అన్వేషించండి

Telangana Janasena - BJP : పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ - కలిసి పోటీ చేయబోతున్నారా ?

పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేశం అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు కోరారు.. కలసి పోటీ చేస్తారా లేకపోతే బీజేపీకి మద్దతు ప్రకటిస్తారా అన్నది త్వరలో క్లారిటీ రానుంది.


Telangana Janasena - BJP : తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గేర్ మార్చినట్టు కనిపిస్తోంది. ఓ వైపు అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తు చేస్తూనే మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భగంగానే జనసేన మద్దతు కోరారు. పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమైన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్ చేసినట్టు తెలుస్తోంది.  తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. 

తెలంగాణలో 32 చోట్ల పోటీ చేస్తామని జాబితాను జనసేన పార్టీ విడుదల చేసింది. అయితే హఠాత్తుగా పోటీపై వెనక్కి తగ్గవద్దని పవన్ కల్యాణ్ ను ఆ పార్టీ నాయకులు కోరినట్లుగా .. జనసేననే ప్రకటించింది. అసలు వెనక్కి తగ్గే ప్రస్తావన ఎందుకు వచ్చిందన్నది జనసేన వర్గాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. తెలంగాణలో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు పవన్ తో సమావేశమయ్యారు. 2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో పోటీ చేయరాదన్న అధ్యక్షుని అభిప్రాయాన్ని గౌరవించి పోటీకి పట్టుపట్టలేదని తెలిపారు. మిత్రపక్షమైన బి.జె.పి. విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ నుంచి విరమించుకున్నామని, ఈసారి తప్పనిసరిగా పోటీ చేస్తామన్నారు.                            

ఎన్నాళ్ళ నుంచో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని, ఈ దఫా పోటీ చేయకపోతే తెలంగాణాలో పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నట్లవుతుందన్నారు. ప్రజల ముందుకు భవిషత్తులో బలంగా వెళ్లడం కష్టమేనని, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని స్పష్టం చేశారు. పోటీ విషయంలో తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని పవన్ కల్యాణ్ అంగీకరించారు. అయితే నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు. సరైన నిర్ణయం తీసుకోడానికి ఒకటిరెండు రోజుల సమయం అవసరమని పవన్ కల్యాణ్ వారికి తెలిపారు. తెలంగాణలో పోటీ చేయడానికి పవన్ అనుమతి లేకుండా స్థానాలను ప్రకటించే అవకాశం లేదు. మరి ఎందుకు వెనక్కి తగ్గే ఆలోచన ఉన్నట్లుగా ప్రకటన చేస్తున్నారన్నది సస్పెన్స్ గా మారింది.                                 

ఈ ప్రకటన వచ్చిన తర్వాతి రోజు ఉదయమే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పవన్ కల్యాణ్ ను కలిశారు. అయితే పూర్తి స్థాయిలో పోటీకి దూరంగా ఉండే అవకాశం లేదని.. చాలా కాలంగా పోటీ కోసం ఎదురు చూస్తున్న జనసేన నేతలు.. అసంతృప్తికి గురవుతారని అంటున్నారు. అందుకే ముఖ్య నేతలకు అయినా పోటీ చేసే అవకాశాన్ని కూటమిలో భాగంగా పవన్ కల్యాణ్ ఇప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయడమా లేకపోతే బీజేపీకి మద్దతు ఇవ్వడమా అన్నదానిపై  తెర వెనుక కొన్ని అంతర్గత రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని.. పవన్ సమావేశం ద్వారా స్పష్టమయిందని చెబుతున్నారు.                      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget