అన్వేషించండి

Bigg Boss Telugu 7: అశ్వినితో ప్రశాంత్ బూతులు - సీరియస్ అయిన నాగార్జున

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో వీకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. అందులో ముందుగా ప్రశాంత్‌పై సీరియస్ అయ్యారు నాగార్జున.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్.. గతవారం చేసిన తప్పులను గుర్తుచేసి వారిని మందలించడానికి నాగార్జున మళ్లీ సిద్ధమయ్యారు. వీకెండ్ ఎపిసోడ్‌కు సంబంధించిన మొదటి ప్రోమో తాజాగా విడుదలయ్యింది. గతవారమంతా కంటెస్టెంట్స్ ఎక్కువగా మర్డర్ టాస్క్‌లోనే బిజీగా ఉన్నారు. ఈ టాస్క్‌లో ఎవరికి కుదిరినంత ఫన్‌ను వారు క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. ఇక ఈ టాస్క్ అయిపోయిన వెంటనే కెప్టెన్సీ టాస్క్ మొదలయ్యింది. కెప్టెన్సీ టాస్క్ గురించి, అమర్‌దీప్‌కు జరిగిన అన్యాయం గురించి నాగార్జున మాట్లాడతారేమో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మొదటి ప్రోమోలో దాని గురించి ప్రస్తావన తీసుకురాలేదు నాగ్.

మాట్లాడు ప్రశాంత్..
ముందుగా ఈ ప్రోమోలో పల్లవి ప్రశాంత్‌తో మాట్లాడడం మొదలుపెట్టారు నాగార్జున. ‘‘మర్డర్ అయిపోయావు. దెయ్యం అయిపోయావు. దెయ్యం అయిపోయాక ఈ బూతులు ఎంటి?’’ అని ప్రశాంత్‌ను అడిగారు. దానికి ప్రశాంత్‌కు ఏమీ అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోయాడు. ‘‘మాట్లాడు ప్రశాంత్. నామినేషన్స్‌లో మాట్లాడతావు ఇలా’’ అని ప్రశాంత్ మ్యానరిజంను ఇమిటేట్ చేసి చూపించారు నాగ్. అప్పటికీ ప్రశాంత్‌కు ఏమీ అర్థం కాకపోవడంతో అశ్విని, గౌతమ్‌లను లేపారు. అప్పుడు ప్రశాంత్‌కు తను చేసిన తప్పేంటో అర్థమయ్యింది. ‘‘నేను కావాలని అనలేదు సార్. తప్పైతే సారీ కూడా చెప్పాను’’ అని ప్రశాంత్ చెప్తుండగానే.. ‘‘ఎవరూ కావాలని అనరు. ఫన్నీగా అంటే అన్నీ చెల్లుతాయి. కానీ అశ్వినికి ప్రాబ్లమ్ వచ్చింది. అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది’’ అని హెచ్చరించారు నాగ్.

శివాజీ బాటలో ప్రశాంత్..
అసలు ప్రశాంత్ ఏం చేశాడు, నాగార్జున ఎందుకు అన్నారు అని ప్రోమో చూసిన కొందరు ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు. మర్డర్ టాస్క్ జరుగుతున్న సమయంలో ముందుగా పల్లవి ప్రశాంత్ చనిపోయి దెయ్యంగా మారాడు. ఆ తర్వాత అశ్విని చనిపోయింది. అశ్విని తర్వాత గౌతమ్ చనిపోయి దెయ్యాలుగా మారారు. వారికి ఇంక టాస్క్‌లో ఆడే అవకాశం లేదు కాబట్టి గౌతమ్, అశ్విని కూడా ఫన్నీగా దెయ్యాలుగా యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో అశ్విని.. గౌతమ్‌ను టచ్ చేసింది. అది చూసిన ప్రశాంత్.. అశ్వినిని కామపిశాచి అన్నాడు. అది అశ్వినికి నచ్చలేదు. గౌతమ్ కూడా అలా అనకుండా ఉండాల్సిందని ప్రశాంత్‌కు నచ్చజెప్పాడు. దీంతో ప్రశాంత్ అప్పుడే సారీ చెప్పినా.. తను అన్న మాటకు మాత్రం అశ్విని హర్ట్ అయ్యింది. ఇక బూతుల విషయంలో నాగార్జున సైతం వచ్చి చర్చించారు కాబట్టి తన గురువు శివాజీలాగానే ప్రశాంత్ కూడా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడా అని కొందరు ప్రేక్షకులు అనుకుంటున్నారు.

అప్పుడే బలయిపోతాం..
పల్లవి ప్రశాంత్‌తో మాట్లాడడం పూర్తయిన తర్వాత అశ్వినితో మాట్లాడారు నాగార్జున. ముందుగా ‘‘ఈవారం సింగిల్ ఎలిమినేషనా? డబుల్ ఎలిమినేషనా?’’ అని అడిగారు. డబుల్ అని సమాధానమిచ్చింది అశ్విని. ‘‘డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా నువ్వు సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటావా?’’ అని ప్రశ్నించగా అశ్వినికి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా నిలబడింది. ‘‘కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?’’ అని నాగ్ అడిగినప్పుడు కూడా సైలెంట్‌గానే నిలబడింది. ‘‘మనం చేసే పొరపాట్ల వల్లే మనం బలయిపోతాం’’ అనగానే అశ్విని ఏడుపు మొహం పెట్టింది.

Also Read: రంగులు మారుస్తున్న శివాజీ, అమర్‌ ఎమోషన్స్‌తో ఆటలు - ఇప్పుడు ఆ కంటెస్టెంటే నెంబర్ వన్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడుగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Nirmal Road Accident: బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
బంధువులను పరామర్శించి వస్తుంటే రోడ్డు ప్రమాదం, నలుగురి మృతి- నిర్మల్‌ జిల్లాలో ఘటన
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
Embed widget