అన్వేషించండి

నర్సాపూర్ నుంచి పోటీ చేసి తీరుతా : సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

మెదక్‌ జిల్లా నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.

మెదక్‌ జిల్లా నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ నుంచి టికెట్‌ రాకపోయినా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. తన అనుచరులు, సన్నిహితులు ఒత్తిడి చేస్తున్నారని, అందుకే ఎన్నికల్లో  పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.  2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి చిలుముల మదన్‌రెడ్డి విజయం సాధించారు. మూడోసారి పోటీచేసి హ్యాట్రిక్‌ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. తనను నమ్ముకున్న వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రగతిభవన్‌కు రావాలని కబురు పంపినా ఆయన వెళ్లలేదు. ఇవాళ రావాలని కచితంగా రావాలని సమాచారం అందజేశారు.

సునీతా లక్ష్మారెడ్డికే టికెట్ ?
మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డికే అధిష్ఠానం టికెట్‌ ఇస్తుందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో మదన్ రెడ్డి అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంపై మద్దతుదారులు పలు రకాలుగా నిరసనలు తెలిపారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మదన్‌రెడ్డితో మాట్లాడినా స్పష్టత రాలేదు. ఓ వైపు అభ్యర్థులకు బీ-ఫాంలు అందజేస్తున్నా నర్సాపూర్‌ టికెట్ వ్యవహారంలో ఉత్కంఠ వీడటం లేదు. తాజాగా సీఎం కేసీఆర్‌ మదన్‌రెడ్డిని జనగామ, భువనగిరి ఎన్నికల ప్రచార సభలకు తన వెంట తీసుకెళ్లారు. మరో పదవి ఇస్తామని మదన్ రెడ్డికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.  కొన్ని రోజులుగా చిలుముల మదన్‌రెడ్డి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అనుచరులు మాత్రం పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు ముఖ్య నేతలకు ఫోన్‌ చేసి అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

పోటీ చేసి తీరుతానన్న మదన్ రెడ్డి
115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్, నర్సాపూర్, జనగాం, నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను పెండింగ్ లో పెట్టారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి 74 సంవత్సరాలు ఉండటంతో అభ్యర్థిని మార్చాలనే ఆలోచనలో ఉంది పార్టీ నాయకత్వం. మదన్ రెడ్డికి నర్సాపూర్ పార్టీ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ క్రమంలో మదన్ రెడ్డి తన ఫాలోవర్స్ తో కలిసి హరీశ్ రావు ఇంటి ముందు ధర్నా చెయ్యడం, ముఖ్యమంత్రిని, కేటీఆర్ కలిసి మళ్లీ తన పేరు ప్రకటించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తాను ఎన్నికల్లో పోటీచేస్తానని వెనుక్కి తగ్గేది లేదని మదన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. 

మూడుసార్లు గెలిచిన సునీతా లక్ష్మారెడ్డి
సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె. రోశయ్య మంత్రివర్గాల్లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో సునీత లక్ష్మా రెడ్డి, మహిళా సంక్షేమం, శిశు సంక్షేమం, ఇందిరా క్రాంతి, పెన్షన్ల పోర్ట్‌ఫోలియోను నిర్వహించారు. 2019 ఏప్రిల్ 3న మెదక్ లో ఆమె టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget