అన్వేషించండి

TDP: ఆ 4 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మార్పు - చంద్రబాబు కీలక నిర్ణయం!

Andhrapradesh News: మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా టీడీపీ తాజాగా 4 స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబును ఆయా నేతలు కలిశారు.

Tdp Changed Candidates In 4 Places: ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీల పొత్తుల్లో బాగంగా టీడీపీ (Tdp) 144 అసెంబ్లీ స్థానాలకు గాను, 17 ఎంపీ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, టికెట్లు దక్కని నాయకులు చాలా చోట్ల అసహనం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా 4 చోట్ల టీడీపీ అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఆయా స్థానాల్లో మారిన రాజకీయ సమీకరణలు, శ్రేణులు, నేతల అభిప్రాయం మేరకు చంద్రబాబు (Chandrababu) ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి అసెంబ్లీ స్థానాల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, ఎంపీ రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎస్సీ సెల్ నేత ఎంఎస్ రాజు ఆదివారం చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. పాడేరు - గిడ్డి ఈశ్వరి, ఉండి - రఘురామకృష్ణంరాజు, మడకశిర - ఎంఎస్ రాజు, మాడుగుల - బండారు సత్యన్నారాయణకు కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అటు, వెంకటగిరి స్థానాన్ని ఇదివరకూ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. అయితే, మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించనున్నారు.

ఆ 2 స్థానాలపై సందిగ్థత

ఇవి కాకుండా కూటమి పొత్తుల్లో బాగంగా మరో రెండు స్థానాల్లో కూడా సందిగ్ధత కొనసాగుతోంది. అనపర్తి, దెందులూరు స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో.. అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సైతం ఆయనకు స్వయంగా ఫోన్ చేసి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. తాను టీడీపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే, పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో సమస్యలు తలెత్తడంతో.. ఆయన్ను బీజేపీ నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచించింది. ఈ క్రమంలో నల్లమిల్లి అనపర్తిలో బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. అనపర్తి స్థానంపై పూర్తి స్పష్టత వచ్చాకే దెందులూరు, తంబళ్లపల్లె అభ్యర్థులకు బీ ఫారాలను అందించనున్నట్లు సమాచారం.

మరోవైపు, 144 అసెంబ్లీ స్థానాలకు, 17 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్ధులకు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో ఆదివారం బీ ఫారాలు అందజేయనున్నారు. అలాగే, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార శైలిపై దిశానిర్దేశం చేయనున్నారు. అటు, చంద్రబాబు ఆదేశాలతో తోట సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరో సభ్యురాలిగా, ఉమ్మడి ప.గో జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు. అలాగే, నర్సాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు.

ముమ్మరంగా ప్రచారం

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కూటమి అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు, ప్రధాని మోదీ సైతం ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా 4 బహిరంగ సభల్లో పాల్గొంటారని కూటమి నేతలు పేర్కొంటున్నారు. 

Also Read: Gummanuru Jayaram: గుంతకల్లులో చంద్రబాబు వ్యూహం ఏంటి? టికెట్ ఆయనకే ఎందుకిచ్చారు?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
బ్యాడ్‌న్యూస్‌: దేశంలోనే నంబర్‌ 1 బైక్‌ Hero Splendor Plus ధర పెంపు, కొత్త ధరల లిస్ట్‌ ఇదిగో!
బ్యాడ్‌న్యూస్‌, పల్లె నుంచి పట్నం దాకా సామాన్యులు వాడే ఈ బైక్‌ రేటు పెంపు

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
బ్యాడ్‌న్యూస్‌: దేశంలోనే నంబర్‌ 1 బైక్‌ Hero Splendor Plus ధర పెంపు, కొత్త ధరల లిస్ట్‌ ఇదిగో!
బ్యాడ్‌న్యూస్‌, పల్లె నుంచి పట్నం దాకా సామాన్యులు వాడే ఈ బైక్‌ రేటు పెంపు
Ee Nagaraniki Emaindi Sequel Cast: 'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
Nandyala Crime News:నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
Mana Shankara Vara Prasad Garu BO Day 10: బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
Embed widget