అన్వేషించండి

Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదల! 11 వరకు నామినేషన్లు స్వీకరణ

Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ విడుదలైంది. 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23న పోలింగ్ జరగనుంది.

Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మొదటి విడతకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక ప్రకటన చేశారు. మొదటి దశలో 292 జడ్పీటీసీ, 2, 963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న వాటిని పరిశీలిస్తారు. 15 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. నవంబర్‌ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.  

బీసీ రిజర్వేషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ఎన్నికల సంఘం తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు కోర్టు అంగీకరించకపోవడంతో అధికారులు కూడా ధైర్యంగా ముందడుగు వేశారు. అందుకే ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. తర్వాత గ్రామపంచాయితీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు దశల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్‌లో భాగంగానే ఇవాళ( గురువారం) అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్‌లు వివరాలను వెల్లడించారు. రెండో విడత నోటిఫికేషన్ 13వే తేదీన విడుదల చేస్తారు.  

ఇప్పుడు నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు అక్టోబర్ 11 ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. నామినేషన్ వేసేటప్పుడు ప్రతి అభ్యర్థి తమ పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, క్రైమ్ హిస్టరీ అన్నింటినీ పొందుపరచాలని పేర్కొన్నారు. వివరాలు సరిగా లేకుండే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని హెచ్చరించారు. వచ్చిన నామినేషన్లను 12న పరిశీలిస్తారు. అదే రోజు ఇచ్చిన వివరాల ప్రకరం ఎవరెవరు పోటీకి అర్హులో కూడా వెల్లడిస్తారు. వారిలో పోటీ నుంచి తప్పుకోవాలంటే గడవు 15వ తేదీ వరకు ఉంటుంది. అనంతరం తుది జాబితా బహిర్గతం చేస్తారు. పోటీలో ఉన్న వాళ్లకు ఈ నెల 23న పోలింగ్ ఉంటుంది. రెండో విడత పోలింగ్ కూడా అక్కడికి ఐదు రోజుల తర్వాత ఉండే అవకాశం ఉంది. ఈ ఫలితాలను నవంబ్‌ 11న విడుదల చేస్తారు. 

అభ్యర్థులు ఫారం-4లో ఉన్న మోడల్‌లోనే నామినేషన్లు దాఖు చేయాలి. జిల్లాలో ఓటు హక్కు కలిగిన వాళ్లు మాత్రమే పోటీ చేసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. పోటీ చేసే వ్యక్తితోపాటు మద్దతుగా నామినేషన్లు సంతకం చేసే వాళ్లికి కూడా స్థానికంగా ఓటు హక్కు ఉండాలి. అధికారులు పేర్కొన్న ఆఫీస్‌కు వెళ్లి నామినేషన్లు ఇవ్వాలి. గుర్తింపు పొందిన పార్టీ నుంచి పోటీ చేస్తుంటే ఆ వివరాలను ఫారమ్‌-2లో చెప్పాలి. బీఫామ్‌ను కూడా ఉపసంహరణ గడువు లోపు అధికారులు సమర్పించాలి. ఒక వేళ పొరపాటున ఈ వివరాలు సమర్పించకుంటే వాళ్లను స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటించి ఫ్రీ సింబర్ ఇస్తారు. గుర్తింపు పొందిన పార్టీ నుంచి పోటీ చేస్తే పార్టీ గుర్తును కేటాయిస్తారు. స్వతంత్ర అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన గుర్తుల్లో మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
Advertisement

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
AI Impact In India:భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
Mowgli 2025 OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'మోగ్లీ' - న్యూ ఇయర్ సర్ప్రైజ్... నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్
Embed widget