అన్వేషించండి

TDP Leaders: పిఠాపురం నుంచి పెనమలూరు వరకు ఆగ్రహజ్వాల- సీటు దక్కలేదని నేతల ఫైర్

Andhra Pradesh News: టీడీపీలో రెండో జాబితా, జనసేన అభ్యర్థుల ప్రకటన తెలుగుదేశంలో చిచ్చురేపింది. టికెట్ దక్కలేదని నాయకులు వారి అనుచరులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 3 నియోజకవర్గాల్లో ఇది కనిపిస్తోంది.

AP Elections 2024: పొత్తుల్లో భాగంగా టీడీపీ(TDP) 144 సీట్లలో జనసేన(Janasena) 21 సీట్లలో బీజేపీ(BJP) 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అప్పటి వరకు అక్కడ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న నేతలకు సీటుపోటు తప్పలేదు. మరికొందరికి ప్రజాబలం లేనట్టు సర్వేల్లో వచ్చిందని పార్టీ అధినాయకత్వం వేరే లీడర్‌కు సీటు ఇచ్చింది. సీటు తమకే వస్తుందని ఆశలు పెట్టుకున్న లీడర్లు ఇప్పుడు ఉగ్రరూపం చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఈ పరిస్థితి వైసీపీలో కనిపించేది... అక్కడ కాకా చల్లారింది. ఇప్పుడు ఈ ఫైర్‌ కూటమి పార్టీల్లో కనిపిస్తోంది. 

ఆగ్రహ జ్వాల

కేసులు ఎదురొడ్డి అధికా పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా  కష్టపడి పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తే పోటీకి అన్ని సర్దుకున్న టైంలో వేరే వ్యక్తి వచ్చి టికెట్‌ కొట్టేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు నేతలు. ఇది నమ్మద్రోహమని ఆరోపిస్తున్నారు. సైలెంట్‌గా ఉండిపోతే వీక్ అయిపోతామని గ్రహించి ఆందోళనకు పూనుకుంటున్నారు. 

పిఠాపురంలో ఫైర్

ఇలా అసంతృప్తితో రగిలిపోతున్న నియోజకవర్గాల్లో మొదటిది పిఠాపురం(Pithapuram). ఇక్కడ పొత్తుల్లో భాగంగా ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు సీటు తనకే వస్తుందని టీడీపీ లీడర్‌ ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ(SVSN Varma) పని చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల్లోనే ఉంటూ పార్టీని బలోపేతం చేశారు. మారిన రాజకీయ సమీకరణాలతో ఆ స్థానం పవన్ పోటీ చేస్తున్నారు. 

ముందే చెప్పిన ఏబీపీ దేశం

పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం నడుస్తోందని ముందు నుంచే ఏబీపీ దేశం(ABP Desam) చెబుతూ వస్తోంది. మొదట్లో పవన్ పోటీ చేస్తే తాను దగ్గరుండి గెలిపిస్తానంటూ చెప్పుకొచ్చిన వర్మ చివర్లో ప్లేట్‌ ఫిరాయించారు. తనకే సీటు ఇవ్వాలని తనకి కాకుండా ఎవరు పోటీ చేసినా ఊరుకునేది లేదన్నారు. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానంటూ ప్రతినబూనారు. 

వర్మ లోకల్‌ వాయిస్

ఈ మధ్య లోకల్‌ ఫ్లేవర్‌ని కూడా తీసుకొచ్చారు వర్మ. లోకల్‌గా ఉన్న వ్యక్తే ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తారని స్థానికుడికే టికెట్ ఇవ్వాలంటూ తన అనుచరులతో ఫ్లెక్సీలు పెట్టించాడు. ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెంచినా పిఠాపురం టికెట్‌ జనసేనకు ఇచ్చేశారు చంద్రబాబు. దీంతో వర్మ, ఆయన అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టీడీపీ ఫ్లెక్సీలు తగుల బెట్టారు. టీడీపీకి ,చంద్రబాబు(Chandra Babu)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

నేడు అనుచరులతో భేటీ

భవిష్యత్ కార్యచరణపై ఇవాళ వర్మ తన అనుచరులతో సమావేశం కానున్నారు. స్వతంత్రంగా పోటీ చేయడమా లేకుంటే వేరే ఆలోచన చేయడమా అనేది తేల్చనున్నారు. 2014లో కూడా ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. అప్పుడు కూడా  పీవీ విశ్వం అనే నేతలు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన వర్మ 47వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత టీడీపీలో చేరిపోయారు. 2019లో వర్మ టీడీప టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ జనసేన తరఫున పోటీ చేసిన శేషుకుమారి ఓట్లు చీల్చడంతో వర్మకు ఓటమి తప్పలేదు. 

జవహర్‌ అసంతృప్తి

మరో టీడీపీ లీడర్ జవహర్‌ కూడా ఫైర్‌ మీద ఉన్నారు. తూర్పుగోదావరి(East Godavari) జిల్లా కొవ్వూరు(Kovvur) టికెట్‌పై జవహర్‌(Jawahar) ఆశలు పెట్టుకున్నారు. అయితే సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారన్న కారణంతో అక్కడ టికెట్‌ను ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించారు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తాను కృషి చేశానని తనకే టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు. తనకు టికెట్‌ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానంటూ చెబుతున్నారు. ఇవాళ తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. 

పెనమలూరులో ప్రకంపనలు

ఇంకా ప్రకటించకపోయినా పెనమలూరు(Penamaluru) టికెట్‌ రగడ టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇక్కడ టీడీపీ చేసిన సర్వేల్లో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌(Bode Prasad)తోపాటు దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. దీంతో బోడే ప్రసాద్ వర్గీయులు స్థానికత కార్డును బయటకు తీశారు. పెనమలూరులో స్థానికేతరులు వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. బోడే ప్రసాద్ కూడా ఈ నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. తాను ఐదేళ్లుగా ప్రజల్లో తిరుగుతూ పార్టీ బలోపేతానికి కష్టపడ్డానని చెబుతున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. అలాంటి తనకు టికెట్ ఇవ్వకుండా వేరే ఆలోచన చేయొద్దని అధినాయకత్వానికి హెచ్చరించారు. ఇప్పటికీ చంద్రబాబుపై తనకు నమ్మకం ఉందని తనకే టికెట్ ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తూనే హెచ్చరిక కూడా చేశారు. అనుచరులు ఎవరూ ఆవేశ పడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించార. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Hospitalised: సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Embed widget