Allu Arjun: 'అల్లూరి' కోసం అల్లు అర్జున్ - ఇక 'తగ్గేదేలే' అంటోన్న హీరో!
'అల్లూరి' సినిమా ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నారు.

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ సినిమా 'అల్లూరి' (Alluri). నిజాయితీకి మారు పేరు... అనేది ఉపశీర్షిక. ఇదొక ఫిక్షనల్ పోలీస్ ఆఫీసర్ బయోపిక్. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.
అయితే ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విషయాన్ని శ్రీ విష్ణు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అల్లూరి కోసం అల్లు అర్జున్ అంటూ ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ఈ మధ్యకాలంలో బన్నీ చాలా సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్తూ.. తన సపోర్ట్ అందిస్తున్నారు. ఇప్పుడు శ్రీ విష్ణుని ఎంకరేజ్ చేయడానికి గెస్ట్ గా వెళ్లబోతున్నారు.
అల్లు అర్జున్ గెస్ట్ అంటే.. ఇక ఆ ఈవెంట్ మొత్తం ఫ్యాన్స్ తో నిండిపోవడం ఖాయం. సెప్టెంబర్ 18న ఈ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకుడు. ఈ సినిమాలో నిజాయతీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజు పాత్రలో శ్రీ విష్ణు కనిపించనున్నారు.
శ్రీ విష్ణు సరసన కయ్యదు లోహర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సుమన్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృథ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, 'వెన్నెల' రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రాజ్ తోట, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, కళ : విఠల్, ఫైట్స్ : రామ్ క్రిషన్, సాహిత్యం : రాంబాబు గోసాల, సమర్పణ : బెక్కెం బబిత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : నాగార్జున వడ్డే, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ ('ఫిదా' ఫేమ్).
#AAforAlluri ❤️
— Sree Vishnu (@sreevishnuoffl) September 16, 2022
My dearest bunny garu aka our very own ICON 🌟@alluarjun will be gracing the #ALLURI Pre-Release Event on Sep 18th!
Ika manam #ThaggedeLe 🤙🏾#AlluriOnSept23rd pic.twitter.com/l7Dp5eE0y3
ఇక బన్నీ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'పుష్ప2' సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు.
'పుష్ప' సినిమాకి క్రేజీ డీల్:
'పుష్ప' పార్ట్ 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి కొన్ని సంస్థలు. 'పుష్ప'తో డీల్ క్లోజ్ చేయాలని చూస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ.100 కోట్ల ఆఫర్ చేసిందట ఓ సంస్థ. మైత్రి మూవీస్ బ్యానర్ ఈ డీల్ పై ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. బన్నీ మాత్రం వద్దని చెప్పారట. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత బిజినెస్ ఇంకా బాగా జరుగుతుందని.. కాబట్టి అప్పటివరకు ఎలాంటి డీల్స్ ఓకే చేయొద్దని చెప్పారట. దీంతో ప్రస్తుతానికి ఈ క్రేజీ డీల్ ను పక్కన పెట్టేశారు. 'పుష్ప' పార్ట్ 1 సమయంలో మాత్రం డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను ముందే అమ్మేశారు. ఈసారి మాత్రం అలా చేయడం లేదు.
Before You Go
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్గ్రౌండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















