అన్వేషించండి

AP Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం

Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో అనుకున్నట్టుగానే పల్నాడు సహా పలు ప్రాంతాల్లో పోలింగ్ హింసాత్మకంగా మారింది. పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్, దొంగ ఓట్లు కలకలం రేపుతున్నాయి.

Andhra Pradesh Election Polling Updates: అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలింగ్ సందర్భంగా వైసీపీ, టీడీపీ శ్రేణులు కొట్టుకున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. దాచేపల్లిలోని కేసనపల్లి గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకు వెళ్లే విషయంలో వైసిపి టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో టిడిపి, వైసీపీ నేతలు గాయపడ్డారు. 

రెంటచింతలలో టీడీపీ, వైసీపీ ఘర్షణ 
రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ వివాదంలో ముగ్గురు టీడీపీ ఏజెంట్లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. 

పల్నాడు జిల్లా రెంటచింతలలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. దీనిపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే అదనపు బలగాలు తరలించాలని ఆదేశించింది. 

కడప జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కమలాపురం కోగట్టంలోనూ ఇరు పార్టీల ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మైదుకూరులో టీడీపీ పోలింగ్ ఏజెంట్‌ను వైసీపీ నేతలు చితక్కొటారు. 

అన్నమయ్య జిల్లా, కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం, పాపక్క గారి పల్లెలో టిడిపి ఏజెంట్లపైన వైసిపి నాయకులు దాడి చేశారు. ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామ ప్రజలు తెలిపారు. సుభాష్ రెడ్డి అనే నాయకుడిని ఊరి బయట కొట్టి పడేశారు. సుమారు నాలుగు గంటల తర్వాత అతని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలతో చేరుకున్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద డిఎస్పి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, ఓటింగ్ ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు. 
జగన్మాత చర్చి వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. వాళ్లంతా వైసీపీ తరఫున ఓటు వేసేందుకు వచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఐదుగుర్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. 

పోలింగ్ ఏజెంట్‌ను కిడ్నాప్ కలకలం 
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం బూరుగుమందలో 188,189,190 పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్లను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఉదయం పోలింగ్ కేంద్రాలకు వస్తున్న వారిని అటకాయించి కొట్టి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు దీనిపై జిల్లా కలెక్టర్‌కు నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు, ఏజెంట్ లు పీలేరులో లభ్యమైనట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రకటన విడుదల చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అన్ని పార్టీల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించినట్లు వెల్లడించారు. దీనిపై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి పనులకు తెగబడుతున్నారని ఆరోపించారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget