అన్వేషించండి

Elections 2024: నాల్గో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల- ఏపీ, తెలంగాణలో ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ

Elections 2024: 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు నాల్గో దశ నోటిఫికేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది.నామినేషన్ల స్వీకరణ 25 వరకు జరగనుంది.

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు మరో దశకు చేరుకున్నాయి. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ప్రచారం పీక్‌లో ఉంది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతున్న వేళ రాజకీయం మరింత హాట్‌ హాట్‌గా మారుబోతంది.

ఆంధ్రప్రదేశ్‌ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ జారీ కానుంది. ఇవాళ మంచి రోజు కావడంతో చాలా మంది అభ్యర్థులు గురువారం నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. నామినేషన్లు స్వీకరణకు జిల్లా యంత్రాంగం సంసిద్ధమైంది. వారితో బుధవారం ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా సమావేశం నిర్వహించారు. ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వారం పాటు అంట్ 25వ తేదీ వరకు కొనసాగనుంది. 

25వ తేదీ వరకు స్వీకరించిన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు. 26 వరకు వాటిని స్క్రూట్నీ చేస్తారు. ఇంతలో ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే ఏప్రిల్‌ 29 వరకు గడువు విధించారు. ఆలోపు నామినేషన్లు వెనక్కి తీసుకోవచ్చు. అనంతరం ఫైనల్‌గా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారుల ప్రకటిస్తారు. వారి మధ్య మే 13నపోలింగ్ నిర్వహించారు. జూన్‌ 4న ఫలితాలు ప్రకటిస్తారు. 

లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు పాతిక వేలు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి 10 వేల రూపాయల డిపాజిట్‌ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో సగం చెల్లిస్తే సరిపోతుంది. లోక్‌సభ అభ్యర్థులు జిల్లా కలెక్టరేట్‌లో, అసెంబ్లీ అభఅయర్థులు నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో నామినేష పత్రాలు అధికారులకు అందిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు, హడావిడి లేకుండా అభ్యర్థులు రావాల్సి ఉంటుంది. అన్నింటినీ అధికారులు రికార్డు చేయనున్నారు. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు వేయొచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థి ఫాం 2బీ, లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి ఫాం2 ఏ సమర్పించాలి. ఇవి నామినేషన్ గడువు తీరేలోపు ఎప్పుడైనా సమర్పించవచ్చు. నామినేషన్ రోజే ఇవ్వాలే రూల్ లేదు. 

అఫిడవిట్ తప్పనిసరి 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా తమతోపాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందజేయాలి. దీన్ని ఫాం 26 స్టాంప్‌ పేపర్‌తో కలిపి ఇవ్వాలి. ఇది పది రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగి ఉండాలి. తప్పనిసరి పరిస్థితిలో ఈ స్టాంప్‌ పేపర్‌ కూడా వాడుకోవచ్చు. ఈ ఫాంలో ఆస్తులు, అప్పులతోపాటు కేసుల వివరాలు ప్రకటించాలి. ఇది నామినేషన్ వేసిన రోజే ఇవ్వాలనే రూల్‌ లేదు. నామినేషన్ స్వీకరణ గడువు ముగిసేలోపు ఎప్పుడైనా ఇవ్వొచ్చు. 

బీఫాం ఇవ్వాలి 
ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు ప్రతి అభ్యర్థికి బీఫాం ఇస్తాయి. తమ పార్టీ తరఫున ఆ వ్యక్తే అభ్యర్థిగా ధ్రువీకరిస్తూ ఇచ్చే పత్రం ఇది. నామినేషన్ టైంలో ఆయా అభ్యర్థుల పార్టీ గుర్తును కూడా నామినేషన్లో పొందుపరచాలి. స్వతంత్ర అభ్యర్థులైతే ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్‌లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు 
నేరుగా నామినేషన్ ఇవ్వలేని పరిస్థితిలో అభ్యర్థులు సువిధ యాప్‌ ద్వారా నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. అయితే వాటిని తర్వాత ఆర్వోకు స్వయంగా అభఅయర్థి వెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గడువు లోపు జరగాలి. లేకుంటే ఆ నామినేషన్‌ను ప్రతిపాదనకు తీసుకోరు. నేరుగా నామినేషన్లు మాత్రం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే తీసుకుంటారు. సెలవు రోజుల్లో నామినేష్లను స్వీకరించరు. 

ఓటరు ప్రతిపాదన తప్పనిసరి 
ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలంటే ఆ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు ప్రపోజ్‌ చేయాలి. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థికి అయితే ఒక ఓటర్లు ప్రతిపాదిస్తే సరిపోతుంది. అలా ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. స్వతంత్రంగా పోటీ చేసే వాళ్లకు మాత్రం 10 మంది ఓటర్లు సంతకాలు చేయాలి. ఒక అభ్యర్థికి సపోర్ట్ చేసిన వ్యక్తి మరొక అభ్యర్థికి సపోర్ట్ చేయకూడదనే రూల్‌ ఏమీ లేదు. ఒక ఓటర్లు ఎంత మంది అభ్యర్థులకైనా ప్రపోజ్ చేయవచ్చు. 

నామినేషన్ పత్రాలు సమర్పించే సయమంలో కూడా రూల్స్ పాటించాలి. లేకుంటే కేసులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. నామినేషన్ దాఖలు చేసే ఆఫీస్‌కు అంటే... ఆర్వో ఆఫీస్‌కు 100 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేయాలి. ఆర్వో గదిలోకి కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతి ఇస్తారు. 

ఖర్చు లెక్కింపు మొదలు 
ఎన్నికల కోసం అభ్యర్థులు పెట్టే ఖర్చు నేటి నుంచి మొదలు కానుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దీన్ని లెక్కిస్తారు. దీని కోసం నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు అకౌంట్‌ తెరవాల్సి ఉంటుంది. దీని ఆధారంగా అధికారులు అభ్యర్థి ఖర్చును లెక్కిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షల  వరకు, ఎంపీ అభ్యర్థి 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకునే వీలుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
BRS Silent On Pawan Kalyan:సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
BRS Silent On Pawan Kalyan:సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Peddi Vs Bollywood Movie: పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగులు పడతాయని వార్నింగ్
తెలంగాణలో పలు జిల్లాల్లో 2 రోజులపాటు వర్షాలు, ఏపీలో రెడ్ అలర్ట్.. పిడుగుల వార్నింగ్
Best Playing 11 Of IPL : అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
అశ్విన్స్ ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్ లో కెప్టెన్ ఎవరో తెలుసా?: రోహిత్, కోహ్లీలకు నో ఛాన్స్.. నెట్టింట వైరల్ అవుతున్న హాట్ లైనప్
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
భూమిలో దాచిన నిధుల దగ్గర పాములు ఎందుకు కనిపిస్తాయి, అవి నిజంగా వాటిని కాపలా కాస్తాయా?
Embed widget