అన్వేషించండి

Elections 2024: నాల్గో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల- ఏపీ, తెలంగాణలో ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ

Elections 2024: 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు నాల్గో దశ నోటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది.నామినేషన్ల స్వీకరణ 25 వరకు జరగనుంది.

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు మరో దశకు చేరుకున్నాయి. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రచారం పీక్‌లో ఉంది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్న వేళ రాజకీయం మరింత హాట్‌ హాట్‌గా మారుబోతంది.

ఆంధ్రప్రదేశ్‌ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ జారీ కానుంది. ఇవాళ మంచి రోజు కావడంతో చాలా మంది అభ్యర్థులు గురువారం నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. నామినేషన్లు స్వీకరణకు జిల్లా యంత్రాంగం సంసిద్ధమైంది. వారితో బుధవారం ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా సమావేశం నిర్వహించారు. ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వారం పాటు అంట్ 25వ తేదీ వరకు కొనసాగనుంది. 

25వ తేదీ వరకు స్వీకరించిన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. 26 వరకు వాటిని స్క్రూట్నీ చేస్తారు. ఇంతలో ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే ఏప్రిల్‌ 29 వరకు గడువు విధించారు. ఆలోపు నామినేషన్లు వెనక్కి తీసుకోవచ్చు. అనంతరం ఫైనల్‌గా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారుల ప్రకటిస్తారు. వారి మధ్య మే 13నపోలింగ్ నిర్వహించారు. జూన్‌ 4న ఫలితాలు ప్రకటిస్తారు. 

లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు పాతిక వేలు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి 10 వేల రూపాయల డిపాజిట్‌ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో సగం చెల్లిస్తే సరిపోతుంది. లోక్‌సభ అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్‌లో, అసెంబ్లీ అభఅయర్థులు నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో నామినేష పత్రాలు అధికారులకు అందిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు, హడావిడి లేకుండా అభ్యర్థులు రావాల్సి ఉంటుంది. అన్నింటినీ అధికారులు రికార్డు చేయనున్నారు. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు వేయొచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థి ఫాం 2బీ, లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి ఫాం2 ఏ సమర్పించాలి. ఇవి నామినేషన్ గడువు తీరేలోపు ఎప్పుడైనా సమర్పించవచ్చు. నామినేషన్ రోజే ఇవ్వాలే రూల్ లేదు. 

అఫిడవిట్ తప్పనిసరి 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా తమతోపాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందజేయాలి. దీన్ని ఫాం 26 స్టాంప్‌ పేపర్‌తో కలిపి ఇవ్వాలి. ఇది పది రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగి ఉండాలి. తప్పనిసరి పరిస్థితిలో ఈ స్టాంప్‌ పేపర్‌ కూడా వాడుకోవచ్చు. ఈ ఫాంలో ఆస్తులు, అప్పులతోపాటు కేసుల వివరాలు ప్రకటించాలి. ఇది నామినేషన్ వేసిన రోజే ఇవ్వాలనే రూల్‌ లేదు. నామినేషన్ స్వీకరణ గడువు ముగిసేలోపు ఎప్పుడైనా ఇవ్వొచ్చు. 

బీఫాం ఇవ్వాలి 
ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు ప్రతి అభ్యర్థికి బీఫాం ఇస్తాయి. తమ పార్టీ తరఫున ఆ వ్యక్తే అభ్యర్థిగా ధ్రువీకరిస్తూ ఇచ్చే పత్రం ఇది. నామినేషన్ టైంలో ఆయా అభ్యర్థుల పార్టీ గుర్తును కూడా నామినేషన్లో పొందుపరచాలి. స్వతంత్ర అభ్యర్థులైతే ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్‌లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు 
నేరుగా నామినేషన్ ఇవ్వలేని పరిస్థితిలో అభ్యర్థులు సువిధ యాప్‌ ద్వారా నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. అయితే వాటిని తర్వాత ఆర్వోకు స్వయంగా అభఅయర్థి వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గడువు లోపు జరగాలి. లేకుంటే ఆ నామినేషన్‌ను ప్రతిపాదనకు తీసుకోరు. నేరుగా నామినేషన్లు మాత్రం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే తీసుకుంటారు. సెలవు రోజుల్లో నామినేష్లను స్వీకరించరు. 

ఓటరు ప్రతిపాదన తప్పనిసరి 
ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలంటే ఆ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు ప్రపోజ్‌ చేయాలి. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి అయితే ఒక ఓటర్లు ప్రతిపాదిస్తే సరిపోతుంది. అలా ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. స్వతంత్రంగా పోటీ చేసే వాళ్లకు మాత్రం 10 మంది ఓటర్లు సంతకాలు చేయాలి. ఒక అభ్యర్థికి సపోర్ట్ చేసిన వ్యక్తి మరొక అభ్యర్థికి సపోర్ట్ చేయకూడదనే రూల్‌ ఏమీ లేదు. ఒక ఓటర్లు ఎంత మంది అభ్యర్థులకైనా ప్రపోజ్ చేయవచ్చు. 

నామినేషన్ పత్రాలు సమర్పించే సయమంలో కూడా రూల్స్ పాటించాలి. లేకుంటే కేసులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. నామినేషన్ దాఖలు చేసే ఆఫీస్‌కు అంటే... ఆర్వో ఆఫీస్‌కు 100 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేయాలి. ఆర్వో గదిలోకి కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతి ఇస్తారు. 

ఖర్చు లెక్కింపు మొదలు 
ఎన్నికల కోసం అభ్యర్థులు పెట్టే ఖర్చు నేటి నుంచి మొదలు కానుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దీన్ని లెక్కిస్తారు. దీని కోసం నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు అకౌంట్‌ తెరవాల్సి ఉంటుంది. దీని ఆధారంగా అధికారులు అభ్యర్థి ఖర్చును లెక్కిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షల  వరకు, ఎంపీ అభ్యర్థి 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకునే వీలుంది. 

టాప్ హెడ్ లైన్స్

Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి

వీడియోలు

Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget