అన్వేషించండి

AP Politics: ఏపీలో ఇండియా కూటమి, పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్న షర్మిల

Sharmila On Alliance:రాష్ట్రంలో మరో కూటమి ఏర్పాటు కాబోతోంది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిపి కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా ఏర్పాటు కాబోతున్నాయి.

Andhra Pradesh News: రాష్ట్రంలో మరో కూటమి ఏర్పాటు కాబోతోంది. కాంగ్రెస్‌ సారథ్యంలో కేంద్రంలో ఏర్పాటైన ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిపి కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కూటమిగా ఏర్పాటు కాబోతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలా రెడ్డి మీడియా ముఖంగా దీన్ని ప్రకటించారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధమయ్యామని, భవిష్యత్‌లో కలిసి పోటీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని అధికార వైసీపీని గద్దె దించాలంటే బలంగా ఉండాలని, అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నామని ఆమె స్పష్టం చేశారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, శ్రీనివాసరావుతో కలిసి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 

ప్రజలు కోసం పోరాటాలకు సిద్ధం

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్‌లో చేపట్టే పోరాటాలను ఇకపై కలిసి కట్టుగా చేయనున్నట్టు షర్మిలా రెడ్డి ప్రకటించారు. సీపీఎం, సీపీఐ పార్టీలతో కలిసి ప్రభుత్వంపై పోరాటాన్ని సాగిస్తామన్నారు. గతంలోనే రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవడంపై సీతారాం ఏచూరితో చర్చించినట్టు ఆమె తెలిపారు. తనకు ఇరు పార్టీలు సంఘీభావం తెలపడంతోపాటు కలిసి పోరాటం చేద్దామన్నారని, అందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ.. కేంద్రంలోని బీజేపీకి బీ టీమ్‌లుగా ఉన్నాయని, కాబట్టి తామంతా కలిసి కట్టుగా పోరాటం చేయకపోతే పెద్ద పర్వతాలను దించడం అసాధ్యమన్నారు. రెండు పార్టీలతో కలిసే భవిష్యత్‌లో కార్యక్రమాలను నిర్వహిస్తామని షర్మిల వెల్లడించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. యువత సమస్యలపై ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేస్తున్నాయని, తాజాగా మెగా డీఎస్సీ కోరుతూ తాను చేసిన నిరసనకు వాళ్లు సంఘీభావాన్ని తెలియజేశారని, మరోసారి మద్ధతు ప్రకటించేందుకు వచ్చినట్టు షర్మిల తెలియజేశారు. 

ఖర్గే సభకు ఇరు పార్టీలకు ఆహ్వానం

ఈ నెల 26న ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ్యంలో అనంతపురంలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారన్నారు. ఈ సభకు సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా హాజరుకావాలని ఈ సందర్భంగా షర్మిల ఇరువురు నేతలను ఆహ్వానించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో కలిసి కట్టుగా ఒకో ఫోర్స్‌లా తయారు కావాలని నిర్ణయించామన్నారు. లేకపోతే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీని కొట్టడం కష్టమని, అందుకే కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పొత్తులపై చర్చలు జరగలేదంటే అబద్దాలు చెప్పినటట్టు అవుతందని, చర్చలు జరుగుతున్నాయని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేసినప్పుడు.. కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. వీలైనంత వరకు ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ.. ప్రజాప్రతినిధులను తయారు చేసే దిశగా పొత్తులు ఉంటాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 2014 అధికారంలోకి వచ్చి ఉంటే అప్పుడే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని పీసీసీ ప్రెసిడెంట్‌ షర్మిల స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget