అన్వేషించండి

ఈ రంగంలో ఎవరూ పైకి కనిపించినంత జాలీగా ఉండరని అతని ఆత్మహత్యతో తెలిసింది: అవసరాల శ్రీనివాస్

దర్శకుడు, సినీ రచయిత అవసరాల శ్రీనివాస్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమెడియన్ విజయ్ సాయి మరణం పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన 'అష్టాచమ్మా' సినిమాతో తెలుగు వెండితెరకు నటుడిగా పరిచయమయ్యాడు అవసరాల శ్రీనివాస్. సినిమాపై ఉన్న ఆసక్తితో అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి మరీ ఇండస్ట్రీకి వచ్చాడు. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ తర్వాత నటుడిగా మారాడు. అక్కడితో ఆగకుండా హీరోగా, దర్శకుడిగా, రచయితగా ఇలా తన మల్టీ టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక 'ఊహలు గుసగుసలాడే' అనే సినిమాతో దర్శకుడిగా మారి మొదటి విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగానే కాదు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషించాడు. ఇక ఆ తర్వాత కమెడియన్ గా కూడా మెప్పించాడు. ముఖ్యంగా 'అమితుమీ' అనే సినిమాలో అవసరాల శ్రీనివాస్ కామెడీ టైమింగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా 'ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి' అనే సినిమాకి దర్శకత్వం వహించగా.. ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని కనబరిచింది.

యంగ్ హీరో నాగ శౌర్య, మాళవిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కమర్షియల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషించాడు అవసరాల శ్రీనివాస్. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు అవసరాల శ్రీనివాస్. తనకు స్టార్ బిరుదులు, అవార్డులు అసలు నచ్చవని, తాను తెరకెక్కించిన సినిమాని ఆడియో ని చూసి అది వాళ్లకు నచ్చితే అదే తనకు సంతోషమని చెప్పాడు. అంతేకాదు తనకు సక్సెస్ అంటే తన సినిమాని జనాలు చూసి హ్యాపీగా ఫీల్ అయితే అదే సక్సెస్ గా భావిస్తానని చెప్పాడు. నాకు మంచి నటుడిగా రచయితగా దర్శకుడిగా పేరు పొందాలని ఉంది. కానీ స్టార్ గా పేరు రావాలనేది తాను ఎప్పుడు కోరుకొనని.. అది తనకు అసలు నచ్చదని చెప్పాడు. ఇక ఈ క్రమంలోనే తన తోటి నటుడు విజయ్ సాయి మరణం పై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయ్ సాయి తెలుగులో ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అవసరాల శ్రీనివాస్ తో కలిసి 'వరప్రసాద్ పొట్టి ప్రసాద్' అనే సినిమా చేశాడు విజయ్. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో 2017 డిసెంబర్ 11న విజయ్ సాయి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్ సాయి మరణం గురించి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "విజయ్ సాయి సూసైడ్ చేసుకున్నప్పుడు నేను ఇండస్ట్రీకి చాలా కొత్త. అప్పటికి నేను రెండే సినిమాలు చేశాను. విజయ్ గురించి నాకు అప్పటికి పూర్తిగా తెలియదు. కానీ ఏవో అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లున్నాయి. సూసైడ్ చేసుకున్న సమయంలో నాతో ఉన్న విజయ్ నేను న్యూస్ లో చూసిన విజయ్ ఒకరేనా అని అనిపించింది. నాకేం అర్థం కాలేదు. విజయ్ ఎప్పుడూ నేను ఇది ఎలాగైనా చేస్తాను, ఎలాగోలా మేనేజ్ చేస్తాను, ఇది అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెబుతుండేవాడు. చాలా ఇన్ కంట్రోల్ గా ఉండేవాడు. అతని లైఫ్ అతని కంట్రోల్లో ఉండేది కాదు. కానీ విజయ్ సూసైడ్ న్యూస్ విని నేను షాక్ అయ్యా. అంతేకాదు ఆ ఘటనతో నేను చాలా నేర్చుకున్నా. సినిమా రంగంలో కొంతమంది పైకి కనిపించినంత జాలీగా, సంతోషంగా ఉండరని.. వాటి వెనక ఎంతో స్ట్రగుల్స్ ఉంటాయని అప్పుడు నాకు అనిపించింది" అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: ఆ కారణంతోనే రమేష్ బాబు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు: కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget