అన్వేషించండి

Telangana Lok Sabha Elections 2024: తెలంగాణలో ముగిసిన పోలింగ్ - ప్రశాంతంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ

Telangana Lok Sabha Election 2024 Voting Live Updates: తెలంగాణలో లోక్ సభ సమరానికి సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.

LIVE

Key Events
Telangana Lok Sabha Elections 2024: తెలంగాణలో ముగిసిన పోలింగ్ - ప్రశాంతంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ

Background

Telangana Lok Sabha Election 2024 Phase 4 polling Live: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. 17 లోక్ సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభం అవుతుంది. అనంతరం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ సాగనుంది. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తారు.

రాష్ట్రంలో 17 స్థానాల్లో మొత్తం 625 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 3.31 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ భద్రత కోసం 73 వేల మందికి పైగా పోలీస్ బలగాలను మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఫోర్సెస్ తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 7 వేల మంది ఇతర రాష్టాల హోంగార్డులతోనూ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

అక్కడ సాయంత్రం 4 వరకే పోలింగ్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంటారు. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ లో హైఅలర్ట్ ప్రకటించారు. పోలింగ్ కు 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని.. సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని.. ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. 

ఇదీ ముఖచిత్రం

  • తెలంగాణలో మొత్తం ఓటర్లు - 3,32,32,318
  • పురుష ఓటర్లు - 1,65,28,366
  • మహిళా ఓటర్లు - 1,67,01,192
  • ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది - 2,94,000
  • భద్రతా విధుల్లో 160 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, 73 వేల మందికి పైగా రాష్ట్ర పోలీసులు
  • మొత్తం బ్యాలెట్ యూనిట్స్ - 1,05,019

బరిలో ప్రముఖులు

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (కరీంనగర్), మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), కాంగ్రెస్ నేత దానం నాగేందర్ (సికింద్రాబాద్), ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి (చేవెళ్ల), మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (నాగర్ కర్నూల్), నామా నాగేశ్వరరావు (ఖమ్మం) వంటి ప్రముఖులు బరిలో నిలిచారు. 

18:07 PM (IST)  •  13 May 2024

తెలంగాణలో ముగిసిన పోలింగ్ - ప్రశాంతంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ

తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల్లోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అనుమతిస్తున్నారు.

17:54 PM (IST)  •  13 May 2024

కంటోన్మెంట్ లో 47.88 శాతం - హైదరాబాద్ లో 39 శాతం పోలింగ్ నమోదు

తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం ఓటింగ్ నమోదు కాగా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో సాయంత్రం 5 గంటల వరకూ 47.88 శాతం నమోదైంది. హైదరాబాద్ లో 39 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సాయంత్రం 5 గంటల వరకూ 53.15 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది.

17:45 PM (IST)  •  13 May 2024

కార్యకర్తలపై ఎస్సై దాడి - చర్యలు తీసుకోవాలని ఆందోళన

కామారెడ్డి జిల్లా దోమకొండ ముత్యంపేటలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై నిలబడ్డ తమపై ఎస్సై దాడి చేశారని.. నిరసిస్తూ పోలింగ్ బూత్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

17:42 PM (IST)  •  13 May 2024

ఓటు వేస్తూ సెల్ఫీ - ఓటరుపై కేసు నమోదు

జగిత్యాల జిల్లాలో ఓ ఓటరు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో జయరాజ్ అనే వ్యక్తి ఓటు వేస్తూ సెల్ఫీ తీశారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సదరు ఓటరుపై కేసు నమోదు చేశారు.

17:38 PM (IST)  •  13 May 2024

తెలంగాణలో చివరి దశకు పోలింగ్ - సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం ఓటింగ్

తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుండగా.. ఓటింగ్ చివరి దశకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Virat Kohli: అనుష్క!  నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
అనుష్క! నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Sonarika Bhadoria : దేవకన్యలా ఉన్న స్మాల్ స్క్రీన్ పార్వతి  సోనారికా భడోరియా - మళ్లీ టాలీవుడ్ కి ఎప్పుడొస్తుందో!
దేవకన్యలా ఉన్న స్మాల్ స్క్రీన్ పార్వతి సోనారికా భడోరియా - మళ్లీ టాలీవుడ్ కి ఎప్పుడొస్తుందో!
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
Embed widget