధతిలో సెన్సార్ ప్రక్రియ!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ పై కోలీవుడ్ హీరో విశాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సెన్సార్ బోర్డు తాజాగా స్పందించింది.

కోలీవుడ్ అగ్ర హీరో విశాల్ ఇటీవల స్సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్' (CBFC) ముంబై కార్యాలయంలో అవినీతి జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి అందరికీ తెలిసేలా ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా విశాల్ ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ స్పందించింది. ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. అనంతరం దీనిపై స్పందిస్తూ.. విశాల్ నుంచి లంచం డిమాండ్ చేసింది సెన్సార్ సభ్యులు కాదని, థర్డ్ పార్టీ వారని తెలిపింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇప్పటినుంచి ఆన్లైన్లోనే సినిమాల సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది." CBFC ప్రతి సంవత్సరం 12 వేల నుంచి 18 వేల చిత్రాలకు సర్టిఫికెట్ ఇస్తుంది. ఇన్ని సినిమాలు చూడాలంటే సభ్యులకు సమయం పడుతుంది. కొందరు నిర్మాతలు తమ సినిమాలకు అత్యవసరంగా సర్టిఫికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంటారు" అని ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు గుర్తు చేసింది.  ఇలాంటి పరిణామాలు రిపీట్ కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లోనే సినిమాల సెన్సార్‌ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఈ - సినీప్రమాన్‌ను తీసుకొచ్చిన సెన్సార్ బోర్డు.. దీన్ని వేదికగా దర్శక, నిర్మాతలు తమ సినిమాలకు సెన్సార్ చేసుకోవాలని సూచించింది.

CBFC పై విశాల్ చేసిన ఆరోపణలు ఏంటంటే?

తన 'మార్క్ ఆంటోనీ' సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో లంచం ఇవ్వాల్సి వచ్చిందని కొద్ది రోజుల క్రితం విశాల్ ట్విట్టర్ వేదిక వెల్లడించారు. 'మార్క్ ఆంటోనీ' సెన్సార్ కోసం దాదాపు 6.5 లక్షలు లంచం చెల్లించాలని విశాల్ పేర్కొన్నాడు." అవినీతి గురించి వెండితెరపై చూడడం బానే ఉంటుంది కానీ నిజ జీవితంలో జరగడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నా. ముంబై సెన్సార్ ఆఫీస్ లో ఇదే జరుగుతోంది. నా మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ కకోసం రూ.6.5 లక్షలు లంచం గా ఇచ్చాను. స్క్రీనింగ్ కోసం రూ.3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం మూడు లక్షలు ఇచ్చాను. నా కెరీర్ లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. మరో దారి లేక డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతకు ఇలా జరగకూడదు. న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా" అంటూ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే దృష్టికి తీసుకెళ్తానని చెబుతూ ఈ మేరకు ఆ ఇద్దరి ట్విట్టర్(ఎక్స్) ఖాతాలను ట్యాగ్ చేశారు. దాంతోపాటు తాను ఎవరెవరికి డబ్బులు పంపించారో వారి పేరు బ్యాంకు ఖాతా వివరాలను సైతం పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సెన్సార్ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించి ఇక నుంచి ఆన్ లైన్ లోనే సినిమాల సెన్సార్ ప్రక్రియను పూర్తి చేయబోతున్నట్లు నిర్ణయం తీసుకుంది.

విశాల్ 'మార్క్ ఆంటోనీ' విషయానికొస్తే..

అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రంలో ఎస్ జె సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలు పోషించగా రీతూ వర్మ కథానాయికగా నటించింది. విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుని తమిళంలో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. మినీ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందించారు.

Also Read : త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget