అన్వేషించండి

Macharla Tension: టీడీపీ 'చలో మాచర్ల' పిలుపుతో ఉద్రిక్తత - నేతల గృహ నిర్బంధం, భారీగా మోహరించిన పోలీసులు

Andhra Pradesh News: మాచర్లలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ చలో మాచర్లకు పిలుపునివ్వడంతో దీనికి అనుమతి లేదన్న పోలీసులు.. ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు.

TDP Leaders House Arrest In Macharla: టీడీపీ 'చలో మాచర్ల' (Chalo Macharla) పిలుపుతో మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన దాడుల్లో బాధితులను పరామర్శించేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతి లేదని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్.. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. టీడీపీ నేతలను మాచర్ల వెళ్లకుండా అడ్డుకున్నారు. గుంటూరులో నక్కా ఆనంద్, కనపర్తి శ్రీనివాస్ ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అటు, గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్యను సైతం హౌస్ అరెస్ట్ చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచే మాచర్ల టీడీపీ ఇంఛార్జీ జూలంకటి బ్రహ్మరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు.

పరారీలో పిన్నెల్లి?

మరోవైపు, ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. బుధవారం ఆయన్ను తెలంగాణలో అరెస్ట్ చేసినట్లు వార్తలు రాగా.. సంగారెడ్డి ఎస్పీ అవి అవాస్తవమని ఖండించారు. ఈవీఎం ధ్వంసం తర్వాత ఆయన పక్కా ప్లాన్‌తోనే పరారైనట్లు పోలీసులు నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు తన నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజీ బయటకు రాగా ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఆయన అరెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పిన్నెల్లి హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అక్కడకు వెళ్లారు. ఎమ్మెల్యేకు లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేసిన పోలీసులు తెలంగాణ పోలీసుల సాయంతో పిన్నెల్లిని పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.

పల్నాడులో కొనసాగుతోన్న 144 సెక్షన్

మరోవైపు, పల్నాడు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గత 10 రోజులుగా అక్కడ 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పోలింగ్ రోజు, తర్వాత పరిణామాల క్రమంలో ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు, సిట్ బృందం సైతం ఇక్కడ పర్యటించి హింసాత్మక ఘటనలపై నివేదికను డీజీపీకి అందించింది. ఇప్పటికే ఘర్షణలో పాల్గొని దాడులు చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు. గొడవల్లో పాల్గొన్న వారిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.

చంద్రగిరిలో పోలీసుల అలర్ట్

అటు, తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. నారావారిపల్లి, శేషాపురం, భీమవరంలో పోలీసులు మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలెవరూ గుమికూడవద్దని హెచ్చరించారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు ఎలాంటి అనుమతి లేదని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు 70 మంది కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇళ్లు, దుకాణాల్లో మారణాయుధాలు వంటి వాటిని గుర్తించే పనిలో పడ్డారు. ఎవరైనా రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget